
Green Hydrogen | 2030 నాటికి ఏటా 5 మిలియన్ మెట్రిక్టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేస్తాం..
New Delhi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) మంగళవారం 2025 ఇండియా ఎనర్జీ వీక్ (India Energy Week 2025) ను వర్చువల్గా ప్రారంభించి ప్రసంగించారు. భారతదేశం ప్రతిష్టాత్మక ఇంధన రోడ్మ్యాప్ను వివరిస్తూ, రాబోయే రెండు దశాబ్దాలు దేశ వృద్ధికి కీలకమని ఆయన చెప్పారు. "రాబోయే రెండు దశాబ్దాలు భారతదేశానికి చాలా కీలకమైనవి, రాబోయే ఐదు సంవత్సరాలలో, మేము అనేక ప్రధాన మైలురాళ్లను సాధించబోతున్నాం. మా లక్ష్యాలలో చాలా వరకు 2030 గడువులోపు సాధించాలని నిర్ణయించుకున్నాం. 2030 నాటికి, మేము 500 GW పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని (Green Hydrogen) పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాం" అని ప్రధానమంత్రి అన్నారు."భారత రైల్వేలు 2030 నాటికి నికర జీరో కార్బన్ ఉద్గార లక్ష్యాన్ని నిర్దేశించాయి. అదనంగా, 2030 నాటికి ఏటా 5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ను ఉత్పత్తి చేయడమే మా లక్ష్యం" అని ప్రధాని మోదీ అన...