Telangana
TGSRTC Electric Buses | ప్రయాణికులకు గుడ్ న్యూస్.. త్వరలో రోడ్లపైకి వెయ్యి కొత్త బస్సులు.. ఈ రూట్లలోనే.. ..
TGSRTC Electric Buses | హైదరాబాద్ : ప్రయాణికులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ లో కాలుష్య ఉద్గారాలను తగ్గించేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) 1,000 ఎలక్ట్రిక్ బస్సులను ఆర్డర్ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా ప్రారంభించిన 13 ఛార్జింగ్ స్టేషన్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. దశలవారీగా డెలివరీ చేయబోయే ఈ ఎలక్ట్రిక్ బస్సులు గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ (జిసిసి) మోడల్లో పనిచేస్తాయి. ఈ పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్య మోడల్లో ఎలక్ట్రిక్ వాహన […]
Vanamahotsavam 2024 | తెలంగాణలో వన మహోత్సవం కింద 33,320 మొక్కల పెంపకం..
తెలంగాణలో ఈ సంవత్సరం వన మహోత్సవం (Vanamahotsavam) కింద సుమారు 33,320 మొక్కలు నాటాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం నిర్ధేశించుకుంది. రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖల మంత్రి కొండా సురేఖ నిన్న ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం గొల్లగూడెంలో వన మహోత్సవంలో భాగంగా రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి మొక్కలు నాటారు. అటవీశాఖ ఆధ్వర్యంలో గొల్లగూడెంలోని అటవీ భూమిలో 33,320 మొక్కలు నాటే కార్యక్రమం మంత్రులు చేపట్టారు. […]
Electric Metro Express : హైదరాబాద్ రోడ్లపై కొత్తగా ఎలక్ట్రిక్ బస్సుల పరుగులు..
New Electric Metro Express Buses Launching : హైదరాబాద్ వాసులుకు శుభవార్త. రణగొన ధ్వనులు, ఊపిరి సలపని పొగకు కారణమయ్యే డీజిల్ బస్సుల స్థానంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. TSRTC కొత్తగా 25 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టింది. హైదరాబాద్ నెక్లెస్రోడ్డులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka), రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ (Ponnam Prabhakar), రోడ్లు భవనాల శాఖ […]
RenewSys : తెలంగాణలో రూ.6000 కోట్లతో భారీ సోలార్ ప్యానెల్స్ తయారీ ప్లాంట్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో సోలార్ ప్యానెల్ తయారీ పరిశ్రమకు మహర్దశ వచ్చింది. సోలార్ మల్టిపుల్ ఫొటోవోల్టాయిక్ మాడ్యూల్స్, పివి సెల్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ల ఏర్పాటు రెన్యూసిస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (RenewSys India ) సంస్థ ముందుకు వచ్చింది. ఈమేరకు సోమవారం పరిశ్రమల శాఖతో తెలంగాణ ప్రభుత్వం ఎంఓయూ కుదుర్చుకుంది. రాష్ట్రంలో ఈ కంపెనీ రూ.6,000 కోట్ల మేర పెట్టుబడి పెడుతుందని అంచనా. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం ఫ్యాబ్సిటీలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు సమక్షంలో ఎంఓయూపై […]
తెలంగాణలో One Moto EV ఫ్యాక్టరీ
బ్రిటీష్ ప్రీమియం ఎలక్ట్రిక్ వెహికల్ బ్రాండ్ One Moto EV (వన్ మోటో ఇండియా) .. తెలంగాణలోని జహీరాబాద్లో తన తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ ఫ్యాక్టరీ నెలకు 25,000 యూనిట్ల తయారీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని, వచ్చే మూడేళ్లలో లక్ష యూనిట్లకు చేరుకోవచ్చని కంపెనీ ఉన్నతాధికారులు వెల్లడించారు. One Moto EV కంపెనీ ప్రస్తుతం మూడు రకాల ఎలక్ట్రిక్ స్కూటర్లను అందిస్తోంది 1.కమ్యుటా : గరిష్ట వేగం గంటకు 75 kmph, […]