Sunday, August 24Lend a hand to save the Planet
Shadow

Tag: solar energy

Budget 2025 : గ్రీన్ ఎనర్జీకి కేంద్రం భారీగా కేటాయింపులు

Budget 2025 : గ్రీన్ ఎనర్జీకి కేంద్రం భారీగా కేటాయింపులు

Solar Energy
Budget 2025 : పునరుత్పాదక ఇంధన పరివర్తనపై కేంద్రం తన నిబద్ధతను చాటుకుంది. కేంద్ర బడ్జెట్ 2025-26 ఫిబ్రవరి 1న పునరుత్పాదన ఇంధన మంత్రిత్వ శాఖ (renewable energy) కు రూ. 26,549.38 కోట్లు కేటాయించింది. ఇది ఏడాది క్రితం రూ. 17,298.44 కోట్ల సవరించిన అంచనాలతో పోలిస్తే 53.48% పెరిగింది. FY21 నుండి కేటాయింపులు 904% పెరిగాయి.ఈ మొత్తంలో రూ.24,224.36 కోట్లను సౌరశక్తి (Solar Energy)కి ప్రభుత్వం కేటాయించింది. ఇందులో సోలార్ పవర్ (Grid) కోసం రూ. 1,500 కోట్లు, కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉత్థాన్ మహాభియాన్ (Kusum) కోసం రూ. 2,600 కోట్లు, ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన ( PM Surya Ghar Muft Bijli Yojana) కోసం రూ. 20,000 కోట్లు ఉన్నాయి.ప్రభుత్వం ప్రారంభించిన ప్రధాన మంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన ప్రతి నెలా 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందించడం ద్వారా కోటి గృహాలకు సౌరశక్తిని అందించాలని ...
Solar Cell | రూ.7000 కోట్లతో తెలంగాణలో సోలార్ సెల్స్ తయారీ యూనిట్

Solar Cell | రూ.7000 కోట్లతో తెలంగాణలో సోలార్ సెల్స్ తయారీ యూనిట్

Solar Energy
Solar cell Manufacturing Unit : తెలంగాణలో పునరుత్పాదక శక్తిని పెంపొందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా అత్యాధునిక సోలార్ సెల్స్, మాడ్యూల్స్ తయారీ యూనిట్ స్థాపించేందుకు మైత్రా ఎనర్జీ గ్రూప్ కంపెనీ అక్షత్ గ్రీన్ టెక్ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కంపెనీ హైదరాబాద్‌లో 6.9 గిగావాట్ల సోలార్ సెల్స్, 6.9 గిగావాట్ల సోలార్ మాడ్యూల్స్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టుపై రూ.7,000 కోట్లు పెట్టుబడులు పెట్టనుంది.2500 మందికి ఉపాధితెలంగాణలో ఏర్పాటు చేయనున్న ఈ ప్లాంట్ (Solar cell Manufacturing Plant) ద్వారా దాదాపు 2,500 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. స్థానికంగా మరింత మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్లో సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ రైజింగ్ ప్రతినిధుల సమక్షంలో అక్షత్ గ్రీన్‌టెక్ తో (మైత్రా గ్రూప్) అవగాహన ఒప్పందం కుదుర్...
Renewable Energy in 2024 : రికార్డు స్థాయిలో పునరుత్పాదక శక్తి

Renewable Energy in 2024 : రికార్డు స్థాయిలో పునరుత్పాదక శక్తి

Solar Energy
Renewable Energy in 2024 : మినిస్ట్రీ ఆఫ్ న్యూ & రెన్యూవబుల్ ఎనర్జీ (MNRE) డేటా ప్రకారం, భారతదేశం 2024లో రికార్డు స్థాయిలో 30 GW పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించింది. 2023లో 13.75 GW పున‌రుత్పాద‌క విద్యుత్ ను పెంచుకోగా 2024లో 113% పెరిగింది. ఈ గ‌ణంకాల‌ను బ‌ట్టి క్లీన్ ఎనర్జీ వైపు దేశం వేగవంతంగా ప‌య‌నిస్తున్న‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది. 2030 నాటికి భారతదేశం 500 GW పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించాల‌ని లక్ష్యంగా పెట్టుకుంది. పున‌రుత్పాద‌క శ‌క్తి ని ప్రోత్స‌హిస్తూ కార్బన్ పాదముద్రను తగ్గించడం, స్థిరమైన భవిష్యత్తును నిర్మించడంలో భారతదేశం వేగంగా అడుగులు వేస్తోంది.2024లో రెన్యూవబుల్ కెపాసిటీభారతదేశం 2024లో రికార్డు స్థాయిలో సుమారు 30 GW పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని జోడించింది, 2023లో సాధించిన 13.75 GW సామర్థ్యంతో పోలిస్తే ఇది 113 శాంతం ఎక్కువ‌.కాగా భారతదేశంలో మొత్తం పునరుత్పా...
Green energy | గ్రీన్ హైడ్రోజన్ హబ్ గా తెలంగాణ

Green energy | గ్రీన్ హైడ్రోజన్ హబ్ గా తెలంగాణ

General News
Green energy | తెలంగాణ రాష్ట్రాన్ని భవిష్యత్ ఇంధన వనరు అయిన గ్రీన్ హైడ్రోజన్ హబ్ గా తీర్చిదిద్దుతామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. హైదరాబాద్‌-ఆస్ట్రేలియా ఇండియా క్రిటికల్‌ మినరల్స్‌ రీసెర్చ్‌ హబ్‌పై జనవరి 3వ తేదీ శుక్రవారం ఐఐటీ హైదరాబాద్‌లో జరిగిన వర్క్‌షాప్‌లో ఆయన ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.తెలంగాణ ప్రభుత్వం 2030 నాటికి 20,000 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించిందని తెలిపారు. మోనాష్ యూనివర్శిటీ సహకారంతో ఆస్ట్రేలియా-ఇండియా క్రిటికల్ మినరల్స్ రీసెర్చ్ హబ్ కింద చేపట్టిన కార్యక్రమాలు తెలంగాణకే కాకుండా భారతదేశానికి, ప్రపంచ సమాజానికి కూడా కీలకమని విక్రమార్క పేర్కొన్నారు. రాష్ట్రానికి క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీని రూపొందించడానికి అవసరమైన సహకార స్ఫూర్తిని ఈ వర్క్‌షాప్ ప్రతిబింబిస్తుందని ఆయన అన్నారు.IIT హైదరాబాద్ డ్రైవింగ్ ఆవిష...
90 MW ఓంకారేశ్వర్ ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్ విజయవంతంగా ప్రారంభించబడింది

90 MW ఓంకారేశ్వర్ ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్ విజయవంతంగా ప్రారంభించబడింది

Solar Energy
Omkareshwar Floating Solar Project  | మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి(Atal Bihari Vajpayee) 100వ జయంతి సందర్భంగా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మధ్యప్రదేశ్‌లోని ఖజురహోలో బహుళ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈసంద‌ర్భంగా ప్ర‌ధాని మోదీ (PM Modi) మాట్లాడుతూ.. గత ఏడాది కాలంలో వేల కోట్ల రూపాయలతో కొత్త మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభించ‌డంతోఅభివృద్ధి పనులు వేగవంతమయ్యాయని ఆయన తెలిపారు. చారిత్రాత్మకమైన కెన్-బెత్వా నదుల అనుసంధాన ప్రాజెక్ట్, దౌధాన్ డ్యామ్, ఓంకారేశ్వర్ ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్ కు శంకుస్థాపన జరిగిందని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆయన మధ్యప్రదేశ్ ప్రజలకు అభినందనలు తెలిపారు.జాతీయ దృక్పథ ప్రణాళిక కింద దేశంలో మొట్టమొదటి నదుల అనుసంధానం ప్రాజెక్టు అయిన కెన్-బెత్వా నదిని అనుసంధానించే జాతీయ ప్రాజెక్టుకు ప్రధాన మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్ట్ మధ్యప...
Solar Energy | రికార్డు స్థాయికి భారతదేశ సౌర ఉత్పత్తి ఎగుమతులు.. రెండేళ్లలో 20 రెట్లు జంప్

Solar Energy | రికార్డు స్థాయికి భారతదేశ సౌర ఉత్పత్తి ఎగుమతులు.. రెండేళ్లలో 20 రెట్లు జంప్

Solar Energy
Solar Energy | సోలార్ ఉత్ప‌త్తుల్లో భార‌త్ ఎదురులేకుండా దూసుకుపోతోంది. ఒక తాజా నివేదిక ప్రకారం.. భారతదేశ సోలార్ ఫోటోవోల్టాయిక్ (Solar Photovoltaic (PV) ఉత్పత్తుల ఎగుమతులు FY22 నుంచి 2024 ఆర్థిక సంవత్సరం (FY)లో 23 రెట్లు పెరిగి $2 బిలియన్లకు చేరుకున్నాయని తేలింది.ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎనర్జీ ఎకనామిక్స్ అండ్ ఫైనాన్షియల్ అనాలిసిస్ (IEEFA), JMK రీసెర్చ్ అనలిటిక్స్ నివేదిక ప్రకారం, నికర దిగుమతిదారు నుంచి సౌర ఉత్పత్తుల నికర ఎగుమతిదారుగా భారతదేశం మారింది. తాజాగా ఇతర దేశాలు ఇప్పుడు తమ "చైనా ప్లస్ వన్" వ్యూహానికి భారతదేశాన్ని అత్యుత్త‌మ‌ ఎంపికగా భావిస్తున్నారు. దేశీయ PV తయారీదారులు తమ ఉత్పత్తులను విదేశాలలో అధిక ప్రీమియంతో విక్రయించాలని చూస్తున్నారు.మార్కెట్ల పరంగా, భారతీయ సోలార్ సోలార్ ఫోటోవోల్టాయిక్ (PV ఎగుమతులకు యుఎస్ కీలక మార్కెట్‌గా అవతరించింది. FY2023 మరియు FY2024 రెండింటిలోనూ భారతీయ సోలా...
ఏపీలో ఐదు మోడల్ సోలార్ గ్రామాలు..కార్యాచరణ సిద్ధం..

ఏపీలో ఐదు మోడల్ సోలార్ గ్రామాలు..కార్యాచరణ సిద్ధం..

Solar Energy
Vishakhapatnam : ఆంధ్రప్రదేశ్ లో ఎంపిక చేసిన ఐదు గ్రామాలను పూర్తిగా సౌరశక్తితో నడిచే మోడల్ గ్రామాలు (Solar Powered Model Villages)గా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ ప్రకటించారు. కొత్తగా నిర్మించిన గ్రామ సచివాలయ భవనాల్లో సోలార్ యూనిట్లను ఏర్పాటు చేయాలని అధికారులను ఆమె ఆదేశించారు. సోలార్ ఇన్‌స్టాలేషన్‌లకు అర్హులైన కుటుంబాలను గుర్తించాలని సూచించారు. అదనంగా, ఆమె గృహ సముదాయాలు, ఆసుపత్రులు, వాణిజ్య ప్రాంతాలలో సోలార్ ప్యానెల్స్ సెటప్‌లను ఏర్పాటు చేాయలని సూచించారు. సోలార్ కంపెనీల నుంచి వారంటీలతో కూడిన అధిక-నాణ్యత గల ఉత్పత్తులను మాత్రమే తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం జరిగిన జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో ఆమె సోలార్ పవర్ యూనిట్లకు సబ్సిడీలు అందించే ప్రధాన మంత్రి సూర్య ఘర్ పథకం (మఫ్ట్ బిజిలీ యోజన) Pradhan Mantri Surya...
Renewable Energy | పునరుత్పాదక ఇంధన రంగంలో రూ. 32.5 లక్షల కోట్ల నిధులు

Renewable Energy | పునరుత్పాదక ఇంధన రంగంలో రూ. 32.5 లక్షల కోట్ల నిధులు

Solar Energy
Renewable Energy : గుజరాత్‌ రాజధాని గాంధీనగర్ లో జరిగిన పునరుత్పాదక ఇంధన సదస్సు (RE Invest 2024 ) లో పలు రాష్ట్రాలు భాగస్వాముల‌య్యాయ‌ని కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషీ (Pralhad Joshi) తెలిపారు. 2030 నాటికి రెన్యూవ‌బుల్ ఎన‌ర్జీ రంగంలో రూ. 32.5 లక్షల కోట్ల నిధులు సమకూర్చేందుకు బ్యాంకులు, ఆర్ధిక సంస్ధలు ముందుకొచ్చాయని పేర్కొన్నారు. సంప్ర‌దాయ‌ విద్యుత్‌ రంగాన్ని పునరుత్పాదక ఇంధన రంగంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్ర‌ణాళికా బ‌ద్దంగా ప‌నిచేస్తోంద‌ని తెలిపారు. ఈ సదస్సులో నాలుగు దేశాలు హాజరయ్యాయని వెల్ల‌డించారు. మంత్రి ప్రహ్లాద్‌ జోషీ మంగళవారం గాంధీనగర్‌లో మీడియా స‌మావేశంలో మాట్లాడారు.పునరుత్పాదక ఇంధన రంగం (Renewable Energy) లో భారత్‌ ప్రపంచానికి రోల్‌మాడ‌ల్‌గా నిల‌వ‌నుంద‌ని మంత్రి ప్రహ్లాద్‌ జోషీ ధీమా వ్య‌క్తం చేశారు. ప్ర‌స్తుతం సుమారు 208 గిగావాట్‌ పునరుత్పాదక ఇంధనాన్ని మ‌న‌దేశం ఉత్పత్తి చేస...
పీఎం సోలార్ రూఫ్‌టాప్ స్కీమ్ కోసం 1.3 కోట్ల కుటుంబాల ద‌ర‌ఖాస్తు..

పీఎం సోలార్ రూఫ్‌టాప్ స్కీమ్ కోసం 1.3 కోట్ల కుటుంబాల ద‌ర‌ఖాస్తు..

Solar Energy
PM Rooftop Solar Scheme | ప్ర‌ధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్ర‌భుత్వం పీఎం సోలార్ రూఫ్‌టాప్ స్కీమ్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు 1.3 కోట్లకు పైగా కుటుంబాలు ఈ పథకం కోసం నమోదు చేసుకున్నాయి. గుజరాత్‌లోని గాంధీనగర్ జిల్లాలో సోమ‌వారం జరిగిన 4వ గ్లోబల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ (రీ-ఇన్వెస్ట్) 2024 ప్రారంభోత్సవ కార్యక్రమంలో మోదీ (PM Modi) కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. సోలార్ రూఫ్‌టాప్ పథకం ప్రారంభించినప్పటి నుంచి.. సుమారు 3.75 లక్షల ఇళ్లలో ఇన్‌స్టాలేషన్ పూర్తయింద‌ని, వారు ప్ర‌స్తుతం ఉచితంగా సోలార్ విద్యుత్ ను వినియోగించుకుంటున్నార‌ని, పేద‌ల ప్ర‌జ‌ల‌పై క‌రెంటు బిల్లుల భారం త‌గ్గిపోయింద‌ని ప్ర‌ధాని మోదీ తెలిపారు.PM Rooftop Solar Scheme ద్వారా త‌మ ఇంటిపై సోలార్‌ప్యానెల్స్ ను ఇన్ స్టాల్ చేసుకున్న‌ వినియోగదారులు తమకు అవ‌స‌ర‌మైన‌ విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకోవడమే కాకుండా.. అదనపు విద్యుత్‌...
Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు