ప్ర‌పంచంలోనే అతిపెద్ద ఎల‌క్ట్రిక్ త్రీవీల‌ర్ ప్లాంట్

ప్ర‌పంచంలోనే అతిపెద్ద ఎల‌క్ట్రిక్ త్రీవీల‌ర్ ప్లాంట్

Omega Seiki Mobility క‌ర్ణాట‌క‌లో ఏర్పాటు చేస్తోంది..

ఫరీదాబాద్‌కు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ Omega Seiki Mobility (ఒమేగా సీకి మొబిలిటీ ) కర్ణాటకలో USD 250 మిలియన్ల (సుమారు రూ. 1,900 కోట్లు) పెట్టుబడితో ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ తయారీ ప్లాంట్‌ను ( world’s largest electric three-wheeler plant ) ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది.

250 ఎకరాల స్థలంలో మూడు దశల్లో ఈ ప్లాంటును నిర్మించ‌నున్నారు. ఏటా ఒక మిలియన్ ఎలక్ట్రిక్ త్రీ-వీలర్లను ఉత్పత్తి చేయగల సామర్థ్యం దీని సొంతం. ఈ మెగా ఫ్యాక్టరీ వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి దేశీయ, అంతర్జాతీయ మార్కెట్‌లకు అనుగుణంగా ఉత్పత్తిని ప్రారంభిస్తుందని Omega Seiki Mobility (OSM ) తెలిపింది. ఈ ప్లాంట్‌ను నెలకొల్పేందుకు కంపెనీ ఈక్విటీ. డెట్ ద్వారా మూలధనాన్ని కూడా సేకరిస్తుంది.

omega seiki factory

త్వ‌ర‌లో ప్యాసింజ‌ర్ త్రీ వీల‌ర్

కొత్త మెగా ఫ్యాక్టరీ సమీపంలో అనుబంధ తయారీ యూనిట్లను ఏర్పాటు చేయడానికి ఇప్పటికే ఉన్న కొత్త స‌ప్ల‌య‌ర్స్ తో చర్చలు జరుపుతున్నట్లు OSM తెలిపింది. ఇందులో మొత్తం ఎలక్ట్రిక్ త్రీ-వీలర్‌లను తయారు చేయ‌నున్నారు. ఓమెగా సెకీ పోర్ట్‌ఫోలియోలో Rage+, Rage+ RapidEV, Rage+ Frost, Rage+ Swap, Rage+ Tipper వంటి ఎల‌క్ట్రిక్ వాహ‌నాలు ఉన్నాయి. ఇవే కాకుండా ఈ కొత్త ప్లాంట్ త్వరలో ప్రవేశపెట్టబోయే ఎలక్ట్రిక్ ప్యాసింజర్ త్రీ-వీలర్ స్ట్రీమ్‌ను కూడా తయారు చేయనున్నట్లు కంపెనీ తెలిపింది.

50వేల ఆర్డ‌ర్స్

ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ మార్కెట్ గత ఆర్థిక సంవత్సరం కంటే FY22లో 200 శాతం పెరిగింద‌ని, ఇది EV 3-వీలర్లు ఇప్పుడు మొత్తం త్రీ-వీలర్ వాల్యూమ్‌లలో 46 శాతం డిమాండ్ పెర‌గ‌డంలో సహాయపడిందని ఒమేగా సీకి మొబిలిటీ వ్యవస్థాపక-ఛైర్మన్ ఉదయ్ నారంగ్ తెలిపారు. కాగా కంపెనీ ప్రకారం OSM ప్రస్తుతం 50,000 వాహనాలకు పైగా ఆర్డర్ బుక్‌ను కలిగి ఉంది. “లాస్ట్-మైల్ డెలివరీ సెక్టార్.. అలాగే ప్రభుత్వ సంస్థలలో EVలను స్వీకరించడం వల్ల ఎలక్ట్రిక్ త్రీ-వీలర్‌ను విక్రయించే ప్రపంచంలోనే మొదటి మార్కెట్‌గా భారతదేశం అవతరించగలదని తాము న‌మ్ముతున్న‌ట్లు ఉద‌య్ తెలిపారు.

భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోనే మూడు చక్రాల వాహనాల మార్కెట్లో అగ్రగామిగా ఉండాలనుకుంటున్నామని, ఏడాదికి మిలియన్ యూనిట్ల సామర్థ్యంతో world’s largest electric three-wheeler plant ఏర్పాటు చేస్తున్న‌ట్లు చెప్పారు.

ఇ-త్రీ-వీలర్ కార్గో విభాగం.. భారతీయ లాస్ట్ మైల్‌ మొబిలిటీ పర్యావరణ వ్యవస్థకు వెన్నెముకగా ఉంది. ఎందుకంటే ఈ వాహనాలు దేశంలోని పెద్ద ప్రాంతాలకు సరసమైన రవాణా సౌక‌ర్యాల‌ను అందిస్తాయి. పెట్రోల్, డీజిల్, సిఎన్‌జి ధరలు పెరుగుతున్న సమయంలో లాజిస్టిక్స్ సంస్థల‌ను ఈవీలు కాపాడుతాయ‌ని కంపెనీ తెలిపింది. భారతదేశంలో విజయవంతమైన తర్వాత ఇప్పటికే బంగ్లాదేశ్, ఈజిప్ట్, యుఎఇలో జాయింట్ వెంచర్లతో అంతర్జాతీయ మార్కెట్లలోకి ప్రవేశించాలని యోచిస్తున్నట్లు కంపెనీ తెలిపింది.

“OSM ఒక గ్లోబల్ బ్రాండ్, కొత్త OSM మెగా ఫ్యాక్టరీ ఇండియాతో పాటు ASEAN, ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్ మార్కెట్‌ల‌కు ఈవీల‌ను అందిస్తుంది” అని నారంగ్ చెప్పారు.

కొరియ‌న్ కంపెనీతో జాయింట్ వేంచ‌ర్‌

కంపెనీ ఇప్పటికే ఈ విదేశీ మార్కెట్లకు దేశీయంగా ఉత్పత్తి చేసిన ఇ-త్రీ-వీలర్లను ఎగుమతి చేస్తోందని, OSM మేనేజింగ్ డైరెక్టర్ దేబ్ ముఖర్జీ తెలిపారు. త‌మ స్థానిక భాగస్వాములతో కలిసి ఈ దేశాలలో ఈవీ తయారీ ప‌రిశ్ర‌మ‌ల‌ను ఏర్పాటు చేస్తామ‌ని పేర్కొన్నారు. పెద్ద మొత్తంలో EV ల‌ ఉత్పత్తిని సాధించడానికి, కొత్త శ్రేణి పవర్‌ట్రైన్‌లను తయారు చేయడానికి ఓమెగా సెకీ.. కొరియన్ కంపెనీ జే సంగ్ టెక్‌తో కలిసి జాయింట్ వేంచ‌ర్‌ను ఏర్పాటు చేసింది. అంతర్గత మోటార్లు, బ్యాటరీ ప్యాక్‌లను కూడా తయారు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపింది.

For more EV videos  visit Hrithamithra

Harithamithra

👉 “Eco friendly & environmental news updates for Free”

వ్యవసాయం, సోలార్​​ ఎనర్జీ, గ్రీన్​ మొబలిటికి సంబంధించిన అప్‌డేట్స్​ను ఉచితంగా పొందండి!"

We don’t spam! Read our privacy policy for more info.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

🌱 పర్యావరణ వార్తలు వెంటనే తెలుసుకోండి!

Green Mobility, Solar, EV, Environment కి సంబంధించిన తాజా వార్తలు కోసం Harithamitra ను Follow అవ్వండి.

♻️ Harithamitra – పర్యావరణానికి మీ డిజిటల్ మిత్రుడు