Harithamithra Telugu News

Home Agricultue సేంద్రియ వ్యవసాయం PM Kisan Yojana : రైతులకు కొత్త సంవత్సర కానుక.. త్వరలో బ్యాంకు ఖాతాల్లోకి రూ.10వేలు...

PM Kisan Yojana : రైతులకు కొత్త సంవత్సర కానుక.. త్వరలో బ్యాంకు ఖాతాల్లోకి రూ.10వేలు జమ?

0
PM Kisan Yojana
PM Kisan Scheme

PM Kisan Yojana : కేంద్రంలోని మోదీ ప్రభుత్వం (PM Modi) రైతు సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలను అమలుచేస్తోంది. తాజాగా పీఎం కిసాన్ పథకంక కింద రైతుల ఖాతాల్లో రూ.10వేలు జమ చేయాలని నిర్ణయించింది. దీంతో నేరుగా రైతులకు లబ్ది చేకూరనుంది..

వ్యవసాయ పనుల కోసం రైతుల‌కు ఆర్థికంగా చేయూత‌నందించేందుకు 2019లో కేంద్ర ప్రభుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా పిఎం కిసాన్ యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకంలో భాగంగా దేశంలోని అర్హులైన రైతులందరికీ పంట సాయం కింద ఏడాదికి 6 వేల రూపాయలు వారి బ్యాంకు ఖాతాల్లోకి జ‌మ చేస్తోంది. దీంతో ఈ ప‌థ‌కంపై దేశ‌వ్యాప్తంగా రైతులకు నేర‌గా సాయం అందుతుంది . ఈ నేపథ్యంలోనే పీఎం కిసాన్ యోజన స్కీముకు సంబంధించి కీలక సమాచారం బయటకు వొచ్చింది. ఈ స్కీము కింద రైతులకు మరింత లబ్ది చేకూరే విధంగా కొత్త ప్లాన్ రెడీ చేసింద‌ని తెలుస్తోంది. పీఎం కిసాన్ కింద ఇస్తున్న పెట్టుబడి సాయాన్ని పెంచాలని భావించి అందుకు ప్ర‌ణాళిక‌ల‌ను సిద్ధం చేస్తున్న‌ట్లు స‌మాచారం.

పీఎం కిసాన్ యోజన పథకం (PM Kisan Yojana Scheme ) కింద రైతులకు అందించే వార్షిక మొత్తాన్ని రూ. 6వేల నుంచి 10వేలకు పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు చేస్తోందన్న చర్చ జ‌రుగుతోంది. ఫిబ్రవరి 1, 2025న సమర్పించనున్న కేంద్ర బడ్జెట్ లో కీల‌క‌ నిర్ణయం తీసుకోవచ్చున‌ని స‌మాచారం. ప్రస్తుతం ఇస్తున్న 6వేల రూపాయలను మొత్తం మూడు విడతలుగా రైతుల అకౌంట్లో జమ చేస్తోంది. ఏప్రిల్, జులై, ఆగస్టు, నవంబర్, డిసెంబర్, మార్చి నెలల్లో ప్రతి విడతలో ఎకరానికి రూ.2వేల చొప్పున ఆర్ధిక సాయం అందిస్తోంది. ఇప్పటి వరకు 18 విడతలుగా న‌గ‌దు విడుదల చేశారు. ప్ర‌స్తుతం రైతులు 19వ విడత డబ్బు 2025 ఫిబ్రవరిలో విడుద‌ల కానున్నాయి.


హరితమిత్ర వెబ్ సైట్ పర్యావరణం, సేంద్రియ వ్యవసాయం, గ్రీన్ మొబిలిటీ, సోలార్ ఎనర్జీ (Solar Energy) కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. సరికొత్త వార్తలను కోసం మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్(X) , వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

Previous articleFlipkart : కేవలం రూ. 88,000కే TVS iQubeని తీసుకెళ్లండి..
Next articleభారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన ఎల‌క్ట్రిక్ కారు ఇదే..
Kiran Podishetty
కిరణ్ పొడిశెట్టి, హరితమిత్ర మీడియా వ్యవస్థాపకులు, పర్యావరణ పరిరక్షణకు అంకితభావంతో పనిచేస్తున్న సీనియ‌ర్‌ జర్నలిస్ట్. ఎమ్మెస్సీ, ఎంజీజే పూర్తిచేసిన‌ ఆయనకు ప్రింట్ మీడియా రంగంలో 17 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికల్లో సబ్‌ ఎడిటర్‌గా ప‌నిచేశారు. హరితమిత్ర ద్వారా ఆయన సేంద్రియ వ్యవసాయం, సోలార్ ఎనర్జీ, గ్రీన్ మొబిలిటీ (ఎలక్ట్రిక్‌, సిఎన్‌జి వాహనాలు) ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ వంటి అంశాలపై నిరంతరం విశ్లేషణాత్మక కథనాలు, తాజా అప్‌డేట్స్‌ను అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here