Harithamithra Telugu News

Home EV Updates Electric vehicles Tata-Tigor.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 306 కి.మీ.

Tata-Tigor.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 306 కి.మీ.

0
Budget 2026 Auto Sector Expectations
  •  ధరలు రూ .12 లక్షల నుంచి ప్రారంభం

Tata Tigor ev

ఎలక్ట్రిక్ వాహ‌న‌రంగ‌లో మ‌రో ఈవీ చేరింది. ప్ర‌ఖ్య‌త ఆటోమొబైల్ దిగ్గ‌జం టాటా.. స‌రికొత్త‌గా Tata Tigor EV  ని లాంఛ్ చేసింది.  దీని ధ‌ర‌లు ఇండియాలో రూ.11.99 లక్షల నుంచి ప్రారంభ‌మ‌వుతాయి.  టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ కారు తర్వాత జిప్ట్రాన్ ప్లాట్‌ఫారమ్ ఆధారంగా టాటా నుండి వచ్చిన రెండో మోడల్ ఈ టిగోర్ కారు.

కొత్త టిగోర్ EV రెండు రంగుల్లో ల‌భ్య‌మ‌వుతుంది.  ఇది ప్ర‌స్తుతం మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది.  అవి టాటా XE, XM మరియు XZ+.
XZ+ వెర్షన్ డ్యూయల్ టోన్ ఆప్షన్‌లో కూడా అందుబాటులో ఉంది.

26కిలోవాట్ల బ్యాట‌రీ..

టాటా టిగోర్ EV లో 26 kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది.  టాటా మోటార్స్ ఫాస్ట్ ఛార్జర్‌ని ఉపయోగించి 60 నిమిషాల్లోపు బ్యాటరీని 0-80% నుంచి ఛార్జ్ చేయవచ్చని టాటా కంపెనీ పేర్కొంది.  అయితే, సాధార‌ణ హోమ్ ఛార్జర్ ద్వారా ఫుల్ చేయ‌డానికి సుమారు 8.5 గంటలు పడుతుంది.

టాటా మోటార్స్ బ్యాటరీ ప్యాక్ మీద 8 సంవత్సరాల వ్యారంటీ లేదా 1.6 లక్షల కిలోమీటర్ల వారంటీని అందిస్తోంది. లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ కూడా IP67 సర్టిఫికెట్ పొందింది.  ఒక్కసారి ఛార్జ్ చేస్తే 306 కిమీ వరకు ప్ర‌యాణించవ‌చ్చు.  టిగోర్ ఈవీ ఏఆర్ఏఐ సర్టిఫికేట్ పొందిందని టాటా మోటార్స్ పేర్కొంది.

tata-tigor-ev-interior
tata-tigor-ev-interior

టాటా టిగోర్ ఎలక్ట్రిక్ కారు 74 bhp మరియు 170 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది.  టిగోర్ EV 5.7 సెకన్లలో 0-60 కిమీ/గం వేగాన్ని అందుకుంటుంది
టిగోర్ EV 30+ క‌నెక్టింగ్ ఫీచ‌ర్లు ఉంటాయి.  ఇది ఇంటర్నెట్ ద్వారా స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్ ద్వారా వాహనం యొక్క వివిధ క‌మాండ్‌ను యాక్సెస్ చేయడానికి అనుమతిస్తుంది. గ్లోబల్ NCAP టిగోర్ EV కి ఆక్రమణదారుల నుంచి రక్షణ కోసం 4-స్టార్ భద్రతా రేటింగ్‌ని అందించింది.

Tata Tigor EV వేరియంట్ వారీగా ధరలు

  • టాటా టిగోర్ EV XE – రూ.11.99 లక్షలు,  టాటా టిగోర్ EV XM – రూ.12.49 లక్షలు,  
  • టాటా టిగోర్ EV XZ+ – రూ.12.99 లక్షలు,  టాటా టిగోర్ EV XZ+ DT – రూ.13.14 లక్షలు
Previous articleeBikeGo హైస్పీడ్ స్కూట‌ర్ వ‌చ్చేసింది..
Next articleఅందుబాటు ధ‌ర‌లో Montra Electric Cycle
Kiran Podishetty
కిరణ్ పొడిశెట్టి, హరితమిత్ర మీడియా వ్యవస్థాపకులు, పర్యావరణ పరిరక్షణకు అంకితభావంతో పనిచేస్తున్న సీనియ‌ర్‌ జర్నలిస్ట్. ఎమ్మెస్సీ, ఎంజీజే పూర్తిచేసిన‌ ఆయనకు ప్రింట్ మీడియా రంగంలో 17 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికల్లో సబ్‌ ఎడిటర్‌గా ప‌నిచేశారు. హరితమిత్ర ద్వారా ఆయన సేంద్రియ వ్యవసాయం, సోలార్ ఎనర్జీ, గ్రీన్ మొబిలిటీ (ఎలక్ట్రిక్‌, సిఎన్‌జి వాహనాలు) ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ వంటి అంశాలపై నిరంతరం విశ్లేషణాత్మక కథనాలు, తాజా అప్‌డేట్స్‌ను అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here