Saturday, February 14Lend a hand to save the Planet
Shadow

Environment

Delhi Pollution | కాలుష్యంపై ఢిల్లీ సర్కార్ ‘బ్లూప్రింట్’: 14 వేల బస్సులు, ఈవీ పాలసీ 2.0తో సరికొత్త ప్రణాళిక!

Delhi Pollution | కాలుష్యంపై ఢిల్లీ సర్కార్ ‘బ్లూప్రింట్’: 14 వేల బస్సులు, ఈవీ పాలసీ 2.0తో సరికొత్త ప్రణాళిక!

Environment
న్యూఢిల్లీ : దేశ రాజధానిలో వాయు కాలుష్యాన్ని (Delhi Pollution) అరికట్టేందుకు ఢిల్లీ ప్రభుత్వం అత్యంత భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. ముఖ్యమంత్రి రేఖ గుప్తా అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో కాలుష్య నిరోధక 'బ్లూప్రింట్'ను ఆమోదించారు. రాబోయే 12 నెలల పాటు 24 గంటలూ పనిచేసి కాలుష్య రహిత ఢిల్లీని నిర్మించాలని అధికారులకు పిలుపునిచ్చారు.ప్రజా రవాణాలో విప్లవాత్మక మార్పులుప్రైవేట్ వాహనాల వినియోగాన్ని తగ్గించేందుకు రవాణా వ్యవస్థను ప్రభుత్వం పూర్తిగా పునర్నిర్మిస్తోంది:2029 మార్చి నాటికి ప్రజా ర‌వాణా కోసం మొత్తం 14,000 బస్సులను రోడ్లపైకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో మొదటి విడతగా 2026 చివరి నాటికి 6,000 బస్సులు రానున్నాయి.మెట్రో స్టేషన్ల నుంచి ప్రయాణికుల సౌకర్యార్థం 500 చిన్న బస్సులు (7 మీటర్ల పొడవు) అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం 395 కి.మీ. ఉన్న మెట్రో నెట్‌...
DelhiAir Pollution : నేటి నుండి వర్క్ ఫ్రమ్ హోమ్.. వాహనాలకు కఠిన నిబంధనలు!

DelhiAir Pollution : నేటి నుండి వర్క్ ఫ్రమ్ హోమ్.. వాహనాలకు కఠిన నిబంధనలు!

Environment
న్యూఢిల్లీ, డిసెంబర్ 18: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం (DelhiAir Pollution) ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో కేజ్రీవాల్ ప్రభుత్వం అత్యవసర చర్యలు చేపట్టింది. వాయు నాణ్యత సూచిక (AQI) ‘తీవ్రమైన’ వర్గంలోకి పడిపోవడంతో గురువారం (నేటి) నుండి GRAP-4 పరిమితులకు అదనంగా మరికొన్ని కఠినమైన ఆంక్షలను అమలు చేస్తున్నట్లు ప్రకటించింది.సగం మందికి ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ తప్పనిసరిఢిల్లీ కార్మిక మంత్రి కపిల్ మిశ్రా తెలిపిన వివరాల ప్రకారం.. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో 50 శాతం సిబ్బందికి ఇంటి నుండే పని (WFH) సౌకర్యం కల్పించాలి. ఆసుపత్రులు, అగ్నిమాపక శాఖ, పారిశుధ్యం, రవాణా వంటి అత్యవసర సేవల్లో పనిచేసే ఫ్రంట్‌లైన్ కార్మికులకు ఈ నిబంధన వర్తించదు. నిబంధనలు ఉల్లంఘించే సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు.PUC లేకపోతే పెట్రోల్ పోయరు!వాహన కాలుష్యాన్ని అరికట్టేందుకు పర్యావరణ మంత్రి మంజి...
Green Crackers | ఢిల్లీలో గ్రీన్ బాణసంచాకు అనుమతి — గ్రీన్ క్రాకర్స్ తో పండుగ ఉత్సాహం

Green Crackers | ఢిల్లీలో గ్రీన్ బాణసంచాకు అనుమతి — గ్రీన్ క్రాకర్స్ తో పండుగ ఉత్సాహం

General News, Environment
Diwali 2025 | దీపావళికి ముందే గ్రీన్‌ బాణసంచా (Green Crackers) పై నిషేధాన్ని సుప్రీంకోర్టు సడలించింది, ఢిల్లీ-ఎన్‌సిఆర్ ప‌రిధిలో నిర్ణీత ప్రదేశాలు, సమయాల్లో గ్రీన్ క్రాక‌ర్స్‌ అమ్మకాలు, వినియోగానికి అనుమతిచ్చింది. "పర్యావరణ ఆందోళనలు, పండుగ సీజన్ మనోభావాలు, టపాసుల తయారీదారుల జీవనోపాధి హక్కు"ను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు సుప్రీం కోర్టు తెలిపింది.వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి రూపొందించబడిన గ్రీన్ క్రాకర్లు సాంప్రదాయ పటాకుల కంటే తక్కువ-ఉద్గారాల‌ను వెలువ‌రిస్తాయి. శబ్ద తీవ్రత, ఉద్గారాలను తగ్గించే లక్ష్యంతో సాంప్రదాయ క్రాకర్లలోని కొన్ని ప్రమాదకర ఏజెంట్లను తక్కువ కాలుష్య కారకాలతో భర్తీ చేస్తాయి.30% తక్కువ కాలుష్యంబేరియం నైట్రేట్ వంటి హానికరమైన రసాయనాలు లేని కారణంగా గ్రీన్ క్రాకర్లు దాదాపు 30% తక్కువ కాలుష్యాన్ని ఉత్పత్తి చేస్తాయని చెబుతారు. గాలిని అంతగా కలుషితం చేయని ...
ఢిల్లీకి ఊపిరి పోసిన జూలై 2025: ఏడేళ్లలో అత్యుత్తమ గాలి నాణ్యత – Delhi Air Improvement – 2025

ఢిల్లీకి ఊపిరి పోసిన జూలై 2025: ఏడేళ్లలో అత్యుత్తమ గాలి నాణ్యత – Delhi Air Improvement – 2025

Environment
Delhi Air Improvement - 2025 : జూలై 2025లో ఢిల్లీ 2018 తర్వాత అత్యంత స్వచ్ఛమైన జూలై గాలి నాణ్య‌త‌ను నమోదు చేసింది. సగటు గాలి నాణ్యత సూచిక (AQI) 78గా ఉంది. ఇది 'సంతృప్తికరమైన' విభాగంలోకి వ‌స్తుంది. ఈ ఘనత 2020 సంవత్సరంలో COVID-19 లాక్‌డౌన్ సమయంలో నమోదైన గాలిని కూడా అధిగమించింది. ఇది వాయు కాలుష్యానికి వ్యతిరేకంగా నగరం చేస్తున్న పోరాటంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా చెప్ప‌వ‌చ్చు.జూలైలో అత్యుత్తమ AQI: పురోగతి వివరాలు..జూలై 2025కి సగటు AQI 78గా ఉంది. ఇది ఇటీవలి సంవత్సరాల కంటే భారీ మెరుగుదల మాత్రమే కాదు, 2020 లాక్‌డౌన్ సంవత్సరం కంటే కూడా మెరుగ్గా ఉంది. గ‌తంలో జులైల‌లో చాలా దారుణమైన గాలి నాణ్యతను నమోదు చేశాయి: 104 (2018), 134 (2019), 84 (2020), 110 (2021), 87 (2022), 84 (2023), మరియు 96 (2024).ఇంకా, జూలై 2025 ఈ నెలలో అత్యధికంగా 29 రోజులు 'సంతృప్తికరమైన' ఎయిర్ డేలను చూసింది, 2018లో 16 మరియు ...
కేరళలో ఈ-వ్యర్థాల సేకరణకు  స్పెషల్ డ్రైవ్  – e-Waste Collection

కేరళలో ఈ-వ్యర్థాల సేకరణకు స్పెషల్ డ్రైవ్ – e-Waste Collection

Environment
తిరువనంతపురం: ఎలక్ట్రానిక్ వ్యర్థాలను (e-Waste Collection) సురక్షితంగా పారవేయడానికి కేరళ ప్రభుత్వం సరికొత్త చొరవను ప్రారంభించింది. ఇందులో మంగళవారం నుండి రాష్ట్రవ్యాప్తంగా ఈ వేస్టేజ్ కలెక్షన్ డ్రైవ్‌ను ప్రారంభిస్తోంది. గృహాలు, సంస్థలు పారవేసే గాడ్జెట్‌లు ఉపకరణాలకు LSGD ప్రత్యేక ధరను నిర్ణయించింది.మంగళవారం నెయ్యటింకర మునిసిపాలిటీలో జరిగే కార్యక్రమంలో స్థానిక స్వపరిపాలన శాఖ (LSGD) మంత్రి MB రాజేష్ మునిసిపాలిటీలలో ప్రారంభించనున్న ప్రత్యేక ప్రచారానికి సంబంధించిన మొదటి దశను ప్రారంభించారు.రాష్ట్రంలో విషపూరిత కాలుష్యాన్ని అరికట్టడంతోపాటు, ఈ-వ్యర్థాలను పౌరులకు బహుమతిగా మార్చేందుకు ప్రభుత్వం ఈ స్పెషల్ డ్రైవ్ ను ప్రారంభించింది. హరిత కర్మ సేన సభ్యుల ద్వారా సేకరణ డ్రైవ్ నిర్వహిస్తోంది. క్లీన్ కేరళ కంపెనీ లిమిటెడ్ ఈ ప్రయత్నాలను సమన్వయం చేస్తుంది.ఈ-వ్యర్థాల సేకరణ ప్రక్రియను మరింత సమర్థవంతంగా...
New Delhi | పర్యావరణ పరిరక్షణకు మరో మెట్టు: కాలుష్యకర వాహనాలపై ఢిల్లీ కఠిన చర్యలు

New Delhi | పర్యావరణ పరిరక్షణకు మరో మెట్టు: కాలుష్యకర వాహనాలపై ఢిల్లీ కఠిన చర్యలు

General News, Environment
New Delhi : ఢిల్లీ ప్రభుత్వం పాత డీజిల్, పెట్రోల్ వాహనాల వాడకంపై ఆంక్షలను ఎత్తివేసిన కొద్ది రోజులకే, నవంబర్ 1 నుంచి అటువంటి వాహనాలకు ఇంధనం అమ్మకాలపై కొత్త ఆదేశాలు ఇప్పుడు అమల్లోకి వచ్చాయి. ఇంధన నిషేధం దిల్లీలోనే కాకుండా జాతీయ రాజధాని ప్రాంతం (NCR)లోని ఐదు జిల్లాల్లో కూడా అమలు చేయనున్నారు. రాజ‌ధాని పరిసర ప్రాంతాలలో పెరుగుతున్న వాయు కాలుష్య స్థాయిలను అరికట్టేందుకు ప్ర‌భుత్వం ఈ చ‌ర్య‌లు చేపట్టింది.కొత్త నిబంధనల ప్రకారం, పెట్రోల్ పంపులు వీటికి ఇంధనాన్ని అందించవు:10 సంవత్సరాల కంటే పాత డీజిల్ వాహనాలు15 ఏళ్లు పైబడిన పెట్రోల్ వాహనాలునివేదికల ప్రకారం, ఢిల్లీ (New Delhi)లో వాహ‌నం చెల్లుబాటు అయిపోయిన (EOL) వాహనాలపై ఇంధన నిషేధం అమలును కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ (CAQM) నవంబర్ 1 వరకు నిలిపివేసింది. ఈ విధానాన్ని అమలు చేయడంలో కార్యాచరణ గురించి ఢిల్లీ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం ...
 sustainable Kumbh Mela 2025 |  మహా కుంభమేళాలో పర్యావరణ సవాళ్లకు ప‌రిష్కారాలు ఎలా?

 sustainable Kumbh Mela 2025 | మహా కుంభమేళాలో పర్యావరణ సవాళ్లకు ప‌రిష్కారాలు ఎలా?

Environment
 sustainable Kumbh Mela 2025 | ప్రపంచంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక ఉత్స‌వాల్లో ఒకటైన కుంభమేళా ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి అంగ‌రంగ వైభ‌వంగా జ‌రుగుతుంది. 2025 జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26, 2025 వరకు ఉత్త‌ర‌ప్ర‌దేశ్ జిల్లా ప్రయాగ్‌రాజ్ నిర్వ‌హించ‌నున్నారు. ఈ మేళా సమయంలో నదులలో ల‌క్షలాది మంది భ‌క్తులు పుణ్య‌స్నానాలు ఆచ‌రిస్తారు. ఇది మ‌న పాపాలను తొల‌గిస్తుంద‌ని ఆధ్యాత్మికంగా పునరుజ్జీవింపజేస్తుందని విశ్వ‌సిస్తారు.కుంభమేళా (Kumbh Mela 2025 ) ప్రాముఖ్యతకుంభమేళా భార‌తీయ సాంస్కృతిక, ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉంది, పవిత్ర జలాల్లో పుణ్య‌స్నానాలు, గంగా హార‌తుల కోసం లక్షలాది మంది భక్తులు త‌ర‌లివ‌స్తారు. ఈ కార్యక్రమంలో ఆధ్యాత్మిక ప్ర‌వ‌చ‌నాలు, ప్రసంగాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, శోభాయాత్ర‌లు, భారతదేశం స‌నాత‌న ధ‌ర్మం గొప్పత‌నాన్ని చాటుతుంది.కుంభమేళా ఒక స్మారక ఆధ్యాత్మిక కార్యక్రమం అయితే, దాని పెద...
Delhi air pollution Today |

Delhi air pollution Today |

Environment
Delhi air pollution Today | దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్య తీవ్రత మరింత ప్రమాదక స్థాయికి చేరింది. రానున్న మరో ఆరు రోజుల పాటు గాలి నాణ్యత తీవ్రమైన (severe ) లేదా తీవ్రమైన + (severe+ ) కేటగిరీలోనే ఉంటుందని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియోరాలజీ తన రోజువారీ బులెటిన్‌లో అంచనా వేసింది.అంతకుముందు ఆదివారం, సాయంత్రం 4 గంటలకు సగటు వాయు నాణ్యత సూచిక (AQI) 441 (సివియర్ ), రాత్రి 7 గంటలకు 457కి దిగజారడంతో, కమీషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ (CAQM) GRAP స్టేజ్ IV విధించింది. రాత్రి 10 గంటల సమయానికి, రాజధానిలోని అన్ని ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ స్టేషన్‌లు, AQI రీడింగ్‌లు 400 కంటే ఎక్కువ ఉండటంతో తీవ్రమైన కాలుష్య స్థాయిలు కొనసాగినట్లు నివేదించాయి.గాలి నాణ్యతను మరింత దిగజారుతున్న తరుణంలో సోమవారం ఉదయం ఢిల్లీలో పబ్లిక్ ప్రాజెక్టుల నిర్మాణాలను నిలిపివేసింది. అలాగే మరిన్ని కఠినమైన కాలుష్య ని...
Delhi air pollution : ఢిల్లీలో మరింత పెరిగిన కాలుష్యం.. స్కూళ్లు బంద్, రైళ్లు, విమానాలు పరిమితం..

Delhi air pollution : ఢిల్లీలో మరింత పెరిగిన కాలుష్యం.. స్కూళ్లు బంద్, రైళ్లు, విమానాలు పరిమితం..

Environment
Delhi air pollution : ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో ఈరోజు ఉదయం కూడా దట్టమైన పొగమంచు క‌మ్ముకుంది. గాలి నాణ్యత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దీనితో కమీషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ (CAQM) కఠినమైన కాలుష్య నిరోధక చర్యలను అమలు చేయాల‌ని సూచించింది. CAQM తీవ్రమైన పొగమంచును "ఎపిసోడిక్ ఈవెంట్"గా వర్గీకరించింది.ఢిల్లీలోని ఆనంద్ విహార్ (441), ద్వారక (444), ముండ్కా (449), ఆర్‌కె పురం (437), ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (446) వంటి ప్రాంతాల్లో ఏక్యూఐ ‘సివియ‌ర్‌’ జోన్‌లో కొనసాగుతోందని కేంద్ర కాలుష్య నియంత్రణ గణాంకాలు ప్రచురించాయి.AQI 401-450 ప్ర‌మాద‌క‌ర స్థాయికి చేరుకున్నప్పుడు స్టేజ్‌ III చర్యలు వర్తిస్తాయి. I మరియు II స్టేజ్‌ల కింద ఇప్పటికే అమలు చేస్తున్న నిబంధ‌న‌ల‌కు అద‌నంగా కాలుష్య నిరోధక చర్యలను చేప‌ట్ట‌నున్నారు. GRAP గాలి నాణ్యతను నాలుగు దశలుగా వర్గీకరిస్తుంది: స్టేజ్ I (AQI 201-300) “...
Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates Ather 450X | ఏథర్ ఈవీ స్కూటర్ ఇప్పుడు రేంజ్ పెరిగింది..