Ev పరిశ్రమ కోసం bajaj auto భారీ పెట్టుబడి
భారతదేశంలోని ప్రముఖ ద్విచక్ర వాహన దిగ్గజం bajaj auto (బజాజ్ ఆటో లిమిటెడ్..) తాజాగా ఎలక్ట్రిక్ వాహనాల కోసం కొన్ని ప్రతిష్టాత్మక ప్లాన్లను ప్రకటించింది. మహారాష్ట్రలోని అకుర్డి (పుణె)లో కొత్త ఎలక్ట్రిక్ వాహనాల తయారీ యూనిట్ నిర్మాణం కోసం అలాగే ఎగుమతుల కోసం రూ. 300 కోట్లు (USD 40 మిలియన్లు) పెట్టుబడి పెట్టనున్నట్లు కంపెనీ గురువారం ప్రకటించింది. వాస్తవానికి, బజాజ్ ఇప్పటికే తన సరికొత్త తయారీ కేంద్రం వద్ద వర్క్ను ప్రారంభించింది. ఈ యూనిట్లో సంవత్సరానికి 5,00,000 ఎలక్ట్రిక్ స్కూటర్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని పేర్కొంది. జూన్ 2022 నాటికి ఈ కొత్త పరిశ్రమ నుంచి మొదటి ఎలక్ట్రిక్ వాహనం విడుదల కానుంది.బజాజ్ ఆటోను భారతదేశంలో ఇంటి పేరుగా మార్చిన అసలైన చేతక్ స్కూటర్ కర్మాగారం కూడా అకుర్ది (పుణే) అని కంపెనీ పేర్కొనడం విశేషం. బజాజ్ కొత్త EV తయారీ కర్మాగారం.. అర మిలియన్ చదరపు అడుగుల వ...