National Farmers Day 2024 : దేశానికి రైతులు చేస్తున్న అమూల్యమైన సేవలను గుర్తించేందుకు వారిని గౌరవించేందుకు ప్రతి సంవత్సరం డిసెంబర్ 23న జాతీయ రైతు దినోత్సవం, లేదా కిసాన్ దివస్ (Kisan Diwas 2024), జరుపుకుంటారు. భారతదేశ ఐదవ ప్రధానమంత్రి, రైతుల కోసం పోరాడిన ప్రముఖ నేత చౌదరి చరణ్ సింగ్ (Chaudhary Charan Singh) జ్ఞాపకార్థం ఈ రోజును జరుపుకుంటారు. జాతీయ రైతు దినోత్సవం 2024 దేశానికి వెన్నెముకగా నిలుస్తూ రక్తాన్ని చమటగా మార్చి కష్టపడి పనిచేసే రైతులకు తలవంచి ప్రణమిల్లాల్సిన రోజు.
కిసాన్ దివస్ చరిత్ర:
Kisan Diwas History : రైతు అనుకూల విధానాలను తీసుకొచ్చి రైతుల సంక్షేమం కోసం కృషి చేసినందుకు మాజీ ప్రధాని చరణ్ సింగ్ (Charan Singh) జన్మదినం సందర్భంగా జాతీయ రైతు దినోత్సవం జరుపుకుంటారు అతను జూలై 1979 నుంచి జనవరి 1980 మధ్య ప్రధానమంత్రిగా పనిచేశారు. చౌదరి చరణ్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న తక్కువ సమయంలో రైతుల కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టారు. అందుకే 2001లో చరణ్ సింగ్ జయంతిని కిసాన్ దివస్గా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ రోజు ప్రాముఖ్యత:
Significance of Kisan Diwas : రైతులు ఆర్థిక వ్యవస్థలో వారి పాత్రపై అవగాహన పెంచడానికి ఈ రోజును పాటిస్తారు. చరణ్ సింగ్ తన కాలంలో చిన్న, సన్నకారు రైతుల సమస్యలను పరిష్కరిచడానికి కృషి చేశారు. సమస్యలను ప్రస్తావించి రైతు వాణిని వినిపించేలా చూశారు. దేశంలో రైతు సమస్యలపై అవగాహన కల్పించేందుకు, చరణ్ సింగ్ డిసెంబర్ 23, 1978న కిసాన్ ట్రస్ట్ను స్థాపించారు. అంతే కాదు, 1939లో, వడ్డీ వ్యాపారుల నుంచి రైతులకు ఉపశమనం కలిగించేందుకు చరణ్ సింగ్ రుణ విముక్తి బిల్లును కూడా ప్రవేశపెట్టారు. అతను 1952లో వ్యవసాయ మంత్రిగా పనిచేశారు.. ఆయన జమీందారీ వ్యవస్థను రద్దు చేశాడు. తరువాత 1953లో, హోల్డింగ్స్ ఏకీకరణ చట్టం కూడా ఆమోదించబడింది.
రైతులకు సమాన అవకాశాలు లభించేలా, దళారుల వల్ల దోపిడీకి గురికాకుండా చూసేందుకు మాజీ ప్రధాని ఎప్పుడూ కృషి చేశారు. కుటీర పరిశ్రమలు, వ్యవసాయ రంగాల సంక్షేమానికి కూడా కృషి చేశారు. న్యూఢిల్లీలోని ఆయన స్మారకానికి కిసాన్ ఘాట్ అని పేరు పెట్టారు. రైతులను ప్రోత్సహించడానికి, దేశానికి వారు చేసిన సేవలను జరుపుకోవడానికి జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తారు.
చౌదరి చరణ్ సింగ్ గురించి..
మీరట్లోని నూర్పూర్లో 1902లో రైతు కుటుంబంలో చౌదరి చరణ్ సింగ్ జన్మించారు. 5 నెలల 17 రోజులు (జూలై 28, 1979 నుండి జనవరి 14, 1980 వరకు) దేశానికి ప్రధానమంత్రిగా పనిచేసిన ఆయన భారత 2వ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి ప్రవేశపెట్టిన ‘జై జవాన్ జై కిసాన్’ నినాదాన్ని పాటించారు. చౌదరి చరణ్ సింగ్ సాధారణ జీవితాన్ని గడిపారు. రైతులు వారి సమస్యలపై అనేక పుస్తకాలను రాశారు. అలాగే, ఆ పుస్తకాల్లో తాను పేర్కొన్న చాలా సమస్యలకు పరిష్కారాలను చూపారు. వడ్డీ వ్యాపారులు, భూస్వాముల వల్ల ఎదురయ్యే అకృత్యాల నుండి రైతులను రక్షించడానికి అతను తన శాయశక్తులా ప్రయత్నించాడు.
రైతులకు శుభాకాంక్షలు
మన దేశానికి వెన్నెముక – మన కష్టపడి పనిచేసే రైతులకు కిసాన్ దివస్ శుభాకాంక్షలు!
జాతీయ రైతు దినోత్సవం నాడు మట్టిని బంగారంగా మార్చే వారిని సన్మానిద్దాం.
మన రైతులు ఎల్లవేళలా వర్ధిల్లాలి. 2024 రైతు దినోత్సవ శుభాకాంక్షలు!
దేశాన్ని పోషించే రైతుల అవిశ్రాంత ప్రయత్నాలను జరుపుకుందాం. కిసాన్ దివస్ శుభాకాంక్షలు!
మన శ్రేయస్సు కోసం అహర్నిశలు శ్రమిస్తున్న రైతుల అంకితభావానికి వందనం. రైతు దినోత్సవ శుభాకాంక్షలు!
కోట్స్
- వ్యవసాయం మనిషికి అత్యంత ఆరోగ్యకరమైన, అత్యంత ఉపయోగకరమైన, అత్యంత ఉదాత్తమైన ఉపాధి. – జార్జ్ వాషింగ్టన్
- వ్యవసాయం కేవలం ఉద్యోగం కాదు; అది ఒక జీవన విధానం.
- మట్టిని జీవనాధారంగా మార్చే నిజమైన మాంత్రికులు రైతులే.
- రైతులను గౌరవించకుండా ఏ దేశం కూడా అభివృద్ధి చెందదు.
- ప్రతిరోజూ మన టేబుల్స్పై ఆహారాన్ని ఉంచే హీరోలకు కృతజ్ఞతలు తెలుపుదాం. కిసాన్ దివస్ శుభాకాంక్షలు!
- ఈ రోజు, మన దేశాన్ని పోషించే రైతుల స్ఫూర్తిని మేము గౌరవిద్దాం..
- రైతులు లేకుంటే తిండి ఉండదు, భవిష్యత్తు ఉండదు. జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా కృతజ్ఞతలు!
- ఈ రైతు దినోత్సవం, మంచి రేపటి కోసం మన రైతులకు మద్దతుగా, సాధికారత కల్పించడానికి కట్టుబడి ఉందాం.
- ప్రతి తిండి గింజ రైతు చెమట, శ్రమను చాటి చెబుతుంది. కిసాన్ దివస్ శుభాకాంక్షలు!
హరితమిత్ర వెబ్ సైట్ పర్యావరణం, సేంద్రియ వ్యవసాయం, గ్రీన్ మొబిలిటీ, సోలార్ ఎనర్జీ (Solar Energy) కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. సరికొత్త వార్తలను కోసం మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ట్విట్టర్(X) , వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..