Harithamithra Telugu News

Home General News Green India Challenge | సుందర్‌బన్స్‌లో మడ అడవుల పెంపకం

Green India Challenge | సుందర్‌బన్స్‌లో మడ అడవుల పెంపకం

0
Green India Challenge
  • సుందర్‌బన్స్ గోసాబాలో 2,000 మడ మొక్కల నాటింపు
  • తుఫానులు, ప్రకృతివిపత్తుల నుంచి రక్షణతో పాటు జీవనోపాధి కల్పన
  • ఉమాశంకర్ మండల్ స్ఫూర్తిగా – 20 ఏళ్లుగా తీర ప్రాంతాల పునరుద్ధరణకు కృషి

Green India Challenge | 2018లో ప్రారంభమైన గ్రీన్ ఇండియా చాలెంజ్ ఉద్యమం దేశవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణకు నూతన దిక్సూచి అవుతోంది. గ్రీన్ ఇండియా చాలెంజ్ ఎనిమిదవ ఎడిషన్ సందర్భంగా పశ్చిమ బెంగాల్‌లోని సుందర్‌బన్స్‌(Sundarbans)లో 2,000 మడ మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణతో పాటు సముద్ర తుఫానుల నుంచి రక్షణ కల్పించేందుకు ఈ కార్యక్రమం చేపట్టారు.ఈ కార్యక్రమానికి రాజ్యసభ మాజీ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ (Joginapally Santosh Kumar) ప్రేరణ కాగా, ఉమాశంకర్ మండల్ (Uma Shankar Mandal) ఆధ్వర్యంలో ఇది మరింత మరింత ముందుకు సాగుతోంది.

ఆదివారం ఎనిమిదవ ఎడిషన్‌లో భాగంగా, Green India Challenge పుర్బాషా ఎకో హెల్ప్‌లైన్ సొసైటీ, ఇగ్నైటింగ్ మైండ్స్‌తో కలిసి, సుందర్‌బన్స్‌లోని గోసాబా ప్రాంతంలో 2,000 మడ మొక్కలను నాటారు.

ఈ మొక్కలు సముద్రాలు, తుఫానుల నుంచి రక్షిస్తాయి. అలాగే మత్స్యకార, వ్యవసాయంపై ఆధార‌ప‌డి జీవించే కుటుంబాల‌కు జీవనోపాధిని అందిస్తాయి. అంతేకాకుండా అంతరించిపోతున్న జాతుల ఆవాసాలను పెంపొందించ‌నున్నాయి. “బెంగాల్ మడ అడవుల మనిషిగా గుర్తింపు పొందిన ఉమాశంకర్ మండల్ తో సుందర్బన్స్ (Sundarbans) డ్రైవ్ మరింత ఉద్ధృతమైంది. పుర్బాషా ఎకో హెల్ప్‌లైన్ సొసైటీ ప్రధాన కార్యదర్శిగా, మండల్ ఈ కీలకమైన పర్యావరణ వ్యవస్థలను పునరుద్ధరించడానికి, వేలాది హెక్టార్ల క్షీణించిన తీరప్రాంతాన్ని పునరుద్ధరించడానికి రెండు దశాబ్దాలకు పైగా అలుపు లేకుండా కృషి చేశారు.

“మడ అడవులు (Mangrove Forests) ప్రకృతి రక్షణకు రక్షకులు” అని మండల్ పేర్కొన్నారు.”వాతావరణ మార్పుల తుఫానులకు వ్యతిరేకంగా అవి మన మొదటి రక్షణ రేఖగా నిలుస్తాయి, జీవితాలను రక్షిస్తాయి” అని ఆయన అన్నారు.

నైపుణ్యాభివృద్ధి, వడ్డీ లేని రుణాల ద్వారా మడ అడవుల పునరుద్ధరణ, పేదరిక నిర్మూలన, మహిళా సాధికారతపై దృష్టి సారించిన ఈ సంస్థ, పర్యావరణ పర్యాటకం, సౌరశక్తిని ప్రోత్సహిస్తూ 5,000 కంటే ఎక్కువ కుటుంబాలకు బాస‌ట‌గా నిలిచింది. దీనికి అనుబంధంగా ఎం కరుణాకర్ రెడ్డి స్థాపించిన ఇగ్నైటింగ్ మైండ్స్ కూడా సామాజిక సేవ‌లో నిమ‌గ్న‌మైంది.. ఇది పర్యావరణ విద్య, యువతను అడవుల పెంపకం, వాతావరణంపై అవ‌గాహ‌న క‌ల్పించే కార్య‌క్ర‌మాల‌ను చేప‌డ‌తుతోంది.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి.  అలాగే మా  గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్)ఫేస్ బుక్,  వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Previous articleEthanol | ఇంధనంలో విప్లవాత్మక మార్పులు: పెట్రోల్‌కి E27, డీజిల్‌కి IBA మిశ్రమం
Next articleKeesaragutta : ఉత్సాహంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఎనిమిదో ఎడిషన్ ప్రారంభం
Kiran Podishetty
కిరణ్ పొడిశెట్టి, హరితమిత్ర మీడియా వ్యవస్థాపకులు, పర్యావరణ పరిరక్షణకు అంకితభావంతో పనిచేస్తున్న సీనియ‌ర్‌ జర్నలిస్ట్. ఎమ్మెస్సీ, ఎంజీజే పూర్తిచేసిన‌ ఆయనకు ప్రింట్ మీడియా రంగంలో 17 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికల్లో సబ్‌ ఎడిటర్‌గా ప‌నిచేశారు. హరితమిత్ర ద్వారా ఆయన సేంద్రియ వ్యవసాయం, సోలార్ ఎనర్జీ, గ్రీన్ మొబిలిటీ (ఎలక్ట్రిక్‌, సిఎన్‌జి వాహనాలు) ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ వంటి అంశాలపై నిరంతరం విశ్లేషణాత్మక కథనాలు, తాజా అప్‌డేట్స్‌ను అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here