Harithamithra Telugu News

Sunday, May 3Agriculture - Green Mobility - Clean Energy
Shadow

సేంద్రియ వ్యవసాయం

Cocopeat : ఇంట్లోనే కోకోపీట్ తయారు చేయడం ఎలా? – గార్డెనింగ్ చేసేవారికి పూర్తి గైడ్

Cocopeat : ఇంట్లోనే కోకోపీట్ తయారు చేయడం ఎలా? – గార్డెనింగ్ చేసేవారికి పూర్తి గైడ్

సేంద్రియ వ్యవసాయం
How to Make Cocopeat at Home | మన పూర్వికుల నుంచి కొబ్బరి చెట్టును "కల్పవృక్షం" అని ఎందుకు పిలుస్తారో మీకు తెలుసా? దీని ప్రతి భాగం ఏదో ఒక రకంగా ఉపయోగపడుతుంది. కొబ్బరి నీళ్లు, కాయలే కాకుండా, చివరకు మిగిలిపోయే కొబ్బరి పొట్టు (Husk) కూడా మొక్కల పెంపకంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఈ రోజుల్లో గార్డెనింగ్ చేసేవారికి కోకోపీట్ (Cocopeat) ఎంతగానో ఉపయోగపడుతుంది.ఈ స్టోరీలో కోకోపీట్ అంటే ఏమిటి? దాని ఉపయోగాలు ఏంటి? అలాగే మీ ఇంట్లోనే సులభంగా కోకోపీట్ ఎలా తయారు చేయాలో తెలుసుకోండి..కోకోపీట్ అంటే ఏమిటి? (What is Cocopeat?)కొబ్బరి పొట్టు నుండి పీచును (Coir Fiber) వేరు చేసిన తర్వాత మిగిలిపోయే పొడి వంటి పదార్థాన్ని కోకోపీట్ అంటారు. దీనిని "కాయిర్ ఫైబర్ పిత్" లేదా "కాయిర్ డస్ట్" అని కూడా పిలుస్తారు. ఇది మొక్కల పెరుగుదలకు ఒక అద్భుతమైన మాధ్యమంగా పనిచేస్తుంది.కోకోపీట్ యొక్క ప్రత్యేకతలు & ఉపయ...
Indian Agriculture 2047 : అన్నదాతల ఆదాయమే లక్ష్యం.. వ్యవసాయ రంగంలో పెను మార్పులకు ఆర్థిక సర్వే పిలుపు!

Indian Agriculture 2047 : అన్నదాతల ఆదాయమే లక్ష్యం.. వ్యవసాయ రంగంలో పెను మార్పులకు ఆర్థిక సర్వే పిలుపు!

సేంద్రియ వ్యవసాయం
Indian Agriculture 2047 | 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా (Viksit Bharat) మార్చాలన్న కేంద్ర ప్రభుత్వ దార్శనికతలో వ్యవసాయ రంగం కీలక పాత్ర పోషించనుందని తాజా ఆర్థిక సర్వే (Economic Survey 2026) స్పష్టం చేసింది. ఇటీవలి సంవత్సరాల్లో వ్యవసాయం స్థిరమైన వృద్ధిని నమోదు చేసినప్పటికీ, ఉత్పాదకత లోపాలు, వాతావరణ మార్పు ప్రభావాలు, నిర్మాణాత్మక సమస్యలు ఇంకా పరిష్కారం కావాల్సినవిగా ఉన్నాయని సర్వే హెచ్చరించింది. భారతదేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకైన వ్యవసాయం, సమ్మిళిత వృద్ధి సాధించడంలో మరియు కోట్లాది మంది రైతుల జీవనోపాధిని మెరుగుపరచడంలో కేంద్రబిందువుగా ఉంటుందని సర్వే పేర్కొంది.అంకెల్లో వ్యవసాయం: దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతంభారతదేశ జాతీయ ఆదాయంలో దాదాపు 20 శాతం వాటా వ్యవసాయానిదే. విచిత్రమేమిటంటే, దేశంలోని 46.1 శాతం శ్రామిక శక్తి ఇప్పటికీ ఈ రంగంపైనే ఆధారపడి జీవిస్తోంది. గత ఐదేళ్లలో ...
India EU Trade : మన రైతులకు దక్కే ‘వరాలు’ ఇవే!

India EU Trade : మన రైతులకు దక్కే ‘వరాలు’ ఇవే!

సేంద్రియ వ్యవసాయం, General News
India EU Trade Deal : EU భారత్ - యూరోపియన్ యూనియన్ (EU) మధ్య జరిగిన చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం (India EU Trade) కేవలం కార్లు, మొబైల్ ఫోన్లకే పరిమితం కాదు. దీని వెనుక మన వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించే పెద్ద అవకాశం దాగి ఉంది. హరిత మిత్ర పాఠకుల కోసం ఈ ఒప్పందం వల్ల రైతులకు కలిగే ప్రయోజనాలపై ప్రత్యేక విశ్లేషణ:అత్యాధునిక యంత్రాలు.. ఇక చౌక!మన దేశంలో చాలా మంది రైతులు ఖరీదైన యూరోపియన్ టెక్నాలజీ (ఉదాహరణకు: హై-ఎండ్ ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, ఫుడ్ ప్రాసెసింగ్ మిషన్లు) కొనలేకపోతున్నారు. అయితే ఈ ఒప్పందంతో యూరోపియన్ యంత్రాలపై ఉన్న 44% దిగుమతి సుంకం తొలగిపోతుంది. దీనివల్ల అత్యాధునిక సాగు పరికరాలు మన రైతులకు తక్కువ ధరకే లభిస్తాయి.ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో విప్లవంతెలంగాణలో పండే మిర్చి, పసుపు వంటి పంటలను నిల్వ చేయడానికి, పౌడర్ చేయడానికి కావాల్సిన 'ప్రాసెసింగ్ యూనిట్ల' యంత్రాలు ఇకపై చౌకగా దిగుమతి ...
Urban Farming | ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ‘అర్బన్ ఫార్మింగ్’ శిక్షణ!

Urban Farming | ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ‘అర్బన్ ఫార్మింగ్’ శిక్షణ!

సేంద్రియ వ్యవసాయం
Roof Garden Urban Farming : నగరవాసులకు ఇంటి ఆవరణలోనే లేదా డాబాపై (Rooftop) విషరహిత, స్వచ్ఛమైన కూరగాయలను పండించుకునేలా ప్రోత్సహించేందుకు తెలంగాణ రాష్ట్ర ఉద్యాన శాఖ సిద్ధమైంది. అర్బన్ ఫార్మింగ్ పథకంలో భాగంగా ‘ఇంటి ఆవాసాలపై కూరగాయల పెంపకం’ అనే అంశంపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఉద్యాన శాఖ సంచాలకులు ఒక ప్రకటనలో తెలిపారు.శిక్షణ వివరాలు:తేదీ: జనవరి 25, 2026 (ఆదివారం)సమయం: ఉదయం 10:00 గంటల నుండి మధ్యాహ్నం 1:00 గంట వరకు.రిజిస్ట్రేషన్ ఫీజు: రూ. 100/- మాత్రమే.వేదిక: రాష్ట్ర ఉద్యాన శిక్షణ కేంద్రం, పబ్లిక్ గార్డెన్స్ పక్కన, నాంపల్లి, హైదరాబాద్.ఈ శిక్షణలో ఏం నేర్పిస్తారు?ఈ మూడు గంటల శిక్షణలో నిపుణులు కింది అంశాలపై అవగాహన కల్పిస్తారు:కుండీలు/గ్రో బ్యాగ్స్ తయారీ: తక్కువ స్థలంలో మొక్కలను ఎలా అమర్చుకోవాలి?మట్టి మిశ్రమం (Potting Mix): కోకోపిట్, వర్...
Urea Supply | రాష్ట్రంలో యూరియా నిల్వలు సమృద్ధి.. గత 8 ఏళ్లలో ఇదే రికార్డ్: మంత్రి తుమ్మల

Urea Supply | రాష్ట్రంలో యూరియా నిల్వలు సమృద్ధి.. గత 8 ఏళ్లలో ఇదే రికార్డ్: మంత్రి తుమ్మల

సేంద్రియ వ్యవసాయం, Agricultue
Telangana Urea Supply 2026 | రాష్ట్రంలో యూరియా కొరత ఉందంటూ వస్తున్న వార్తలపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టతనిచ్చారు. శాసనమండలి ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యుల ప్రశ్నలకు సమాధానమిస్తూ, రాష్ట్రంలో యూరియా నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.గత 8 ఏళ్లలో అత్యధిక అమ్మకాలుప్రస్తుత యాసంగి (2025–26) సీజన్‌లో గత 8 సంవత్సరాలతో పోలిస్తే రికార్డు స్థాయిలో యూరియా పంపిణీ జరిగింది. డిసెంబర్ 31 నాటికే: 4.04 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రైతులకు సరఫరా చేశాం. గత ఏడాదితో పోలిక: 2024-25లో డిసెంబర్ నాటికి 3.04 లక్షల టన్నులు ఉంటే, ఈసారి అదనంగా మరో లక్ష టన్నులను పంపిణీ చేశాం. కేంద్ర కేటాయింపులు: కేంద్రం 5.60 లక్షల మెట్రిక్ టన్నులు కేటాయిస్తే, ప్రభుత్వం ముందస్తు ప్రణాళికతో 5.78 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను తెప్పించుకుంది.సంవత్సరంయూరియా అమ్మకాలు (మ...
Urea Shortage | మళ్లీ యూరియా కష్టాలు.. చలిలో అన్నదాతల పడిగాపులు!

Urea Shortage | మళ్లీ యూరియా కష్టాలు.. చలిలో అన్నదాతల పడిగాపులు!

సేంద్రియ వ్యవసాయం, Agricultue
Urea Shortage in Telangana | రాష్ట్రంలో ఎరువుల కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. యాసంగి సాగు పనులు ఊపందుకుంటున్ననేపథ్యంలో యూరియా కొరత రైతులను తీవ్రంగా వేధిస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాలో తీవ్రమైన చలిని సైతం లెక్కచేయకుండా రైతులు ఎరువుల దుకాణాల వద్ద గంటల కొద్దీ తరబడి క్యూలో పడిగాపులు కాస్తున్నారు. చెప్పులు, కర్రలు క్యూలో పెట్టిన దృశ్యాలు ఇప్పుడు సోషల్​ మీడియాలో వైరల్​ అవుతున్నాయి.'ఫర్టిలైజర్ బుకింగ్ యాప్'.. రైతులకు వరమా? శాపమా?ఎరువుల పంపిణీని సులభతరం చేసేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'ఫర్టిలైజర్ బుకింగ్ యాప్' రైతులకు కొత్త చిక్కులు తెచ్చిపెట్టింది. గతంలో నేరుగా గోదాములకు వెళ్లి డబ్బులు చెల్లించి ఎరువులు తెచ్చుకునే పద్ధతి ఉండేది. కానీ ఇప్పుడు యాప్ ద్వారా బుక్ చేసుకోవాలని నిబంధన పెట్టడంతో సామాన్య రైతులు అయోమయానికి గురవుతున్నారు.సాంకేతిక సమస్యలు: యాప్ ప్రారంభించిన తొలిరోజునే మ...
“రైతు యాంత్రీకరణ పథకం” కోసం రైతులు ఎలా దరఖాస్తు చేసుకోవాలి

“రైతు యాంత్రీకరణ పథకం” కోసం రైతులు ఎలా దరఖాస్తు చేసుకోవాలి

సేంద్రియ వ్యవసాయం, Agricultue
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించే లక్ష్యంతో రైతు యాంత్రీకరణ పథకాన్ని (Farm Mechanization Scheme) జనవరి నెలలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పునఃప్రారంభించనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తాజాగా ప్రకటించారు. ఈ నేప‌థ్యంలో రైతులు త‌మ‌కు అవ‌స‌ర‌మైన వ్య‌వ‌సాయ యంత్రాల కోసం ఎలా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..దరఖాస్తు విధానం (Step-by-Step):రైతులు తెలంగాణ వ్యవసాయ శాఖకు చెందిన అధికారిక వెబ్‌సైట్ లేదా మీ సేవ (Me Seva) కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.దరఖాస్తులో రైతు పేరు, తండ్రి పేరు, గ్రామం, మండలం మరియు జిల్లా వివరాలను నమోదు చేయాలి.పనిముట్ల ఎంపిక: మీకు కావాల్సిన వ్యవసాయ యంత్రం (ట్రాక్టర్, రోటవేటర్, పవర్ టిల్లర్, స్ప్రేయర్లు మొదలైనవి) మరియు ఆ యంత్రం ఏ కంపెనీకి చెందినదో ఎంచుకోవాలి.పత్రాల అప్‌లోడ్: అవసరమైన పత్రాలన...
జనవరిలో ‘రైతు యాంత్రీకరణ’ పథకం పునఃప్రారంభం

జనవరిలో ‘రైతు యాంత్రీకరణ’ పథకం పునఃప్రారంభం

సేంద్రియ వ్యవసాయం
రైతులకు 1.31 లక్షల యంత్రాలు..మంత్రి తుమ్మల కీలక ప్రకటన!హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించే లక్ష్యంతో నిలిచిపోయిన రైతు యాంత్రీకరణ పథకాన్ని (Farm Mechanization Scheme) జనవరి నెలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పునఃప్రారంభించనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. బుధవారం సచివాలయంలో వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.రైతు యాంత్రీకరణకు సర్వం సిద్ధంగత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన యాంత్రీకరణ పథకాన్ని (Farm mechanization scheme) ఈ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని మంత్రి తెలిపారు. ఈ పథకం ద్వారా సుమారు 1,31,000 మంది రైతులకు సబ్సిడీపై ట్రాక్టర్లు, ఇతర వ్యవసాయ పనిముట్లను అందించనున్నారు. ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోందని, జనవరి మొ...
ప్రభుత్వ అగ్రి విజన్‌లో పసుపుకు కీలక స్థానం : మంత్రి తుమ్మల

ప్రభుత్వ అగ్రి విజన్‌లో పసుపుకు కీలక స్థానం : మంత్రి తుమ్మల

సేంద్రియ వ్యవసాయం, Agricultue
హైదరాబాద్ : దేశంలో పండే పసుపును ప్రపంచ మార్కెట్లలో పోటీ పడే స్థాయికి తీసుకెళ్లేందుకు సమష్టి చర్యలు అవసరమని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. హైదరాబాద్‌లో సీఐఐ తెలంగాణ, నేషనల్ టర్మరిక్ బోర్డు సంయుక్తంగా నిర్వహించిన టర్మరిక్ వాల్యూ చైన్ సమ్మిట్ – 2025 (Turmeric Value Chain Summit 2025) లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.అగ్రి విజన్ 2047 – ఆర్థిక వృద్ధికి ఇంజిన్ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన అగ్రి వర్షన్-2047 గురించి మంత్రి మాట్లాడుతూ, వ్యవసాయాన్ని కేవలం సంక్షేమ రంగంగా కాకుండా, రాష్ట్ర ఆర్థిక వృద్ధికి ప్రధాన ఇంజిన్‌గా చూస్తున్నామని తెలిపారు. ఈ విజన్‌లో పసుపు సాగుకు మరియు రైతులకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుందని ఆయన స్పష్టం చేశారు.నేషనల్ టర్మరిక్ బోర్డుపై కీలక వ్యాఖ్యలునిజామాబాద్ రైతుల చిరకాల ఆకాంక్ష అయిన నేషనల్ టర్మరిక్ బోర్డును ఏర్పాటు చేసినప్పటికీ, అది...
Maruti Suzuki e Vitara EV Price, Range, Features Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates