
Electric Vehicle Park : కర్నూలులో 12,00 ఎకరాల్లో ఎలక్ట్రిక్ వెహికిల్ పార్క్..
Electric Vehicle Park : ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలో 1,200 ఎకరాల విస్తీర్ణంలో ఎలక్ట్రిక్ వెహికల్ పార్క్ ఏర్పాటుకానుంది. ఈ మేరకు ఓర్వకల్ మొబిలిటీ వ్యాలీ (Orvakal Mobility Valley) ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వంతో పీపుల్ టెక్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్, పీపుల్ టెక్ గ్రూప్ సంస్థ అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకుంది.ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్(Nara Lokesh), పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ సమక్షంలో పీపుల్ టెక్ గ్రూప్ సీఈవో టీజీ విశ్వ ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు సీఈవో సాయికాంత్ వర్మ ఎంఓయూపై సంతకాలు చేశారు.ఈ ప్రాజెక్టుకు నాయకత్వం వహించడం గర్వంగా ఉందని విశ్వప్రసాద్ అన్నారు. ఓర్వకల్ మొబిలిటీ వ్యాలీ దేశంలోని ప్రైవేట్ EV పార్కుల కోసం బెంచ్మార్క్ను సెట్ చేస్తుంది. ఈ ఓర్వకల్ మొబిలిటీ వ్యాలీ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, ఆవిష్కరణ, ఉపాధికి అవకాశాలను సృష్ట...