Thursday, July 31Lend a hand to save the Planet
Shadow

Agriculture

Agricultural News, Farmers,

Telangana Cabinet Decisions : రైతులకు తీపికబురు .. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం

Telangana Cabinet Decisions : రైతులకు తీపికబురు .. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం

Agriculture
Hyderabad : సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం శనివారం జరిగింది. ఈ కేబినెట్ మీటింగ్ లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సన్న వడ్లకు రూ.500 బోనస్‌ అందించాలని కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే ములుగు జిల్లాలో సెంట్రల్ యూనివర్సిటీకి భూకేటాయింపుపైనా నిర్ణయం తీసుకుంది. ఎకరానికి రూ.250 చొప్పున భూమి కేటాయింపులు చేయాలని నిర్ణయించింది. అలాగే ఖరీఫ్ ధాన్యం కొనుగోలుకు కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.రుణమాఫీ, రైతుభరోసాపై చర్చ ఇదిలాఉండగా.. ఈ మంత్రి వర్గ సమావేశంలో కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపైనా చర్చించినట్లు సమాచారం. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు ఎన్ని అమలయ్యాయి.. ఇంకా ఎలాంటి హామీలు నెరవార్చాలి అనేదానిపై చర్చించారు. అలాగే పలు హామీలు నెరవేర్చేందుకు ఏర్పాటుచేసిన కేబినెట్‌ సబ్‌ కమిటీలు సమర్పించిన నివేదిక...
ఇకపై పత్తి రైతులకు వాట్సప్ సేవలు

ఇకపై పత్తి రైతులకు వాట్సప్ సేవలు

Agriculture
Cotton Farmers | హైదరాబాద్ : పత్తి రైతుల సౌకర్యార్థం తెలంగాణ ప్రభుత్వం వాట్సప్ సేవలను ప్రారంభించింది. వాట్సప్ నంబర్ 8897281111 ద్వారా పత్తి అమ్మకం, కొనుగోళ్లకు సంబంధించిన వివరాలను అందించేందుకు వ్యవసాయ మార్కెటింగ్ శాఖ సన్నద్ధమైంది. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాల మేరకు పత్తి పంట క్రయవిక్రయాల్లో జాప్యాన్ని నివారించేందుకు ప్రభుత్వం ఈ సేవలను ప్రారంభించింది. పత్తి కొనుగోళ్లు, అమ్మకం, అర్హత, తదితర వివరాలు, చెల్లింపు స్థితి, సీసీఐ సెంటర్లలో వేచి ఉండే సమయం వంటి ముఖ్యమైన వివరాలను రైతులు తమ ఇంటి వద్దనే ఉండి ఈ వాట్సప్ నంబరు ద్వారా తెలుసుకోవచ్చని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రైతులందరూ మార్కెటింగ్ శాఖ తీసుకొచ్చిన ఈ వాట్సప్ యాప్ ను ఉపయోగించి ఎలాంటి ఇబ్బందులు పడకుండా పత్తిని విక్రయించుకోవాలని రైతులను కోరారు. అలాగే, రైతులకు ఎటువంటి ఫిర్యాదు ఉన్నా వాట్సప్ ద్వారా సమాచారమిస్తే.. మార్కె...
Agri News | తెలంగాణలో సొంతంగా సీడ్‌ గార్డెన్‌ ఏర్పాటు

Agri News | తెలంగాణలో సొంతంగా సీడ్‌ గార్డెన్‌ ఏర్పాటు

Agriculture
హైదరాబాద్‌: భవిష్యత్ లో తెలంగాణలో సొంతంగా సీడ్ గార్డెన్ ఏర్పాటు చేసేందుకు అవకాశాలను పరిశీలిస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageshwar Rao) తెలిపారు. మలేసియా పర్యటనలో ఉన్న మంత్రి.. గురువారం రెండో రోజు పలు సంస్థలను సందర్శించారు. ప్రపంచంలోనూ అతి పెద్ద వ్యాపార ఆధారిత క్రూడ్‌ ‌ఫామాయిల్‌ ఉత్పత్తిదారుల్లో ఒకటైన ఎఫ్‌జీవీ కంపెనీకి చెందిన సీడ్‌ ‌గార్డెన్ ను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సందర్శించారు. నర్సరీలను, అధునాతన సాంకేతిక పద్ధతులతో ఉన్న విత్తన కేంద్రాన్ని పరిశీలించిన అనంతరం ఆ కంపెనీ ప్రతినిధులతో భేటీ అయ్యారు. తెలంగాణలో సీడ్‌ ‌గార్డెన్ ఏర్పాటుకు ఎఫ్‌జీవీ కంపెనీ సహకరించాలని మంత్రి తుమ్మల కోరారు. అందుకు కంపెనీ ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. తెలంగాణ రాష్ట్ర భాగస్వామ్యంతో పని చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అనంతరం ఎఫ్‌జీవీ కంపెనీ కర్మాగారాన్ని సందర్శించి అక్కడ తయారు చేసే వి...
MSP Hike | రైతులకు మోదీ ప్రభుత్వం తీపి కబురు

MSP Hike | రైతులకు మోదీ ప్రభుత్వం తీపి కబురు

Agriculture
MSP Hike : దీపావళి పండుగ సందర్భంగా మోదీ ప్రభుత్వం రైతులకు తీపి కబురు చెప్పింది. రబీ పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) పెంపునకు బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. కేంద్ర మంత్రివర్గ సమావేశం అనంతరం కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు. రైతుల ఆదాయాన్ని మెరుగుపరిచేందుకు. రబీ పంటలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుందని వివరించారు.ఆవాలు క్వింటాల్‌కు రూ.300, గోధుమలు రూ.150, బార్లీ రూ.130, మినుము రూ.130, మినుము క్వింటాల్‌కు రూ.210 చొప్పున ఎంఎస్‌పి (MSP Hike) పెంచాలని మోదీ మంత్రివర్గం నిర్ణయించింది. గతంలో మినుము, కందుల ధర క్వింటాల్‌కు రూ.5440 ఉండగా, ప్రస్తుతం క్వింటాల్‌కు రూ.5,650కి పెరిగింది. 2014-15తో పోలిస్తే, ప్రభుత్వం పంటల ఎంఎస్‌పిని దాదాపు రెట్టింపు చేసింది.గోధుమలు- రూ.2275 నుంచి రూ.2425కి పెరిగిందిబార్లీ- రూ.1850...
PM Kisan Scheme | రైతులకు గుడ్ న్యూస్ పీఎం కిసాన్ 18 విడత డబ్బులు రూ.2000 వచ్చేశాయ్..

PM Kisan Scheme | రైతులకు గుడ్ న్యూస్ పీఎం కిసాన్ 18 విడత డబ్బులు రూ.2000 వచ్చేశాయ్..

Agriculture
18వ విడత కింద 9.4 కోట్ల మంది రైతులకు రూ.20,000 కోట్లు పంపిణీ PM Kisan Scheme  | ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకం 18వ విడతను అక్టోబర్ 5, 2024న మహారాష్ట్రలోని వాషిమ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేశారు. దీంతో దేశవ్యాప్తంగా 9.4 కోట్ల మంది రైతులకు ప్రత్యక్ష ఆర్థికసాయం అందింది. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (డిబిటి) ద్వారా 20,000 కోట్లు జమ అయ్యాయి.దేశవ్యాప్తంగా 732 కృషి విజ్ఞాన కేంద్రాలు (కెవికెలు), 1 లక్షకు పైగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, 5 లక్షల కామన్ సర్వీస్ సెంటర్‌లతో సహా దాదాపు 2.5 కోట్ల మంది రైతులు ఈ కార్యక్రమంలో చేరారు. విడుదల రోజును PM-కిసాన్ ఉత్సవ్ దివస్‌గా జరుపుకుంటూ వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో కూడా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.24 ఫిబ్రవరి 2019న ప్రారంభించబడిన PM-KISAN పథకం భూమి కలిగి ఉన్న రైతులకు మూడు సమా...
Oil Palm Factory | రాష్ట్రంలో రూ.300 కోట్లతో జిల్లాలో పామ్‌ ఆయిల్‌ ‌ఫ్యాక్టరీ

Oil Palm Factory | రాష్ట్రంలో రూ.300 కోట్లతో జిల్లాలో పామ్‌ ఆయిల్‌ ‌ఫ్యాక్టరీ

Agriculture
Oil Palm Factory | తెలంగాణ రాష్ట్రంలో పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. తాము ఇచ్చిన హామీలన్నింటినీ పూర్తిగా అమలు చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఏడాది లోపే రూ. 300 కోట్లతో జిల్లాలో పామ్‌ ఆయిల్‌ ‌పరిశ్రమ (Oil Palm Factory) ను ప్రారంభిస్తామని మంత్రి వెల్లడించారు. పామ్‌ ఆయిల్ ఉత్పత్తిలో సిద్దిపేట జిల్లా దేశంలోనే మొదటి స్థానంలో ఉండాలని ఆకాంక్షించారు.గజ్వేల్‌ ‌మార్కెట్‌ ‌కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొండా సురేఖ, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. తర దేశాల నుంచి లక్ష కోట్లు పెట్టి పామ్‌ఆయిల్‌ దిగుమతి చేసుకుంటున్నామని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే 11 వేల ఎకరాల్లో పామాయిల్ సాగవుతోంది.  ఇంకా 11 వేల ఎకరాలకు పెంచాలి. భారత దేశానికి క...
River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే..