
కరెంటు బిల్లు కట్టే రోజులు పోయాయి..
ఇక విద్యుత్ సంస్థలే మీకు పైసలు ఇస్తాయి: డిప్యూటీ సీఎం భట్టిరావినూతలలో 'సోలార్ మోడల్ విలేజ్' పథకాన్ని ప్రారంభించిన భట్టి విక్రమార్క.రాష్ట్రవ్యాప్తంగా 81 గ్రామాల్లో రూ. 1,380 కోట్లతో పైలట్ ప్రాజెక్ట్.ప్రతి ఇంటికి ఏటా రూ. 14,000 ఆదా.. మిగులు విద్యుత్ విక్రయంతో అదనపు ఆదాయం.వ్యవసాయ పంపుసెట్లపై కూడా సోలార్ ప్యానెల్స్.ఖమ్మం : ప్రతి ఇల్లు, ప్రతి వ్యవసాయ పంపుసెట్ సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా మారాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సోలార్ మోడల్ విలేజ్ (Solar Model Village) కార్యక్రమం దేశంలోనే కాదు ప్రపంచంలోనే విప్లవాత్మకమైనదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు (Bhatti Vikramarka Mallu) అన్నారు. సోమవారం ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం రావినూతల గ్రామంలో ఈ కార్యక్రమాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో డిప్యూటీ సీఎం మాట్లాడుతూ, ఈ పథ...









