Harithamithra Telugu News

Thursday, April 30Agriculture - Green Mobility - Clean Energy
Shadow

General News

Vanamahotsavam-2024 | ఎక్కువ మొక్క‌లు నాటిన వారికి ఇక‌పై అవార్డులు..

Vanamahotsavam-2024 | ఎక్కువ మొక్క‌లు నాటిన వారికి ఇక‌పై అవార్డులు..

General News
VIJAYAWADA : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర‌వ్యాప్తంగా ఈ సంవ‌త్స‌రం కోటి మొక్క‌ల‌ను నాటి సంర‌క్షిస్తామ‌ని ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు స్ప‌ష్టం చేశారు. వన మహోత్సవాన్ని (Vanamahotsavam-2024) పురస్కరించుకుని మంగళగిరిలోని ఎకో పార్కులో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌తో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు మొక్కలు నాటారు. ఏపీకి 50% పచ్చదనం అందించాలనే లక్ష్యంతో మొక్కలు నాటాలని, అదే సమయంలో ఉన్న చెట్లను సైతం కాపాడడం మ‌రిచిపోవ‌ద్ద‌ని ప్రజలకు సూచించారు. హరితాంధ్ర కోసం పాటుపడదాం, మొక్కలు నాటండి అనే నినాదంతో వనమహోత్సవం-2024 కింద రాష్ట్రానికి 50 శాతం పచ్చదనం వచ్చేలా మీరందరూ బాధ్యత వహించాలని అన్నారు.వనమహోత్సవం (Vanamahotsavam-2024)లో పాల్గొన్న చిన్నారుల నుంచి సీఎం ప్రతిజ్ఞ చేయించారు. ‘‘మా పిల్లల భవిష్యత్తు సంకీర్ణ ప్రభుత్వ లక్ష్యం. అందరం హరిత యజ్ఞంలో పాలుపంచుకుందాం.” ప్రతి ఇంటి ఆవరణ...
PM Modi | వాతావరణాన్ని తట్టుకోగల 109 విత్తన రకాల విడుదల

PM Modi | వాతావరణాన్ని తట్టుకోగల 109 విత్తన రకాల విడుదల

General News
Climate Resilient Seed Varieties | వ్యవసాయ ఉత్ప‌త్తులను మెరుగుప‌రిచేందుకు, రైతుల ఆదాయాన్ని పెంపొందించేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం అధిక దిగుబడినిచ్చే, వాతావరణాన్ని తట్టుకోగల జీవసంబంధమైన 109 రకాల‌ వ్యవసాయ, ఉద్యానవన పంటల విత్త‌నాల‌ను విడుదల చేశారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ICAR)అభివృద్ధి చేసిన ఈ రకాల్లో 34 క్షేత్ర పంటలు, 27 ఉద్యాన పంటలతో సహా 61 పంటలు ఉన్నాయి.ఢిల్లీలోని పూసా క్యాంపస్‌లోని మూడు ప్రయోగాత్మక వ్యవసాయ క్షేత్రాల‌లో జ‌రిగిన‌ ఒక కార్యక్రమంలో ప్రధాని మోదీ విత్తనాలను ఆవిష్కరించారు, అక్కడ రైతులు, శాస్త్రవేత్తలతో ఆయ‌న చ‌ర్చించారు. క్షేత్ర పంట రకాలలో తృణధాన్యాలు, మినుములు, మేత పంటలు, నూనెగింజలు, పప్పుధాన్యాలు, చెరకు, పత్తి పంటలు ఉన్నాయి. హార్టికల్చర్ కోసం, ప్రధాని కొత్త రకాల పండ్లు, కూరగాయలు, తోటల పంటలు, దుంపలు, సుగంధ ద్రవ్యాలు, పువ్వులు, ఔషధ మొక్కలను వి...
New FASTag Rules | కొత్త ఫాస్ట్‌ట్యాగ్ నియమాలు అమలులోకి వచ్చేశాయి. ఇవి పాటించకుంటే ఇబ్బందే..

New FASTag Rules | కొత్త ఫాస్ట్‌ట్యాగ్ నియమాలు అమలులోకి వచ్చేశాయి. ఇవి పాటించకుంటే ఇబ్బందే..

General News
New FASTag Rules | నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) FASTag వినియోగదారుల కోసం కొత్త మార్గదర్శకాలను అమలు చేస్తోంది. ఇది మీ KYC ని అప్ డేట్ చేయాల్సి ఉంటుంది. ఫాస్ట్‌ట్యాగ్ అనేది వాహనాలకు ప్రీ-పెయిడ్ ట్యాగ్ సదుపాయం, ఇది టోల్ ప్లాజాల వద్ద వేచి ఉండాల్సిన అవసరం లేకుండా ట్రాఫిక్‌ను నాన్‌స్టాప్‌గా ప్రయాణించడానికి వీలు కల్పిస్తుంది. ఎలక్ట్రానిక్ టోల్ సేకరణ వ్యవస్థ ను మెరుగుపరచడానికి, టోల్ ప్లాజాల వద్ద వాహనాలు అగిపోకుండా సాఫీగా వెళ్లిపోవడానికి FASTag KYC చెక్ ప్రవేశపెట్టారు.KYC అప్‌డేట్: FASTag వినియోగదారులు తమ KYC వివరాలను అక్టోబర్ 31 వరకు అప్‌డేట్ చేయాలి, ప్రత్యేకించి వారి FASTag 3 నుండి 5 సంవత్సరాల మధ్య ఉంటే తప్పనిసరి.పాత ఫాస్ట్‌ట్యాగ్‌ల భర్తీ: ఐదేళ్ల కంటే పాత ఏవైనా ఫాస్ట్‌ట్యాగ్‌లు తప్పనిసరిగా భర్తీ చేయాలి.వాహన వివరాలను లింక్ చేయడం: వాహనం రిజిస్ట్రేషన్ నంబర్, ఛాసిస్ నంబర...
Electric Bus | ఇప్పుడు భారత్ లో అత్య‌ధిక ఎల‌క్ట్రిక్ బ‌స్సులు ఉన్న న‌గ‌రం ఇదే..

Electric Bus | ఇప్పుడు భారత్ లో అత్య‌ధిక ఎల‌క్ట్రిక్ బ‌స్సులు ఉన్న న‌గ‌రం ఇదే..

General News
Electric Bus | భారతదేశంలో అత్యధిక ఎలక్ట్రిక్ బస్సులను కలిగి ఉన్న మొదటి నగరంగా అలాగే ప్రపంచవ్యాప్తంగా మూడవ నగరంగా న్యూఢిల్లీ అవతరించింది. ఈమేర‌కు మంగళవారం ఢిల్లీలో కొత్త‌గా 320 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వచ్చాయి, నగరంలో ప్ర‌స్తుతం ఎల‌క్ట్రిక్ బ‌స్సుల‌ సంఖ్య 1,970కి చేరుకుంది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా కొత్త బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ బస్సుల రాక‌పోక‌ల‌తో ఢిల్లీ కాలుష్యంపై పోరాటానికి బలం చేకూరుస్తుందని బాన్సెరాలో జరిగిన ఫ్లాగ్-ఆఫ్ కార్యక్రమంలో వీకే సక్సేనా చెప్పారు.ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. "మేము 320 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభిస్తున్నాం. ఇవి ఢిల్లీ ప్రజలకు ఉపశమనం కలిగిస్తాయి. రాబోయే కాలంలో, ఇటువంటి మరిన్ని బస్సులను అందుబాటులోకి తీసుకువ‌చ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. ఢిల్లీలో కాలుష్యం తగ్గించాల్సిన అవసరం ఉంటే, ప్రజా రవాణాను బలోపేతం చేయాలని నేను భావ...
TGSRTC Electric Buses | ప్రయాణికులకు గుడ్ న్యూస్.. త్వరలో రోడ్లపైకి వెయ్యి కొత్త బస్సులు..  ఈ రూట్లలోనే.. ..

TGSRTC Electric Buses | ప్రయాణికులకు గుడ్ న్యూస్.. త్వరలో రోడ్లపైకి వెయ్యి కొత్త బస్సులు.. ఈ రూట్లలోనే.. ..

General News
TGSRTC Electric Buses |  హైదరాబాద్ : ప్రయాణికులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ లో కాలుష్య ఉద్గారాలను తగ్గించేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) 1,000 ఎలక్ట్రిక్ బస్సులను ఆర్డర్ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా ప్రారంభించిన 13 ఛార్జింగ్ స్టేషన్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. దశలవారీగా డెలివరీ చేయబోయే ఈ ఎలక్ట్రిక్ బస్సులు గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ (జిసిసి) మోడల్‌లో పనిచేస్తాయి. ఈ పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్య మోడల్‌లో ఎలక్ట్రిక్ వాహన సరఫరాదారులకు నిర్వహణ కోసం కిలోమీటరు ప్రాతిపదికన చెల్లింపు ఉంటుంది. వీటిలో 500 కంటే ఎక్కువ బస్సులు సిటీ రూట్లలో సేవలు అందించనున్నాయి. ఈ రూట్లలోనే కొత్త బస్సులు.. TGSRTC Electric Buses : ఎంజీబీఎస్, జేబీఎస్, హెచ్‌సీయూ, హయత్‌నగర్-2, రాణిగంజ్, కూకట్‌పల్లి, బీహెచ్‌ఈఎల్, హైదరాబాద్-2, వరంగల్, సూర్యాపేట, కరీంనగర్-2...
ElectriExpo 2024 | హైదరాబాద్ లో ఆగస్టు 29 నుంచి ఎలక్ట్రిఎక్స్‌పో 2024

ElectriExpo 2024 | హైదరాబాద్ లో ఆగస్టు 29 నుంచి ఎలక్ట్రిఎక్స్‌పో 2024

General News
ElectriExpo 2024 | హైదరాబాద్ : సికింద్రాబాద్ ఎలక్ట్రిక్ ట్రేడర్స్ అసోసియేషన్ (SETA) 100కి పైగా ఎలక్ట్రిక్ బ్రాండ్‌లను ఒకే గొడ‌గు కింద‌కు తీసుకు వ‌చ్చింది. 'పవరింగ్ ప్రోగ్రెస్-పయనీరింగ్ టుమారో: ఇగ్నైటింగ్ ఛేంజ్' థీమ్‌తో ఆగస్టు 29 నుంచి 31 వరకు ఎలక్ట్రిఎక్స్‌పో 2024ను నిర్వహించేందుకు సికింద్రాబాద్ ఎలక్ట్రిక్ ట్రేడర్స్ అసోసియేషన్ (SETA) స‌న్నాహాలు చేస్తోంది.SETA నిర్వ‌హిస్తున్న‌ ఈ ఎలక్ట్రిఎక్స్‌పో 2024.. ఎలక్ట్రికల్ ఉత్పత్తులు, పరికరాల కు సంబంధించి దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద ప్రదర్శన కావడంతో, ఇందులో ఇంజనీర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, విద్యార్థులు, ఆర్కిటెక్ట్‌లు, కాంట్రాక్టర్లు, ఇతరులతో సహా 30,000 మంది పాల్గొనే అవకాశం ఉంది.“ElectriExpo 2024 ప్రధానంగా ఇంధన ఆదా, విద్యుత్ ఉత్పత్తి, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఆటోమేషన్, గాడ్జెట్‌లు, ఉపకరణాలపై దృష్టి పెడుతుంది. వివిధ పరిశ్రమల నిపుణులచే టెక్ సె...
Budget For Agriculture : వ్యవసాయం, అనుబంధ రంగాలకు భారీగా నిధులు..

Budget For Agriculture : వ్యవసాయం, అనుబంధ రంగాలకు భారీగా నిధులు..

General News
Budget For Agriculture  | కేంద్ర బడ్జెట్‌లో వ్యవసాయం,  అనుబంధ రంగాలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్  రూ.1.52 లక్షల కోట్ల మేర భారీగా కేటాయింపులను ప్రకటించారు. వచ్చే రెండేళ్లలో 10 మిలియన్ల మంది రైతులకు సహజ వ్యవసాయ పద్ధతులను ప్రవేశపెడతామని ఆర్థిక మంత్రి తెలిపారు. సీతారామన్ తన వరుసగా ఏడవ బడ్జెట్ ప్రజెంటేషన్‌లో స్థిరమైన పద్ధతులు, డిజిటల్ మౌలిక సదుపాయాలు, ఉత్పత్తిని పెంచడంపై దృష్టి సారించే కార్యక్రమాలను వివరించారు.బడ్జెట్ ప్రసంగంలో ఆమె మాట్లాడుతూ.. సహజ వ్యవసాయం వైపు మళ్లడం అనేది స్థిరమైన వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడం, రసాయన ఎరువులు, పురుగుమందులపై ఆధారపడటాన్ని తగ్గించడం. సహజ వ్యవసాయం నేల ఆరోగ్యం, జీవవైవిధ్యాన్ని పెంచుతుంది. అదే సమయంలో రైతులకు సాగు ఖర్చులను కూడా తగ్గిస్తుంది, తద్వారా వారి లాభదాయకతను పెంచుతుంది. పెద్ద ఎత్తున కూరగాయల ఉత్పత్తి క్లస్టర్లను ప్రోత్సహించే ప్రభుత్వ ప్రణాళి...
UP Vehicle Policy | కొనుగోలుదారుల‌కు గుడ్ న్యూస్‌.. హైబ్రిడ్ కార్ల‌పై రిజిస్ట్రేషన్ పన్ను పూర్తిగా రద్దు చేసిన యూపీ ప్ర‌భుత్వం

UP Vehicle Policy | కొనుగోలుదారుల‌కు గుడ్ న్యూస్‌.. హైబ్రిడ్ కార్ల‌పై రిజిస్ట్రేషన్ పన్ను పూర్తిగా రద్దు చేసిన యూపీ ప్ర‌భుత్వం

General News
UP Vehicle Policy | లక్నో: రాష్ట్రంలో ప‌ర్యావ‌ర‌ణ హిత‌మైన‌ వాహనాలను ప్రోత్స‌హించే లక్ష్యంతో యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం.. హైబ్రిడ్ కార్లపై రిజిస్ట్రేషన్ పన్నును పూర్తిగా రద్దు చేయాలని నిర్ణయించింది. హైబ్రిడ్ వాహనాల రిజిస్ట్రేషన్ ఫీజుపై 100 శాతం మినహాయింపు ఇచ్చే విధానం తక్షణమే అమలులోకి వస్తుందని ప్రభుత్వం వెల్ల‌డించింది.కొత్త పాలసీ వ‌ల్ల‌ మారుతీ సుజుకి, టయోటా కిర్లోస్కర్ మోటార్, హోండా కార్స్ ఇండియా వంటి తయారీదారులకు భారీ ప్రయోజనాన్ని క‌లిగిస్తుంది. కొత్త పాలసీ (UP Vehicle Policy ) ని ప్రవేశపెట్టిన తర్వాత ఈ కార్లను కొనుగోలు చేసే కస్టమర్లు రూ. 3.5 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు. ఇది కొనుగోలుదారుల‌కు నిజంగా శుభ‌వార్త..యూపీ ప్రభుత్వం ప్రస్తుతం రూ. 10 లక్షల కంటే తక్కువ ధర ఉన్న వాహనాలపై 8 శాతం రోడ్డు పన్ను, రూ. 10 లక్షల కంటే ఎక్కువ ధర ఉన్న వాహనాలపై (ఎక్స్-షోరూమ్) 10 శా...
Vanamahotsavam 2024 | తెలంగాణలో వన మహోత్సవం కింద 33,320 మొక్కల పెంపకం..

Vanamahotsavam 2024 | తెలంగాణలో వన మహోత్సవం కింద 33,320 మొక్కల పెంపకం..

General News
తెలంగాణలో ఈ సంవ‌త్స‌రం వ‌న మ‌హోత్స‌వం (Vanamahotsavam)  కింద సుమారు 33,320 మొక్క‌లు నాటాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం ల‌క్ష్యం నిర్ధేశించుకుంది. రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖల మంత్రి కొండా సురేఖ నిన్న ఖ‌మ్మం జిల్లా సత్తుపల్లి మండలం గొల్లగూడెంలో వన మహోత్సవంలో భాగంగా రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్‌, ‌సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి మొక్కలు నాటారు. అటవీశాఖ ఆధ్వర్యంలో గొల్లగూడెంలోని అటవీ భూమిలో 33,320 మొక్కలు నాటే కార్యక్రమం మంత్రులు చేపట్టారు. అనంతరం అటవీ ఉత్పత్తుల స్టాల్‌, ‌ఫొటో ప్రదర్శనను తిలకించారు. ఆఈ సంద‌ర్భంగా మంతి కొండా సురేఖ మాట్లాడుతూ.. 1959లో కేంద్రమంత్రి కేఎం మున్షి వన మహోత్సవానికి (Vanamahotsavam) నాంది పలికారని అన్నారు. రాష్ట్రంలో 20 కోట్ల మొక్కలు నాటే లక్ష్యం పెట్టుకొని, ప్రతీ జిల్లాకు నిర్దేశిత లక్ష్యాన్ని ఇచ్చిన‌ట్లు తెలిపారు. రాష్ట్రంలో ఉన్న 14,...
Maruti Suzuki e Vitara EV Price, Range, Features Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates