
జట్టు కట్టిన హీరో ఎలక్ట్రిక్ – Mahindra & Mahindra
భారతదేశంలోని అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహన కంపెనీ అయిన హీరో ఎలక్ట్రిక్ తాజాగా Mahindra & Mahindra గ్రూప్ తో జట్టు కట్టింది. దేశంలో EVల కోసం ఎప్పటికప్పుడు పెరుగుతున్న డిమాండ్ను తీర్చడానికి, అలాగే కంపెనీ విస్తరణ ప్రణాళికలలో భాగంగా ఈ భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నట్లు సంస్థలు ప్రకటించాయి. దేశవ్యాప్తంగా ఈవీల స్వీకరణకు ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం దోహదపడుతుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
ఏడాదికి మిలియన్ యూనిట్లు
పెట్రోల్ ధరలు పెరిగినప్పటి నుంచి వినియోగదారులు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే పెరిగిన డిమాండ్ కారణంగా సకాలంలో వాహనాలను ఉత్పత్తి చేయలేక కంపెనీలు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో
ఈవీ మార్కెట్లో పెరుగుతున్న డిమాండ్లను తీర్చడానికి మహీంద్రా గ్రూపునకు చెందిన పితంపూర్ ప్లాంట్లో హీరో ఎలక్ట్రిక్ యొక్క అత్యంత ప్రజాదరణ పొందిన ఎలక్ట్...








