Harithamithra Telugu News

Home Agricultue ఉద్యాన పంటలు Oil Palm | వ్యవసాయ రంగంలో మరో మైలురాయి: 22న నర్మెట్ట ‘ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ’...

Oil Palm | వ్యవసాయ రంగంలో మరో మైలురాయి: 22న నర్మెట్ట ‘ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ’ ప్రారంభం!

0
Oil Palm Factory

రాష్ట్ర వ్యవసాయ ముఖచిత్రాన్ని మార్చే దిశగా ప్రభుత్వం మరో భారీ ప్రాజెక్టును సిద్ధం చేసింది. జనగామ జిల్లా నర్మెట్టలో నూతనంగా నిర్మించిన ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ (Narmetta Oil Palm Factory ) ని ఈ నెల 22న ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. ఈ మేరకు బుధవారం సచివాలయంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, వివేక్ వెంకటస్వామిలతో కలిసి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వివరాలను వెల్లడించారు.

ఉగాది నుండే ‘రైతు మహోత్సవం’

ఈ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం సందర్భంగా నర్మెట్టలో భారీ ఎత్తున రైతు ఉత్సవాలను నిర్వహించనున్నారు.

  • ప్రారంభం: ఉగాది పర్వదినాన (మార్చి 19) సాయంత్రం 4 గంటలకు మంత్రి తుమ్మల ప్రదర్శన శాలలను ప్రారంభించి ఉత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు.
  • 150 స్టాల్స్: వ్యవసాయం, పశుసంవర్ధక, ఉద్యాన, మత్స్యశాఖలతో పాటు బ్యాంకులు, స్టార్టప్‌లు, ఎఫ్.పి.ఓల ఆధ్వర్యంలో మొత్తం 150 స్టాల్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు.
  • ముఖాముఖి: ప్రతిరోజూ ఉదయం 10:30 నుండి సాయంత్రం 5:00 గంటల వరకు శాస్త్రవేత్తలు, అభ్యుదయ రైతులతో చర్చా వేదికలు నిర్వహిస్తారు.

Oil Palm Factory : మార్చి 22న ముఖ్యమంత్రి పర్యటన

ఫ్యాక్టరీ ప్రారంభం: సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని ప్రారంభిస్తారు. ఇదే వేదికపై రూ. 80 కోట్లతో నిర్మించ తలపెట్టిన రిఫైనరీ యూనిట్‌కు శంకుస్థాపన చేస్తారు. అత్యంత కీలకమైన రైతు భరోసా నిధుల విడుదల కూడా నర్మెట్ట వేదిక నుండే ముఖ్యమంత్రి చేతుల మీదుగా జరగనుంది.

రైతులకు చేకూరే ప్రయోజనాలు

నర్మెట్ట ఫ్యాక్టరీ అందుబాటులోకి రావడం వల్ల ఈ ప్రాంత ఆయిల్ పామ్ రైతులకు రవాణా ఖర్చులు భారీగా తగ్గనున్నాయి. సమస్యల పరిష్కారంతో పాటు రైతుల ఆదాయం పెరగడానికి ఇది దోహదపడుతుందని మంత్రి ఆకాంక్షించారు. అలాగే, కేంద్రం నుండి మద్దతు లేకపోయినా గత ఖరీఫ్‌లో మొక్కజొన్న కొనుగోలు చేసినట్లు, ఈ యాసంగిలోనూ కొనుగోళ్లు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు.


పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు అవుదాం.. హరిత భారతాన్ని నిర్మిద్దాం!

గ్రీన్ మొబిలిటీ, సోలార్ ఎనర్జీ మరియు పర్యావరణానికి సంబంధించిన తాజా విశేషాల కోసం హరితమిత్రను సందర్శిస్తూ ఉండండి. నిరంతర వార్తా అప్‌డేట్స్ కోసం మా సోషల్ మీడియా వేదికలపై కనెక్ట్ అవ్వండి:

ఈ సమాచారం మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. పర్యావరణం పట్ల అవగాహన పెంచేలా ఈ కథనాన్ని మీ స్నేహితులకు షేర్ చేయండి! 🌳✨

Previous articleOben Electric | ‘ఓబెన్ ఎలక్ట్రిక్’ సంచలనం: 3.2 కోట్ల కిలోమీటర్ల ప్రయాణం.. రూ. 8 కోట్ల ఇంధనం ఆదా!
Next articleLassi Recipes : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్‌లో 5 రకాల లస్సీలు ఇలా తయారు చేసుకోండి! ‌‌ –
Kiran Podishetty
కిరణ్ పొడిశెట్టి, హరితమిత్ర మీడియా వ్యవస్థాపకులు, పర్యావరణ పరిరక్షణకు అంకితభావంతో పనిచేస్తున్న సీనియ‌ర్‌ జర్నలిస్ట్. ఎమ్మెస్సీ, ఎంజీజే పూర్తిచేసిన‌ ఆయనకు ప్రింట్ మీడియా రంగంలో 17 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికల్లో సబ్‌ ఎడిటర్‌గా ప‌నిచేశారు. హరితమిత్ర ద్వారా ఆయన సేంద్రియ వ్యవసాయం, సోలార్ ఎనర్జీ, గ్రీన్ మొబిలిటీ (ఎలక్ట్రిక్‌, సిఎన్‌జి వాహనాలు) ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ వంటి అంశాలపై నిరంతరం విశ్లేషణాత్మక కథనాలు, తాజా అప్‌డేట్స్‌ను అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here