Harithamithra Telugu News

Home General News Electric Buses | హైదరాబాద్‌లో ఈవీ విప్లవం : 2,200 ఎలక్ట్రిక్ బస్సులు.. 25 డిపోల్లో...

Electric Buses | హైదరాబాద్‌లో ఈవీ విప్లవం : 2,200 ఎలక్ట్రిక్ బస్సులు.. 25 డిపోల్లో భారీ ఛార్జింగ్ స్టేషన్లు!

0
Electric Buses
TGSRTC Electric Buses

హైదరాబాద్: భాగ్యనగరం గ్రీన్ సిటీగా మారే దిశగా మరో కీల‌క అడుగు పడింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాలుష్యాన్ని తగ్గించి, ప్రజా రవాణాను పర్యావరణ హితంగా మార్చేందుకు TGSRTC, TGSPDCL చేతులు కలిపాయి. నగరవ్యాప్తంగా 2,200 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను (Electric Buses) ప్రవేశపెట్టాలని నిర్ణయించిన నేపథ్యంలో, వీటికి అవసరమైన ఛార్జింగ్ మౌలిక సదుపాయాలపై అధికారులు కసరత్తు పూర్తి చేశారు.

25 డిపోల్లో ఛార్జింగ్ పాయింట్లు

హైద‌రాబాదాద్‌లో తాజాగా జరిగిన సమన్వయ కమిటీ సమావేశంలో సదరన్ డిస్కామ్ (TGSPDCL) కీలక నిర్ణయం తీసుకుంది. గ్రేటర్ హైదరాబాద్‌లోని 25 ప్రధాన బస్ డిపోల్లో అత్యాధునిక ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు.

వీటితో పాటు జిల్లా కేంద్రాలైన సూర్యాపేట (2 స్టేషన్లు), సంగారెడ్డి (1), మరియు నల్గొండ (1) డిపోలలో కూడా ఛార్జింగ్ పాయింట్లు అందుబాటులోకి రానున్నాయి.

124 మెగావాట్ల భారీ విద్యుత్ సరఫరా

ఈ కొత్త ఛార్జింగ్ స్టేషన్ల నిర్వహణకు దాదాపు 124 మెగావాట్ల విద్యుత్ అవసరమని అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు అవసరమైన సబ్‌స్టేషన్లు, స్విచింగ్ స్టేషన్ల ఏర్పాటుకు డిపోల్లోనే స్థలాలను కేటాయించనున్నారు.

“ఈ ఏడాది చివరి నాటికి గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు పెద్ద ఎత్తున ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తెస్తాం.” — వై. నాగి రెడ్డి, వైస్ చైర్మన్ & ఎండీ, TGSRTC.

ఫిబ్రవరి 1 నుంచి పనులు ప్రారంభం

ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు సంబంధించి ఫిబ్రవరి 1 నాటికి అంచనాలు (Estimates) సిద్ధం చేసి, పనులు ప్రారంభించాలని సదరన్ డిస్కామ్ సీఎండీ Md. ముషారఫ్ ఫరూఖీ అధికారులను ఆదేశించారు. దీనివల్ల నగరంలో డీజిల్ బస్సుల వాడకం తగ్గి, కార్బన్ ఉద్గారాలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.

Previous articleUrban Farming | ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ‘అర్బన్ ఫార్మింగ్’ శిక్షణ!
Next articleలక్ష లోపు బడ్జెట్‌లో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏది? చేతక్ C25 vs TVS vs Vida
Kiran Podishetty
కిరణ్ పొడిశెట్టి, హరితమిత్ర మీడియా వ్యవస్థాపకులు, పర్యావరణ పరిరక్షణకు అంకితభావంతో పనిచేస్తున్న సీనియ‌ర్‌ జర్నలిస్ట్. ఎమ్మెస్సీ, ఎంజీజే పూర్తిచేసిన‌ ఆయనకు ప్రింట్ మీడియా రంగంలో 17 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికల్లో సబ్‌ ఎడిటర్‌గా ప‌నిచేశారు. హరితమిత్ర ద్వారా ఆయన సేంద్రియ వ్యవసాయం, సోలార్ ఎనర్జీ, గ్రీన్ మొబిలిటీ (ఎలక్ట్రిక్‌, సిఎన్‌జి వాహనాలు) ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ వంటి అంశాలపై నిరంతరం విశ్లేషణాత్మక కథనాలు, తాజా అప్‌డేట్స్‌ను అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here