రైతుల భవితవ్యాన్ని మార్చనున్న రెండు కొత్త‌ పథకాలు ‌‌ – New Agriculture Schemes

రైతుల భవితవ్యాన్ని మార్చనున్న రెండు కొత్త‌ పథకాలు ‌‌ – New Agriculture Schemes
Spread the love

దేశంలో రైతుల సంక్షేమం కోసం PM-DDKY,
పప్పుధాన్యాల ఆత్మనిర్భరత మిషన్ ప‌థ‌కాలు ప్రారంభం

New Agriculture Schemes 2025 | ప్రధానమంత్రి న‌రేంద్ర‌ మోదీ రూ.35,440 కోట్లతో రెండు ప్రధాన వ్యవసాయ పథకాలు ప్రారంభించారు. PM-DDKY ద్వారా 100 జిల్లాలను అభివృద్ధి చేయడం, పప్పుధాన్యాల ఉత్పత్తి పెంచి స్వయం సమృద్ధి సాధించడం ఈ ప‌థ‌కాల‌ లక్ష్యం. రైతులు విక‌సిత్ భారత్ దిశగా ముందుకు సాగాలని ప్ర‌ధాని మోదీ పిలుపునిచ్చారు.

దేశీయ, ప్రపంచ డిమాండ్‌ను తీర్చడానికి ఉత్పత్తిని పెంచాలని రైతులకు ప్ర‌ధాని పిలుపునిచ్చారు. దేశ రాజధానిలోని పూసా క్యాంపస్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ, 2047 నాటికి విక‌సిత్ భారత్ దార్శనికతను సాకారం చేసుకోవడంలో రైతులు కీలక పాత్ర పోషించాలని అన్నారు.

రెండు పెద్ద పథకాలు – రూ. 24,000 కోట్ల ప్రధాన మంత్రి ధన్ ధాన్య కృషి యోజన (PM-DDKY), పప్పుధాన్యాలలో ఆత్మనిర్భరత కోసం రూ. 11,440 కోట్ల మిషన్ – “లక్షలాది మంది రైతుల విధిని మారుస్తాయి” అని ఆయన అన్నారు.
దీనితో పాటు, వ్యవసాయం, పశుసంవర్ధకం, మత్స్య, ఆహార ప్రాసెసింగ్ రంగాలలో రూ.5,450 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులను కూడా ప్రధాని మోదీ ప్రారంభించారు, దాదాపు రూ.815 కోట్ల విలువైన అదనపు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు.

ప్రధాన మంత్రి ధన్ ధాన్య కృషి యోజన:

Pradhan Mantri Dhan Dhaanya Krishi Yojana : PM-DDKY పథకం కింద వ్యవసాయంలో వెనుకబడిన 100 జిల్లాలను ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్ (ADP) ద్వారా ఆదర్శంగా తీర్చదిద్దనున్నారు. ఈ పథకం పంట ఉత్పాదకతను పెంచడం, పంట వైవిధ్యతను ప్రోత్సహించడం, నీటిపారుదల, వ్యవసాయ ఉత్పత్తుల నిల్వ సౌకర్యాలను మెరుగుపరచడం, ఎంపిక చేసిన జిల్లాల్లో రుణ సదుపాయాన్ని మెరుగుపరచనున్నారు.

పప్పుధాన్యాలలో ఆత్మనిర్భరత మిషన్:

Mission for Aatmanirbharta in Pulses : పప్పుధాన్యాల మిషన్ కోసం, ఉత్పత్తిని పెంచడానికి అలాగే స్వయం సమృద్ధి సాధించడానికి 2030 నాటికి పప్పుధాన్యాల విస్తీర్ణం 35 లక్షల హెక్టార్లకు పెంచాలని ప్రధాని మోదీ రైతులను కోరారు. ఈ మిషన్ పప్పుధాన్యాల ఉత్పత్తిని ప్రస్తుత 252.38 లక్షల టన్నుల నుంచి 2030-31 నాటికి 350 లక్షల టన్నులకు పెంచడం, తద్వారా దిగుమతి ఆధారపడటాన్ని తగ్గించాలని లక్ష్యంగా నిర్ణయించారు.

గత 11 సంవత్సరాలలో తీసుకున్న చర్యలను ప్రధాని మోదీ హైలైట్ చేశారు వ్యవసాయం మరియు అనుబంధ రంగాల సమగ్ర అభివృద్ధి కోసం గత 11 సంవత్సరాలుగా తీసుకున్న వివిధ చర్యలను ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. “రైతుల ప్రయోజనాల దృష్ట్యా, మేము విత్తనం నుండి మార్కెట్ వరకు (బీజ్ సే బజార్ తక్) అనేక సంస్కరణలు తీసుకున్నాము” అని ఆయన అన్నారు.

తన పదవీకాలంలో ఈ రంగం సాధించిన విజయాలను వివరిస్తూ, వ్యవసాయ ఎగుమతులు రెట్టింపు అయ్యాయని, ఆహార ధాన్యాల ఉత్పత్తి 900 లక్షల టన్నులు పెరిగిందని, పండ్లు, కూరగాయల ఉత్పత్తి 640 లక్షల టన్నులు పెరిగిందని మోదీ అన్నారు. ఇటీవల వస్తువులు మరియు సేవల పన్ను (జిఎస్టి) రేట్ల తగ్గింపు గ్రామీణ భారతదేశానికి మరియు రైతులకు ఎక్కువగా ప్రయోజనం చేకూర్చిందని, ట్రాక్టర్ల వంటి వ్యవసాయ యంత్రాల ధరలు తగ్గుతున్నాయని మోడీ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, మత్స్య, పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్, వ్యవసాయ శాఖ సహాయ మంత్రి భగీరథ్ చౌదరి పాల్గొన్నారు.

Kiran.P

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు