Telangana

Telangana EV Policy | ఎలక్ట్రిక్ వాహనాలపై భారీ రాయితీలు

Spread the love

హైదరాబాద్ : పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టేందుకు తెలంగాణ రాష్ట్ర‌ ప్రభుత్వం (Telangana Govt) ఎలక్ట్రిక్ వాహనాల (EV) వినియోగాన్ని ఎంత‌గానో ప్రోత్సహిస్తోంది. మంగళవారం శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ‘ఈవీ పాలసీ’ (Telangana EV Policy)అమలు తీరును, ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను వివరించారు.

ఈవీ పాలసీ – ప్రధాన ముఖ్యాంశాలు:

ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే రాష్ట్రంలో సుమారు లక్ష ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడయ్యాయని మంత్రి వెల్లడించారు. ఈవీల వినియోగాన్ని పెంచడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఇవే:

ఉద్యోగులకు ప్రత్యేక రాయితీ: ప్రభుత్వ ఉద్యోగులు ఈవీలు కొనుగోలు చేస్తే 20 శాతం ధర తగ్గింపు ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. ఇందుకోసం తయారీ కంపెనీలతో చర్చలు జరుపుతున్నామన్నారు.

పన్ను మినహాయింపు : ఈవీ రాయితీల అమలు వల్ల ప్రభుత్వానికి సుమారు రూ.900 కోట్ల పన్ను ఆదాయం తగ్గుతున్నప్పటికీ, పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా దీనిని కొనసాగిస్తున్నట్లు చెప్పారు.

ఛార్జింగ్ స్టేషన్ల పెంపు : రాష్ట్రవ్యాప్తంగా ఛార్జింగ్ స్టేషన్ల సంఖ్యను పెంచడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. ముఖ్యంగా పార్కింగ్ స్థలాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు.

స్క్రాప్ పాలసీ: 15 ఏళ్లు దాటిన పాత వాహనాలను తొలగించి, కొత్త ఈవీలను కొనుగోలు చేసేలా ప్రోత్సాహకాలు అందించడానికి ప్రత్యేక జీవో (GO) విడుదల చేశారు.

ఆర్టీసీలోకి కొత్తగా ఎలక్ట్రిక్ బస్సులు

పీఎం-ఈ డ్రైవ్ (PM-eDrive) పథకం కింద ఇప్పటికే 575 ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయని, త్వరలోనే మరో 200 కొత్త బస్సులు అందుబాటులోకి వస్తాయని మంత్రి తెలిపారు.


More From Author

Urea

Urea Supply | రాష్ట్రంలో యూరియా నిల్వలు సమృద్ధి.. గత 8 ఏళ్లలో ఇదే రికార్డ్: మంత్రి తుమ్మల

Toyota Urban Cruiser EV

టయోటా నుండి ఫస్ట్ ఎలక్ట్రిక్ SUV : ‘అర్బన్ క్రూయిజర్ EV’ వచ్చేస్తోంది.. అదిరిపోయే ఫీచర్లు, రేంజ్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *