Harithamithra Telugu News

Home EV Updates E-scooters Tata Avinya: టాటా నుంచి మరో అద్భుతం.. అదిరిపోయే ఫీచర్లతో ఎలక్ట్రిక్‌ కార్‌..

Tata Avinya: టాటా నుంచి మరో అద్భుతం.. అదిరిపోయే ఫీచర్లతో ఎలక్ట్రిక్‌ కార్‌..

0

Tata Avinya: ఎలక్ట్రిక్‌ కార్ల తయారీలో సమూల మార్పులు వచ్చాయి. హైటెక్ ఫీచర్లతో ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కార్లను సైతం తయారు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా దేశీయ ఆటోమొబైల్ సంస్థ టాటా మార్కెట్లోకి సరికొత్త ఎలక్ట్రిక్‌ కారును తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. బ్రిటీష్‌ లగ్జరీ కార్ల తయారీ సంస్థతో పాటు టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ (TPEM) మధ్య కుదిరిన ఒక ఒప్పందంలో భాగంగా జాగ్వార్ ల్యాండ్ రోవర్ (JLR) ఎలక్ట్రిఫైడ్‌ మాడ్యులర్ ఆర్కిటెక్చర్ (EMA) ప్లాట్‌ఫాం కొత్త ఎలక్ట్రిక్‌ కారును విడుదల ‌ చేయనుంది. టాటా అవిన్య (Tata Avinya) పేరుతో ఈ కారును రూపొందిస్తున్నట్లు టాటా సంస్థ అధికారికంగా ప్రకటించింది.

ప్రస్తుతం ఆటోమొబైల్ మార్కెట్ లో ఎలక్ట్రిక్‌ వాహనాలకు డిమాండ్ పెరుగుతూ వస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీకి ప్రభుత్వాలు ఊతమివ్వడం, ప్రజలు కూడా ఈవీలను ‌ వాడడానికి ఆసక్తి చూపిస్తుండడంతో ఈ రంగం వేగంగా దూసుకెళ్తోంది. దీంతో బడా ఆటో మొబైల్ సంస్థలు కూడా ఈవీలను తయారు చేస్తున్నాయి.

ఇదిలా ఉండగా టాటా అనుబంధ సంస్థలైన జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌, టాటా ప్యాసింజర్‌ ఎలక్ట్రిక్ ‌ మొబిలిటీ సంయక్తంగా ఈ కారును రూపొందిస్తున్నాయి. ఈ ప్రీమియం కారు తయారీకి ఎలక్ట్రికల్ ఆర్కిటెక్చర్, ఎలక్ట్రిక్ డ్రైవ్ యూనిట్, బ్యాటరీ ప్యాక్, తయారీ పరిజ్ఞానంతో కూడిన రాయల్టీ కోసం ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. టాటా మొటార్స్‌ తొలిసారిగా అవిన్య కాన్సెప్ట్‌ను 2022వ సంవత్సరంలో ప్రదర్శించింది. 2025 నాటికి ఈ కారును మార్కెట్‌లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ కారులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ టెక్నాలజీని అందించనున్నారు. ‘అవిన్య ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీలో సరికొత్త చరిత్రకు నాందీ పలుకుతుందని. ఈ కారును మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు జేఎల్‌ఆర్‌, ఈఎం‌ఏ ప్లాట్‌ఫాంలు తమకు సహకరించడం చాలా ఆనందంగా ఉందని టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ చీఫ్‌ ప్రొడక్ట్ ఆఫీసర్‌ ఆనంద్‌ కులకర్ణి వెల్లడించారు.

ఈ కారు డిజైన్‌ విషయానికొస్తే.. అద్భుతంగా తీర్చిదిద్దారు. అత్యాధునిక ఫీచర్లతో, హైటెక్ హంగులతో రూపొందించారు. ఈ కారులో సైడ్‌ మిర్రర్లు ఉండవు, బయటి వ్యూన్‌ నేరుగా కారు డిస్‌ప్లేలోనే చూసుకోవచ్చు.. కారు వెనుక ‘T’ డిజైన్‌లో టెయిల్స్‌ ల్యాంప్‌లు ఏర్పాటు చేశారు. ఈ కారును ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే ఏకంగా 500 నుంచి 700 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. ఎస్‌యూవీ ని పోలిన విధంగా ఈ కారు పూర్తిస్థాయిలో వాయిస్‌ కంట్రోల్‌తో పనిచేస్తుంది. కారు స్టీరింగ్‌ను కూడా ప్రత్యేకంగా డిజైన్‌ చేశారు. ధర, పూర్తిస్థాయి ఫీచర్ల వివరాలను కంపెనీ త్వరలోనే వెల్లడించనుంది.

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో ఫాలో కండి

Previous articleMicrogreens: మైక్రో గ్రీన్స్‌ ఇంట్లో ఎలా పెంచాలి? ఎలా తినాలో తెలుసుకోండి..
Next articleJoy e-bike: 6 నెలల్లో 100 కొత్త షోరూమ్‌లు.. విస్తరణ బాటలో Wardwizard
Kiran Podishetty
కిరణ్ పొడిశెట్టి, హరితమిత్ర మీడియా వ్యవస్థాపకులు, పర్యావరణ పరిరక్షణకు అంకితభావంతో పనిచేస్తున్న సీనియ‌ర్‌ జర్నలిస్ట్. ఎమ్మెస్సీ, ఎంజీజే పూర్తిచేసిన‌ ఆయనకు ప్రింట్ మీడియా రంగంలో 17 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికల్లో సబ్‌ ఎడిటర్‌గా ప‌నిచేశారు. హరితమిత్ర ద్వారా ఆయన సేంద్రియ వ్యవసాయం, సోలార్ ఎనర్జీ, గ్రీన్ మొబిలిటీ (ఎలక్ట్రిక్‌, సిఎన్‌జి వాహనాలు) ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ వంటి అంశాలపై నిరంతరం విశ్లేషణాత్మక కథనాలు, తాజా అప్‌డేట్స్‌ను అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here