Friday, August 22Lend a hand to save the Planet
Shadow

Agriculture

Agricultural News, Farmers,

New Market Yards | రాష్ట్రంలో 10 కొత్త మార్కెట్ యార్డులు

New Market Yards | రాష్ట్రంలో 10 కొత్త మార్కెట్ యార్డులు

Agriculture
నాగర్‌కర్నూల్, వనపర్తి, ఖమ్మం, నల్గొండ, హనుమకొండ, పెద్దపల్లి జిల్లాల్లో కొత్త యార్డులుపంట కొనుగోలు, ధరల నిర్ధారణ, తూకం లావాదేవీలన్నీ పారదర్శకంగా నిర్వహణరైతుల భద్రత, రవాణా ఖర్చుల తగ్గింపు, కోల్డ్ స్టోరేజ్, గిడ్డంగులు వంటి సదుపాయాలుHyderabad : తెలంగాణలో వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యాన్ని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో 10 కొత్త మార్కెట్ యార్డులు (New Market Yards) ఏర్పాటు చేయనుంది. దీనికి సంబంధించిన తుది ఉత్తర్వులు జారీ చేయనుంది. దీంతో తెలంగాణలో మార్కెట్ యార్డుల సంఖ్య 197 నుంచి 207కి చేరుతుంది.కొత్త మార్కెట్ యార్డులను నాగర్ కర్నూల్ జిల్లా కోడేరు, అదే జిల్లాలోని పెద్దకొత్తపల్లి, పెద్దపల్లి జిల్లా ఎలిగేడు, హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి, వనపర్తి జిల్లా పానగల్, వీవనగండ్ల, ఖిలాఘ ర్, గోపాల్‌పేట, ఖమ్మం జిల్లా మత్కేపల్లి, నల్గొండ జిల్లా దామరచర్...
Agriculture | నకిలీ విత్తనాలపై కఠిన చర్యలు: రైతులకు హెల్ప్‌లైన్

Agriculture | నకిలీ విత్తనాలపై కఠిన చర్యలు: రైతులకు హెల్ప్‌లైన్

Agriculture, Organic Farming
Agriculture News : దేశవ్యాప్తంగా రైతులను తీవ్ర న‌ష్టాల‌కు గురిచేస్తున్న నకిలీ విత్తనాలు, ఎరువుల సమస్యను పరిష్కరించడానికి కఠినమైన చర్యలు తీసుకుంటామని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ (Shivraj Singh Chouhan) ప్రకటించారు. రైతుల ప్రయోజనాలను కాపాడటంలో కేంద్ర ప్రభుత్వం నిబద్ధతను నొక్కి చెబుతూ, నకిలీ వ్యవసాయ ఇన్‌పుట్‌ల ఉత్పత్తి, అమ్మకాలకు బాధ్యులైన వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. రైతులు ఏవైనా అనుమానాస్పద ఉత్పత్తులను చూసినట్లయితే టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్‌కు తెలియజేయాలని ఆయన కోరారు.రైతులకు మద్దతుగా, ప్రభుత్వం ఇప్పటికే ఒక హెల్ప్‌లైన్ నంబర్‌ను జారీ చేసింది, దీని ద్వారా వారు ఫిర్యాదులు చేయవచ్చు, అలాగే సహాయం పొందవచ్చు. వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ (Agriculture Ministry) శాఖ యొక్క అధికారిక X హ్యాండిల్ లో షేర్ చేసిన వీడియోలో ఒక పోస్టు షేర్ చేశారు. అందులో కేంద్ర మంత్రి శ...
Mulugu | రైతులు మోసపోకుండా కొత్త విత్తన చట్టం..

Mulugu | రైతులు మోసపోకుండా కొత్త విత్తన చట్టం..

Agriculture
మొక్కజొన్న నష్టపోయిన 671 మందికి రూ.3.8 కోట్లు నష్టపరిహారం పంపిణీMulugu News | రైతులకు నకిలీ విత్తనాల బెడదను పూర్తిగా నివారించేందుకు కొత్త విత్తన చట్టాన్ని రూపొందించబోతున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు (Minister Thummala Nageshwar Rao) అన్నారు. సోమవారం ములుగు జిల్లా (Muluau) వాజేడు (Vajedu)మండల కేంద్రంలో వాజేడు, వెంకటాపురం, కన్నాయి గూడెం మండలాల్లో 1521 ఎకరాల్లో మొక్కజొన్న వేసి పంట నష్టపోయిన 671 రైతులకు మంత్రి తుమ్మల, మంత్రి సీతక్క, తెలంగాణ వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎం. కోదండరెడ్డి, తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ ఎస్. అన్వేష్ రెడ్డితో కలిసి రూ.3.80 కోట్ల విలువైన చెక్కులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. రాష్ట్రంలోని రైతులు నకిలీ విత్తనాలతో మోసపోకుండా రాష్ట్రంలో విత్తన చట్టాన్ని రూపొందిస్తున్నామని అన్నారు. జిల్లాలో పామాయ...
రైతులకు శాటిలైట్ ఆధారిత ఏఐ టెక్నాలజీ – ముందస్తు హెచ్చరికలతో అధిక దిగుబడి – AI in Agriculture

రైతులకు శాటిలైట్ ఆధారిత ఏఐ టెక్నాలజీ – ముందస్తు హెచ్చరికలతో అధిక దిగుబడి – AI in Agriculture

Agriculture, Organic Farming
పంట రోగ ముందస్తుగా నిర్ధారణతక్కువ కూలీ ఖర్చులురైతులకు ఆధునిక టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో తెలంగాణ వ్యవసాయ శాఖ ‘కృషివాస్’ సంస్థతో కలిసి ఏఐ ఆధారిత శాటిలైట్ టెక్నాలజీ (AI in Agriculture) ని వినియోగించేందుకు ముందడుగు వేసింది. ఈ టెక్నాలజీతో రైతులు ఇప్పుడు మొబైల్ యాప్ (Krishivas App) ద్వారా తమ పంటల్లో తెగుళ్ళను ముందే గుర్తించి నివారణ చర్యలు తీసుకోవచ్చు.కృషివాస్ సంస్థ ప్రతినిధులతో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Thummala Nageshwar Rao) సచివాలయంలో ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆ సంస్థ తయారు చేసిన ఏఐ టెక్నాలజీతో శాటిలైట్ ఇమేజింగ్ ద్వారా ముందస్తుగానే పంటలకు వ్యాపించే చీడ పురుగులు, రసం పీల్చే పురుగులను గుర్తించి, వాటిని మొదట్లోనే నిరోధించేలా టెక్నాలజీ (Crop Disease Detection) గురించి మంత్రికి వివరించారు. అంతేకాకుండా పంట బయటకు కనిపించే వాటినే కాకు...
మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో రికార్డు స్థాయిలో గోధుమల ఉత్పత్తి | Wheat production

మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో రికార్డు స్థాయిలో గోధుమల ఉత్పత్తి | Wheat production

Agriculture
Wheat production | 2025-26 మార్కెటింగ్ సంవత్సరానికి గోధుమల సేకరణ వేగంగా ప్రారంభమైంది, రాబోయే నెలల్లో కూడా ఇదే జోరు కొనసాగితే మొత్తం సీజన్‌కు ఇది శుభసూచకమని చెప్పవచ్చు. ఇప్పటివరకు, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో గోధుమల సేకరణ ప్రారంభమైంది, ఏప్రిల్ నుంచి పంజాబ్, హర్యానాలలో ఇది ప్రారంభమవుతుంది. మార్చి 23 వరకు మధ్యప్రదేశ్‌లో ఇప్పటివరకు దాదాపు 1,45,512 టన్నుల గోధుమలను సేకరించినట్లు గణంకాలు చెబుతున్నాయి. ఇది గత సంవత్సరం ఇదే కాలంలో సేకరించిన 14,233 టన్నుల కంటే చాలా ఎక్కువ.2025-26 సంవత్సరానికి కేంద్రం నిర్ణయించిన MSP క్వింటాలుకు ₹2,425 కంటే అదనంగా మధ్యప్రదేశ్ క్వింటాలుకు ₹125 బోనస్ ప్రకటించింది, రాజస్థాన్ కూడా గోధుమ (Wheat) MSP కంటే క్వింటాలుకు ₹150 బోనస్ ప్రకటించింది. 2025-26 సీజన్‌లో మధ్యప్రదేశ్ దాదాపు 8 మిలియన్ టన్నుల గోధుమలను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది, మొత్తం జాతీయ లక్ష్యం 31.27 మిలియన...
PM Kisan Yojana : రైతులకు కొత్త సంవత్సర కానుక.. త్వరలో బ్యాంకు ఖాతాల్లోకి రూ.10వేలు జమ?

PM Kisan Yojana : రైతులకు కొత్త సంవత్సర కానుక.. త్వరలో బ్యాంకు ఖాతాల్లోకి రూ.10వేలు జమ?

Agriculture
PM Kisan Yojana : కేంద్రంలోని మోదీ ప్రభుత్వం (PM Modi) రైతు సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలను అమలుచేస్తోంది. తాజాగా పీఎం కిసాన్ పథకంక కింద రైతుల ఖాతాల్లో రూ.10వేలు జమ చేయాలని నిర్ణయించింది. దీంతో నేరుగా రైతులకు లబ్ది చేకూరనుంది..వ్యవసాయ పనుల కోసం రైతుల‌కు ఆర్థికంగా చేయూత‌నందించేందుకు 2019లో కేంద్ర ప్రభుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా పిఎం కిసాన్ యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకంలో భాగంగా దేశంలోని అర్హులైన రైతులందరికీ పంట సాయం కింద ఏడాదికి 6 వేల రూపాయలు వారి బ్యాంకు ఖాతాల్లోకి జ‌మ చేస్తోంది. దీంతో ఈ ప‌థ‌కంపై దేశ‌వ్యాప్తంగా రైతులకు నేర‌గా సాయం అందుతుంది . ఈ నేపథ్యంలోనే పీఎం కిసాన్ యోజన స్కీముకు సంబంధించి కీలక సమాచారం బయటకు వొచ్చింది. ఈ స్కీము కింద రైతులకు మరింత లబ్ది చేకూరే విధంగా కొత్త ప్లాన్ రెడీ చేసింద‌ని తెలుస్తోంది. పీఎం కిసాన్ కింద ఇస్తున్న పెట్టుబడి సాయాన్ని పెంచాలని భావించి అందుకు ప...
National Farmers Day 2024 : జాతీయ రైతు దినోత్సవం ప్ర‌త్యేకత ఏమిటి?

National Farmers Day 2024 : జాతీయ రైతు దినోత్సవం ప్ర‌త్యేకత ఏమిటి?

Agriculture
National Farmers Day 2024 : దేశానికి రైతులు చేస్తున్న అమూల్య‌మైన‌ సేవలను గుర్తించేందుకు వారిని గౌర‌వించేందుకు ప్రతి సంవత్సరం డిసెంబర్ 23న జాతీయ రైతు దినోత్సవం, లేదా కిసాన్ దివస్ (Kisan Diwas 2024), జరుపుకుంటారు. భారతదేశ ఐదవ ప్రధానమంత్రి, రైతుల కోసం పోరాడిన ప్రముఖ నేత చౌదరి చరణ్ సింగ్ (Chaudhary Charan Singh) జ్ఞాపకార్థం ఈ రోజును జరుపుకుంటారు. జాతీయ రైతు దినోత్సవం 2024 దేశానికి వెన్నెముకగా నిలుస్తూ ర‌క్తాన్ని చ‌మ‌ట‌గా మార్చి కష్టపడి పనిచేసే రైతులకు త‌ల‌వంచి ప్ర‌ణ‌మిల్లాల్సిన రోజు.కిసాన్ దివస్ చరిత్ర:Kisan Diwas History : రైతు అనుకూల విధానాలను తీసుకొచ్చి రైతుల సంక్షేమం కోసం కృషి చేసినందుకు మాజీ ప్రధాని చ‌ర‌ణ్ సింగ్ (Charan Singh) జ‌న్మ‌దినం సంద‌ర్భంగా జాతీయ రైతు దినోత్స‌వం జరుపుకుంటారు అతను జూలై 1979 నుంచి జనవరి 1980 మధ్య ప్రధానమంత్రిగా పనిచేశారు. చౌదరి చరణ్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన...
Northern Giant Hornet | వ్యవసాయానికి పెను ముప్పుగా మారిన కందిరీగలకు చెక్ పెట్టిన అమెరికా

Northern Giant Hornet | వ్యవసాయానికి పెను ముప్పుగా మారిన కందిరీగలకు చెక్ పెట్టిన అమెరికా

Agriculture
Northern Giant Hornet | హార్నెట్‌లు ( వెస్పా జాతికి చెందిన కీటకాలు ) కందిరీగలలో అతిపెద్దవి. ఇవి తేనెటీగలను వేటాడి తినే కీట‌కం. దీనిని ' మర్డర్ హార్నెట్ అని కూడా పిలుస్తారు. అయితే తేనెటీగ‌ల మ‌నుగ‌డ‌కే ప్ర‌మాద‌క‌రంగా మారిన మర్డర్ హార్నెట్‌ (Murder Hornet) వ్యవసాయానికి పెను ముప్పుగా మారిన కందిరీగలకు చెక్ పెట్టిన అమెరికా)ను నిర్మూలించేందుకు అమెరికా అనేక సంవత్స‌రాలుగా శ్ర‌మిస్తోంది. ఎట్ట‌కేల‌కు హార్నెట్ ను పూర్తిగా సంహ‌రించిన‌ట్లు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అధికారికంగా ప్ర‌క‌టించింది. మూడు సంవత్సరాలుగా హార్నెట్ (వెస్పా మాండరినియా) కు సంబంధించి ఎటువంటి ఆట‌వాళ్లు క‌నిపించ‌లేద‌ని అధికారులు ప్రకటించారు.వాషింగ్టన్ స్టేట్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ (WSDA), యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ (USDA) హార్నెట్ (northern giant hornet ) ఇప్పుడు దేశంలో లేదని ధృవీకరించాయి. ఆసియాకు చె...
Oil Plam | రైతు ఇంటి వద్దే పామాయిల్ కొనుగోలు చేస్తాం..

Oil Plam | రైతు ఇంటి వద్దే పామాయిల్ కొనుగోలు చేస్తాం..

Agriculture, General News
Telangana | తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఆయిల్ పామ్ (Oil Plam ) సాగుపై ఫోకస్ పెట్టాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageshwar Rao ) సూచించారు. మహబూబ్ నగర్ జిల్లాలో రెండు పామాయిల్ మిల్లులు ఏర్పాటు చేస్తామని, పామాయిల్ పంటను రైతు ఇంటి వద్దనే కొంటామని తెలిపారు. పాలమూరు జిల్లాలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న రైతు పండుగ కార్యక్రమంలో మంత్రి తుమ్మల పాల్గొని మాట్లాడారు.వలస జిల్లాగా పేరు పొందిన మహబూబ్ నగర్ (Mahaboob Nagar) జిల్లాకు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఎంతో కీలకమైనదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. దీనికి అత్యంత ప్రాధాన్యమిచ్చి త్వరగా పూర్తి చేయించాలని సభా ముఖంగా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఎండాకాలం పంట మార్చి లోపల కోతలు ప్రారంభిస్తేనే నూకలు తక్కువ అవుతాయని లేకుంటే బియ్యం నూకల శాతం అధికంగా ఉంటుందన్నారు. అందువల్ల ఎ...
Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు