Harithamithra Telugu News

Home EV Updates Simple One electric scooter ప్రీబుకింగ్స్‌..

Simple One electric scooter ప్రీబుకింగ్స్‌..

0
Simple-Energy-electric-scooter
Simple-Energy-electric-scooter

రూ.1947తో ప్రీబుకింగ్స్‌

simple one electric scooter
simple one electric scooter

సింపుల్ ఎనర్జీ, బెంగుళూరుకు చెందిన ఎల‌క్ట్రిక్ వాహ‌న‌ తయారీ సంస్థ గురువారం నుంచి తన ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ స్కూటర్ Simple One electric scooter కోసం ప్రీ-బుకింగ్స్ ను ప్రారంభించింది. సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూట‌ర్‌ను 15 ఆగస్టు, 2021 న ఆవిష్క‌రించ‌నున్న విష‌యం తెలిసందే. అయితే ప్రీ బుకింగ్స్ కోసం రూ.1,947 చెల్లించాల‌ని కంపెనీ ప్ర‌క‌టించింది. ఈ ప్రీ-బుకింగ్ సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభమవుతుంది. వాహనాన్ని కంపెనీ వెబ్‌సైట్‌లో బుక్ చేసుకోవచ్చు. ప్రీ-బుకింగ్ మొత్తం వాపసు చేయబడుతుంది. ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ల విక్ర‌యించేట‌ప్పుడు ప్రీ-ఆర్డర్ చేసుకున్న‌వారికి ప్రాధాన్యం ఇస్తారు.

6కిలోల బ్యాట‌రీ..

ప్రీబుకింగ్ వివ‌రాల‌తోప‌టు సింపుల్ ఎన‌ర్జీ కంపెనీ త‌న Simple One electric scooter కు సంబంధించి మ‌రికొత స‌మాచారాన్ని పంచుకుంది. క‌ సింపుల్ ఎనర్జీ స్కూటర్ కోసం బూడిద రంగులో ఉన్న‌ పోర్టబుల్(డిటాచ‌బుల్‌) బ్యాటరీ ప్యాక్‌ను ఉప‌యోగించారు. బ్యాటరీ ప్యాక్ బరువు 6 కిలోలకు పైగా ఉంటుంది. ఈ బ్యాటరీ ప్యాక్ భారతీయ వినియోగం కోసం కస్టమ్-బిల్ట్ చేయబడింది, దీనిని వాహ‌నం నుంచి వేరు చేసి ఇంటిలోనే ఛార్జ్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది.

సింగిల్ చార్జిపై 240కి.మి

Simple One electric scooter ఫీచ‌ర్లను గ‌మ‌నిస్తే.. ఇందులో 4.8 kWh లిథియం-అయాన్ బ్యాటరీ ఉంటుంది. ఒక్క‌సారి చార్జి చేస్తే 240 కి.మీ. ప్ర‌యాణించ‌వ‌చ్చు. ఇది టచ్ స్క్రీన్, ఆన్‌బోర్డ్ నావిగేషన్, బ్లూటూత్ మొదలైన స్మార్ట్ ఫీచర్‌లతో వస్తుంది, ఇ-స్కూటర్ ధర 1,10,000 నుండి 1,20,000 వరకు ఉండ‌వ‌చ్చ‌ని అంచ‌నా.

13 రాష్ట్రాలలో విడుద‌ల

మొద‌టి విడ‌త‌లో సింపుల్ వన్ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌ను 13 రాష్ట్రాలలో విడుద‌ల చేయ‌నుంది. ఇందుకోసం తమిళనాడులోని హోసూర్‌లో 2 లక్షల చదరపు అడుగుల కర్మాగారాన్ని ఏర్పాటు చేశారు. దీనిపై సింపుల్ ఎనర్జీ వ్యవస్థాపకుడు మరియు CEO సుహాస్ రాజ్‌కుమార్ మాట్లాడుతూ, “సింపుల్ వన్ ద్వారా, EV ఇండస్ట్రీలో ఒక బెంచ్‌మార్క్‌ను సృష్టించాలని ఆశిస్తున్న‌ట్లు తెలిపారు. ఆగ‌స్టు 15 కూడా త‌మ‌కు చారిత్రాత్మకమైన రోజని పేర్కొన్నారు.

Previous articleఏథ‌ర్ ఎన‌ర్జీ.. fast-charging Stations…
Next articleRevolt RV400 క‌స్ట‌మ‌ర్ల‌కు శుభవార్త‌
Kiran Podishetty
కిరణ్ పొడిశెట్టి, హరితమిత్ర మీడియా వ్యవస్థాపకులు, పర్యావరణ పరిరక్షణకు అంకితభావంతో పనిచేస్తున్న సీనియ‌ర్‌ జర్నలిస్ట్. ఎమ్మెస్సీ, ఎంజీజే పూర్తిచేసిన‌ ఆయనకు ప్రింట్ మీడియా రంగంలో 17 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికల్లో సబ్‌ ఎడిటర్‌గా ప‌నిచేశారు. హరితమిత్ర ద్వారా ఆయన సేంద్రియ వ్యవసాయం, సోలార్ ఎనర్జీ, గ్రీన్ మొబిలిటీ (ఎలక్ట్రిక్‌, సిఎన్‌జి వాహనాలు) ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ వంటి అంశాలపై నిరంతరం విశ్లేషణాత్మక కథనాలు, తాజా అప్‌డేట్స్‌ను అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here