లక్ష ఈ-స్కూటర్ల సేల్స్ పూర్తయిన సందర్భంగా ప్రత్యేక ఆఫర్లు ప్రకటించిన కంపెనీ

Joy e-bike offers
Spread the love

Joy e-bike offers : భారతదేశంలో ‘జాయ్ ఇ-బైక్’ (Joy e-bike) బ్రాండ్ తో  ఎలక్ట్రిక్ వాహనాల తయారీ చేస్తున్న Wardwizard సంస్థ దేశంలో 1 లక్ష ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల విక్రయాల మైలురాయిని దాటేసింది. ఈమేరకు  కంపెనీ తన 1,00,000వ యూనిట్ మిహోస్‌ను వడోదరలోని దాని తయారీ కర్మాగారం నుంచి విడుదల చేసింది.

2016లో స్థాపించబడిన ఈ సంస్థ ఎలక్ట్రిక్ సైకిళ్లలో తన మొదటి ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రయాణాన్ని ప్రారంభించింది. BSE లో భారతదేశం యొక్క మొట్టమొదటి లిస్టెడ్ EV కంపెనీగా, వార్డ్‌విజార్డ్ 2018లో దాని మొట్టమొదటి  తక్కువ-వేగం గల ఎలక్ట్రిక్ స్కూటర్, బటర్‌ఫ్లైని పరిచయం చేసింది. ప్రస్తుతం, కంపెనీ 10 మోడళ్ల పోర్ట్‌ఫోలియోను కలిగి ఉంది. వీటిలో హై స్పీడ్, లో -స్పీడ్ వేరియంట్‌లు ఉన్నాయి. దేశవ్యాప్తంగా 750కి పైగా టచ్‌పాయింట్‌ల నెట్‌వర్క్ ను పెంపొందించుకుంది.

READ MORE  EV News | వాహనదారులకు గుడ్ న్యూస్ ఇకపై ఎలక్ట్రిక్‌ ‌వాహనాలకు భారీగా ప్రోత్సాహకాలు

కాగా  లక్ష యూనిట్ల సేల్స్  మైలురాయిని పురస్కరించుకుని, కంపెనీ తన కస్టమర్ల కోసం ప్రత్యేక ప్రయోజనాలు (Joy e-bike offers),ఉచిత బీమాను అందిస్తూ వరుస ఆఫర్‌లను అందిస్తోంది.  ఈ ఆఫర్‌లు మార్చి 31, 2024 వరకు భారతదేశంలోని అన్ని అధీకృత జాయ్ ఇ-బైక్ డీలర్‌షిప్‌ల వద్ద చెల్లుబాటులో ఉంటాయి.

ఈ విజయాన్ని గురించి వార్డ్‌విజార్డ్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ యతిన్ గుప్తే మాట్లాడుతూ..  “దేశంలో ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన బ్రాండ్‌గా వార్డ్‌విజార్డ్ ఇన్నోవేషన్స్‌ను ప్రోత్సహించినందుకు మా కస్టమర్‌లు, వాటాదారులకు వారి అచంచలమైన మద్దతు  ఇస్తున్నందుకు  మేము  కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. .”

READ MORE  Simple OneS | ఓలాకు పోటీగా కొత్తగా సింపుల్ వన్ ఎస్..

“ఈ లక్ష విక్రయాల మైలురాయి మా విభిన్న ఉత్పత్తుల శ్రేణి నాణ్యతకు అద్దంపడుతుంది.   స్థిరమైన భవిష్యత్తు,  కస్టమర్ డిమాండ్‌లను తీర్చడం కోసం మా  అంకితభావాన్ని నొక్కి చెబుతుంది. మేము మా ‘జాయ్ ఇ-బైక్’ బ్రాండ్ ద్వారా కమ్యూనిటీలను ఆవిష్కరించడం,  సాధికారత కల్పించడం కొనసాగిస్తున్నందున, మేము  ఇదే ఒరవడితో ముందుకు సాగుతాము. ఇదే స్పీడ్ తో 2026 నాటికి రెండు లక్షల మైలురాయిని చేరుకోవాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నామని తెలిపారు.

Wardwizard దాని మొదటి హైడ్రోజన్-ఆధారిత ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం కాన్సెప్ట్ ను ఇటివలే ఆవిష్కరించింది.  దాని ప్రస్తుత ఉత్పత్తి శ్రేణిని ప్రదర్శించింది, ఇందులో హై స్పీడ్, లో స్పీడ్  మోడల్‌లుచ  ‘జాయ్ ఇ-రిక్’ బ్రాండ్ పేరుతో ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ ఉన్నాయి.

READ MORE  EV News | వాహనదారులకు గుడ్ న్యూస్ ఇకపై ఎలక్ట్రిక్‌ ‌వాహనాలకు భారీగా ప్రోత్సాహకాలు

Green Mobility, Solar Energy,  Organic Farming, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి.

అలాగే ఎలక్ట్రిక్, హైడ్రోజన్, సీఎన్ జీ వాహనాలకు సంబంధించిన  అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.

2 Replies to “లక్ష ఈ-స్కూటర్ల సేల్స్ పూర్తయిన సందర్భంగా ప్రత్యేక ఆఫర్లు ప్రకటించిన కంపెనీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *