Home » ఎలోన్ మస్క్ టెస్లా EV త్వరలో భారత్ లోకి ప్రవేశించనుందా? కేంద్రం కొత్త విధానం ఏం చెబుతోంది.?  
Tesla to enter India soon

ఎలోన్ మస్క్ టెస్లా EV త్వరలో భారత్ లోకి ప్రవేశించనుందా? కేంద్రం కొత్త విధానం ఏం చెబుతోంది.?  

Spread the love

Tesla to enter India soon | బిలియనీర్ ఎలోన్ మస్క్ (Elon Musk) నేతృత్వంలోని టెస్లా .. భారత్ లోకి ప్రవేశించేందుకు మర్గం సుగమమవుతోంది. EVలపై రాయితీ దిగుమతి సుంకాలను పొడిగించే విధానాన్ని కేంద్రం ప్రస్తుతం ఖరారు చేస్తోంది. ఈ పరిణామం ఇది టెస్లా కారు ఇండియాలో విక్రయాలకు దార్లు తెరుచుకునే అవకాశం ఉందని ది ఎకనామిక్ టైమ్స్ నివేదించింది.

30 లక్షల ($36,000) కంటే ఎక్కువ విలువైన  ఎలక్ట్రిక్ కార్లపై రాయితీ దిగుమతి సుంకాన్ని 2-3 ఏళ్లపాటు పొడిగించాలని ప్రభుత్వం యోచిస్తున్నందున టెస్లా ఇప్పుడు భారత మార్కెట్‌లోకి ప్రవేశించే దశలో ఉంది.  దీనివల్ల  భారతదేశంలోని నిరుద్యోగ యువతకు ఉపాధిని పెంచడానికి  అలాగే దేశంలో EVల ధరలను తగ్గించడంలో సహాయపడుతుంది.  అంతేకాకుండా, భారతదేశంలో EV తయారీ కర్మాగారాన్ని నిర్మించడానికి టెస్లా బ్యాంక్ గ్యారెంటీని పొందేందుకు బదులుగా దిగుమతి సుంకాలను తగ్గించవచ్చని ET నివేదిక పేర్కొంది.

READ MORE  హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ స్పెసిఫికేషన్లు ఇవే..

వైబ్రంట్ గుజరాత్ 2024 సమ్మిట్ సందర్భంగా US ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా భారతీయ EV మార్కెట్‌లోకి ప్రవేశించే విషయాన్ని ప్రకటిస్తుందని భావిస్తున్నారు.   అయితే ఎలన్ మస్క్  రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వెహికల్ ప్లాంట్ ఏర్పాటుపై  ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.  

ప్రస్తుత పాలసీ ప్రకారం, భారతదేశం $40,000 (  33 లక్షలు) కంటే ఎక్కువ విలువైన కార్లపై 100 శాతం దిగుమతి సుంకాన్ని విధించింది. ఈ మొత్తంలో విలువ చేసే కార్లపై 60 శాతం దిగుమతి సుంకం విధించబడుతుంది.

అయితే, ఎలోన్ మస్క్ కు చెందిన ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా, ఇది భారతీయ EV మార్కెట్లోకి ప్రవేశించి, మొదటి రెండు సంవత్సరాల కార్యకలాపాల కోసం వాహనాలపై దిగుమతి సుంకాన్ని 15 శాతానికి కేంద్రం తగ్గిస్తే..  దేశంలో $2 బిలియన్ల వరకు పెట్టుబడి పెడుతుందని తెలిపింది. అందువల్ల, ప్రభుత్వం ఇప్పుడు దిగుమతి చేసుకున్న కార్లపై రాయితీ దిగుమతి సుంకాలను తగ్గించాలని ఆలోచిస్తోంది, బ్యాంక్ గ్యారెంటీల ఆధారంగా పాలసీని ఖరారు చేస్తుంది. ముఖ్యంగా, కంపెనీ పేర్కొన్న పెట్టుబడులు పెట్టడానికి నిర్ణీత కాలపరిమితిని పాటించడంలో విఫలమైతే ఈ బ్యాంక్ గ్యారెంటీలను ఎన్‌క్యాష్ చేయవచ్చు. 

READ MORE  Bharat NCAP : మహీంద్రా XEV 9e వేరియంట్ కు 5-స్టార్ రేటింగ్

దేశీయ EV కంపెకీలకు బ్యాడ్ న్యూస్?

Tesla to enter India soon  : ప్రస్తుతం భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో టాటా(TATA(,  మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindar and Mahindra),  ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) వంటి కంపెనీలు ముందున్నాయి. అయితే ఒకవేళ టెస్లా తన పరిశ్రమను దేశంలో ఏర్పాటు చేసి ఎలక్ట్రిక్ కార్ల విక్రయాలు ప్రారంభిస్తే.. మన దేశీయ కంపెనీపై గట్టి దెబ్బ పడవచ్చు. టెస్లాకు  ప్రయోజనం కల్పించడంపై పలు దేశీయ కంపెనీలు   ఆందోళనలు చెందుతున్నట్లు తెలుస్తోంది.

READ MORE  Bharat Mobility Global Expo 2025 : EV అమ్మకాలు ఎనిమిది రెట్లు పెరిగే అవ‌కాశం

భారతదేశంలో తయారీని ప్రోత్సహించాలని పలు కంపెనీలు కోరుతున్నాయి.  Ola CEO భవిష్ అగర్వాల్ కూడా విదేశీ ప్లేయర్‌ల నుండి ఎలక్ట్రిక్ కార్లను దిగుమతి చేసుకునే ఆలోచనను ఆయన వ్యతిరేకిస్తున్నారు.  టెస్లా,  ఇతర అంతర్జాతీయ సంస్థలకు ప్రోత్సాహకాలు అందించడం దేశీయ సంస్థల అమ్మకాలలో భారీగా ప్రతికూల ప్రభావం పడుతుందని  చెప్పారు.


Green Mobility, Solar Energy,  Organic Farming, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి.

అలాగే ఎలక్ట్రిక్, హైడ్రోజన్, సీఎన్ జీ వాహనాలకు సంబంధించిన  అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
Hyundai Creta Electric Specifications detials ఈ ప్రాణాంతకమైన మొక్కలకు దూరంగా ఉండడండి..
Hyundai Creta Electric Specifications detials ఈ ప్రాణాంతకమైన మొక్కలకు దూరంగా ఉండడండి..