Delhi pollution: ఢిల్లీ మళ్లీ ఉక్కిరిబిక్కిరి.. ప్రమాదకర స్థాయిలో కాలుష్యం.. నగర శివార్లలో ట్రాఫిక్, ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు

Delhi pollution: ఢిల్లీ మళ్లీ ఉక్కిరిబిక్కిరి.. ప్రమాదకర స్థాయిలో కాలుష్యం.. నగర శివార్లలో ట్రాఫిక్, ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు

Delhi: దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత ‘ప్రమాదకర’ కేటగిరీ (Severe’ Category) కి చేరడంతో ఢిల్లీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. కాలుష్యం గాలి నాణ్యత గురువారం ఉదయం ప్రమాదకరస్థాయికి చేరింది. AQI 400ని దాటింది, విషపూరితమైన పొగమంచు, దట్టమైన పొగ నగరాన్ని చుట్టుముట్టింది. ఇది అన్ని వయసుల వారి ఆరోగ్య సమస్యలను పెంచుతుంది.

కొన్నాళ్ల క్రితం వర్షం కాస్త ఉపశమనం కలిగించినప్పటికీ, ఢిల్లీలో కాలుష్య స్థాయిలు మళ్లీ పెరిగాయి. దీపావళి సందర్భంగా పటాకుల నిషేధాన్ని ప్రజలు బేఖాతరు చేయడంతో వాయు కాలుష్యం మరింత పెరిగింది. భవన నిర్మాణాలపై నిషేధాలు, డీజిల్ ట్రక్కుల ప్రవేశంతో సహా నగర ఢిల్లీ ప్రభుత్వం పలు కఠినమైన చర్యలు సక్రమంగా అమలు కాకపోవడంతో సమస్య మరింత జటిలమైపోయింది.

AQI డేంజర్ బెల్స్

ఢిల్లీలో ప్రధాన ప్రాంతాలు భయంకరమైన AQI స్థాయిలను నమోదు చేశాయి. బవానా వద్ద 442, ITO వద్ద 415, జహంగీర్‌పురి వద్ద 441, ద్వారక వద్ద 417, అలీపూర్ వద్ద 415, ఆనంద్ విహార్ వద్ద 411, ఢిల్లీ విమానాశ్రయం చుట్టూ 403 పాయింట్లు చూపించాయి.

delhi pollution ఢిల్లీలో రాబోయే నాలుగు రోజుల పాటు పొగమంచుతో కూడిన వాతావరణం కొనసాగుతుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. శివాంగ్ అనే అథ్లెట్ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కారణంగా ఆరుబయట ప్రాక్టీస్ కి శిక్షణ ఇబ్బంది పడ్డాడు. ఉత్తరప్రదేశ్ నుంచి సందర్శించిన హర్షిత్ గుప్తా, ఢిల్లీ గాలిని పొగ పీల్చడంతో పోల్చారు, ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి పరిష్కార మార్గాలు చూడాలని కోరారు. ఈ విపత్తును ఎదుర్కోవడానికి, ఢిల్లీ ప్రభుత్వం CNG, విద్యుత్ వాహనాలను ప్రోత్సహిస్తోంది. డీజిల్‌తో నడిచే అన్ని ప్రయాణీకుల బస్సులను రాజధానిలోకి ప్రవేశించకుండా నిషేధించాలని యోచిస్తోంది.delhi pollution
ఢిల్లీ శివార్లలో ట్రాఫిక్ పోలీసులు, ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు
ఓవర్‌లోడ్ ట్రక్కులు, కాలుష్య ధృవీకరణ పత్రాలు, రద్దీపై దృష్టి సారించి పరిమితులకు అనుగుణంగా ఉండేలా చూడటానికి ట్రాఫిక్ యూనిట్లతో సహా ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు ఢిల్లీ సరిహద్దుల్లో మోహరించారు.
ప్రపంచ స్థాయిలో, IQAir ఇటీవలి నివేదికలో ఢిల్లీ అత్యంత కాలుష్య నగరంగా ర్యాంక్ పొందింది. ఇంకా లాహోర్, ముంబై తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

బాణ సంచా, వ్యవసాయ పంటల దహనం

దీపావళి రోజున గాలి నాణ్యతలో తాత్కాలిక మెరుగుదల ఉన్నప్పటికీ.. రాత్రి వరకు కొనసాగిన బాణసంచా కార్యకలాపాలు కాలుష్య స్థాయిలను మరింత దిగజార్చాయి. దీపావళి తర్వాత కాలుష్యం పెరగడానికి ప్రధానంగా బాణసంచా తోపాటు కొంత మేరకు వ్యవసాయ పంట దహనమేనని చెబుతున్నారు. వైద్య నిపుణులు ఢిల్లీలోని కలుషితమైన గాలిని పీల్చడాన్ని ప్రతిరోజూ దాదాపు 10 సిగరెట్లు తాగడం వల్ల కలిగే హానికరమైన ప్రభావాలతో సమానమని చెబుతున్నారు.

Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.
Harithamithra

👉 “Eco friendly & environmental news updates for Free”

వ్యవసాయం, సోలార్​​ ఎనర్జీ, గ్రీన్​ మొబలిటికి సంబంధించిన అప్‌డేట్స్​ను ఉచితంగా పొందండి!"

We don’t spam! Read our privacy policy for more info.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

🌱 పర్యావరణ వార్తలు వెంటనే తెలుసుకోండి!

Green Mobility, Solar, EV, Environment కి సంబంధించిన తాజా వార్తలు కోసం Harithamitra ను Follow అవ్వండి.

♻️ Harithamitra – పర్యావరణానికి మీ డిజిటల్ మిత్రుడు