Saturday, August 23Lend a hand to save the Planet
Shadow

Tag: green mobility

Electric Bus | ఇప్పుడు భారత్ లో అత్య‌ధిక ఎల‌క్ట్రిక్ బ‌స్సులు ఉన్న న‌గ‌రం ఇదే..

Electric Bus | ఇప్పుడు భారత్ లో అత్య‌ధిక ఎల‌క్ట్రిక్ బ‌స్సులు ఉన్న న‌గ‌రం ఇదే..

General News
Electric Bus | భారతదేశంలో అత్యధిక ఎలక్ట్రిక్ బస్సులను కలిగి ఉన్న మొదటి నగరంగా అలాగే ప్రపంచవ్యాప్తంగా మూడవ నగరంగా న్యూఢిల్లీ అవతరించింది. ఈమేర‌కు మంగళవారం ఢిల్లీలో కొత్త‌గా 320 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వచ్చాయి, నగరంలో ప్ర‌స్తుతం ఎల‌క్ట్రిక్ బ‌స్సుల‌ సంఖ్య 1,970కి చేరుకుంది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా కొత్త బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ బస్సుల రాక‌పోక‌ల‌తో ఢిల్లీ కాలుష్యంపై పోరాటానికి బలం చేకూరుస్తుందని బాన్సెరాలో జరిగిన ఫ్లాగ్-ఆఫ్ కార్యక్రమంలో వీకే సక్సేనా చెప్పారు.ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. "మేము 320 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభిస్తున్నాం. ఇవి ఢిల్లీ ప్రజలకు ఉపశమనం కలిగిస్తాయి. రాబోయే కాలంలో, ఇటువంటి మరిన్ని బస్సులను అందుబాటులోకి తీసుకువ‌చ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. ఢిల్లీలో కాలుష్యం తగ్గించాల్సిన అవసరం ఉంటే, ప్రజా రవాణాను బలోపేతం చేయాలని నేను భావ...
Electric Scooter | రూ.69,9000లకే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫీచర్లు, ధర ఫుల్ డీటేయిల్స్ ఇవే..

Electric Scooter | రూ.69,9000లకే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫీచర్లు, ధర ఫుల్ డీటేయిల్స్ ఇవే..

E-scooters
Odysse EV | ప్ర‌ముఖ ఎల‌క్ట్రిక్ వాహ‌నాల త‌యారీ సంస్థ ఒడిస్సీ) కొత్త‌గా Odysse Snap, E2 అనే పేర్ల‌తో రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్లోకి విడుదల చేసింది. ఇందులో హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.79,999 అయితే రెండోది తక్కువ-స్పీడ్ మోడల్ ధర రూ. 69,999 (రెండూ ఎక్స్-షోరూమ్). మహారాష్ట్రలోని లోనావాలాలో జరిగిన ఒడిస్సీ వార్షిక డీలర్ల సమావేశంలో రెండు బ్యాటరీలతో నడిచే స్కూటర్‌లను ఆవిష్కరించారు.కొత్త ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ల లాంచ్ సంద‌ర్భంగా ఒడిస్సీ ఎలక్ట్రిక్ CEO నెమిన్ వోరా మాట్లాడుతూ.. “ SNAP హై-స్పీడ్ స్కూటర్, E2 తక్కువ-స్పీడ్ స్కూటర్ ప్రారంభంతో మేము స్థిరత్వం, కస్టమర్ సంతృప్తి పట్ల న‌మ్మ‌కంతో ఉన్నామ‌ని తెలిపారు. ఈ కొత్త ఆఫర్‌లు భారతదేశంలో, వెలుపల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు కొత్త ప్రమాణాలను తీసుకువ‌స్తాయ‌ని విశ్వాసం వ్య‌క్తం చేశారు. Odysse Snap, E2 స్పెసిఫికేష‌న్స్‌.. Odysse Snap, ...
Benefits of Electric Cars : భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంతో కలిగే ప్రయోజనాలు ఏమిటి?

Benefits of Electric Cars : భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంతో కలిగే ప్రయోజనాలు ఏమిటి?

Green Mobility
Benefits of Electric Cars | సాంప్రదాయ పెట్రోల్ డీజిల్ వాహనాలకు ప్ర‌త్యామ్నాయంగా ప‌ర్యావ‌ర‌ణ అనుకూల‌మైన‌ ఎలక్ట్రిక్ వాహనాలు (Electric Vehicles) ఇపుడు భార‌త‌దేశంలో ఎంతో ఆద‌ర‌ణ పొందుతున్నాయి. పెట్రోల్ లేదా డీజిల్ వాహనాల్లో ఉండే ఇంజిన్ కు బ‌దులుగా ఎలక్ట్రిక్ కార్లు పెద్ద బ్యాటరీ ప్యాక్‌లలో స్టోర్ అయిన‌ విద్యుత్ శ‌క్తితో ప‌రుగులు పెడుతాయి. పర్యావరణ ప్రభావం నిర్వహణ ఖర్చుల పరంగా సంప్రదాయ వాహనాల కంటే EVల‌తోనే అనేక ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి. భార‌త్ లో సంప్ర‌దాయ పెట్రోల్ వాహ‌నాల‌కు బ‌దులుగా ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌ను ఉప‌యోగించడం వ‌ల్ల ఏయే ప్ర‌యోజ‌నాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్ల ప్రయోజనాలు ఎలక్ట్రిక్ వాహనాలతో ముఖ్యమైన ప్రయోజనాలు తక్కువ నిర్వహణ ఖర్చులుEVల తో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన ఉప‌యోగం.. త‌క్కువ‌ నిర్వ‌హ‌ణ ఖ‌ర్చు. త‌ర‌చూ మారుతున్న‌ పెట్రోల్/డీజిల్ ధరల కంటే విద్యుత్ ధరల...
City Transformer | ఈ కారును ఈజీగా మడిచేసుకోవచ్చు.. ఇరుకైన స్థలంలోనూ పార్క్ చేయోచ్చు..

City Transformer | ఈ కారును ఈజీగా మడిచేసుకోవచ్చు.. ఇరుకైన స్థలంలోనూ పార్క్ చేయోచ్చు..

EV Updates
City Transformer | ఎలక్ట్రిక్ వాహనాల వాడకం ఇటీవలి కాలంలో విప‌రీతంగా పెరిగిపోయింది. ఈ క్ర‌మంలో కంపెనీలు విభిన్న‌మైన ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌ను త‌యారు చేస్తున్నాయి. అయితే కొన్ని కంపెనీలు మడిచేసుకోవడానికి వీలుగా ఉండే స్కూటర్లను ఇప్పటికే అందుబాటులోకి తెచ్చాయి. అలాగే ఇజ్రాయెలీ స్టార్టప్ కంపెనీ కూడా ఏకంగా మడిచేసుకోవడానికి వీలయ్యే కారు (Foldable Electric Car ) ను మార్కెట్లో విడుదల చేసింది.ఇజ్రాయెలీ(Israel) స్టార్టప్ కంపెనీ 'సిటీ ట్రాన్స్ ఫార్మర్స్స మ‌హా న‌గ‌రాల్లో ప్రాంతాల్లోని ట్రాఫి క్ ను దృష్టిలో పెట్టుకుని 'సీటీ-2' పేరుతో ఈ ఎలక్ట్రిక్ కారును అభివృద్ధి చేసింది. ఇందులోని ఫోల్డింగ్ మెకానిజం వల్ల ఈ కారు వీల్ బేస్ను పార్కింగ్ సమయంలో కుంచించుకునేలా చేయవచ్చు. ఇవి పార్కింగ్ ప్ర‌దేశాల్లో త‌క్కువ వెడ‌ల్పు ఉన్న ప్రాంతంలోకి కూడా దూరిపోతాయి. ఇలా మడిచేస్తే, వీల్ బేస్ 4.6 అడుగుల నుంచి కేవలం 39 అంగుళాల వెడల్...
Ather Rizta : రాబోయే కొత్త ఏథర్ స్కూటర్ లో ఇద్దరూ ఈజీగా కూర్చోగలిగే పెద్ద సీటు

Ather Rizta : రాబోయే కొత్త ఏథర్ స్కూటర్ లో ఇద్దరూ ఈజీగా కూర్చోగలిగే పెద్ద సీటు

EV Updates
Ather Rizta : ఏథర్ ఎనర్జీ న్యూ జనరేషన్ ఫ్యామిలీ స్కూటర్‌పై పని చేస్తోంది. ఇది ప్రస్తుతం ఉన్న ఏథర్ 450 ఎలక్ట్రిక్ స్కూర్లకు భిన్నంగా ఉండనుంది. కంపెనీ సహ వ్యవస్థాపకుడు, CEO, తరుణ్ మెహత రాబోయే ఎలక్ట్రిక్ స్కూటర్ అధికారిక పేరును  కటించారు.ఇటీవలి ట్వీట్‌లో, రాబోయే ఇ-స్కూటర్‌కు 'రిజ్తా' (Ather Rizta ) అని పేరు పెట్టనున్నట్లు మెహతా ధృవీకరించారు. బెంగళూరు ఆధారిత EV స్టార్టప్ నుండి ఈ స్కూటర్ ఫ్యామిలీ అంతటికీ సరిపోయేలా ఉంటుందని చెబుతున్నారు . అయితే మెహతా మరొక ట్వీట్‌ను పోస్ట్ చేసారు,తాజా ట్వీట్ రిజ్టాలో ఆఫర్‌లో ఉన్న పెద్ద సింగిల్-పీస్ సీటును చూపుతున్న ఫొటోను చూపించారు. ఆ ట్వీట్ లో ప్రస్తుతం మార్కెట్‌లో విక్రయిస్తున్న  ఇ-స్కూటర్‌లలో కంటే పెద్దదైన సింగిల్-పీస్ సీటుు అందిస్తున్నట్లు వెల్లడించారు.  ఇది రైడర్ కు, పిలియన్ ఇద్దరికీ సౌకర్యవంతంగా ఉంటుందని తెలిపారు. Ather Rizta లో ఏమి ఆశించవచ్చు? రి...
Tata Altroz EV | టాటా పంచ్ ఈవీ వచ్చేసింది.. ఇక ఆల్ట్రోజ్ EV విడుదలయ్యేది అప్పుడే..

Tata Altroz EV | టాటా పంచ్ ఈవీ వచ్చేసింది.. ఇక ఆల్ట్రోజ్ EV విడుదలయ్యేది అప్పుడే..

Electric cars
Tata Altroz ​​EV | టాటా మోటార్స్ EV విభాగంలోకి 2025 నాటికి  మరో నాలుగు కార్లను చేర్చేందుకు సిద్ధమవుతోంది.  టాటా మోటార్స్ 2019 జెనీవా మోటార్ షోలో ఆల్ట్రోజ్ EVని ప్రదర్శించింది. 2020 ఆటో ఎక్స్‌పోలో  క్లోజ్-టు-ప్రొడక్షన్ రూపంలో కూడా ప్రదర్శించింది. అయితే కొత్తగా తీసుకురాబోతున్న నాలుగు ఎలక్ట్రిక్ కార్లలో ఇది మొదటిదిగా భావిస్తున్నారు.  ఈ కాన్సెప్ట్ మొదటిసారి ప్రపంచ ప్రేక్షకులకు ప్రదర్శించబడిన ఐదు సంవత్సరాల తర్వాత  ఆల్ట్రోజ్ EV 2025లో భారతదేశంలో ప్రారంభించబడుతుందని తాజాగా తెలిసింది.జనవరి 28, 2020న నెక్సాన్ EV తర్వాత ఆల్ట్రోజ్ ఈవీని కూడా విడుదల చేస్తారని భావించారు. ఆల్ట్రోజ్ EVకి అడ్డంకి ఏమిటంటే ఫ్లోర్ కింద బ్యాటరీ ప్యాక్ ప్యాకేజింగ్, ఇది గ్రౌండ్ క్లియరెన్స్‌ను సుమారు 20 మిమీ నుంచి 145 మిమీ వరకు తగ్గించింది. క్లియరెన్స్ నష్టాన్ని భర్తీ చేయడానికి ఆల్ట్రోజ్‌ను పెంచడం అంత సులువుకాదు.. అది హాచ్ బ...
Electric 3-wheelers : అయోధ్యలో ఇకపై ఎలక్ట్రిక్ ఆటోల పరుగులు, గ్రీన్ మొబిలిటీ దిశగా అడుగులు

Electric 3-wheelers : అయోధ్యలో ఇకపై ఎలక్ట్రిక్ ఆటోల పరుగులు, గ్రీన్ మొబిలిటీ దిశగా అడుగులు

EV Updates
Ayodhya: రామ జన్మభూమి అయోధ్యలో క్లీన్, గ్రీన్ మొబిలిటీ కోసం కీలక ముందడుగు పడింది. ETO మోటార్స్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం(UP)లో 500 Electric 3-wheelers (e3Ws) ను  నడిపించడానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంతో ఈటో మోటార్స్ ఒక ఒప్పందాన్నికుదుర్చుకుంది. ఈ వ్యూహాత్మక ఒప్పందంలో భాగంగా యూపీలోని లక్నో, అయోధ్య, వారణాసి, ప్రయాగ్‌రాజ్, ఆగ్రా, మధుర,  గోరఖ్‌పూర్ వంటి నగరాల్లో పెట్రోల్ ఆటోలకు బదులు ఎలక్ట్రిక్ ఆటోలు పరుగులు పెట్టనున్నాయి. పవిత్రమైన ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శించే భక్తుల కోసం e3Ws రవాణా సౌకర్యాన్ని కల్పిస్తుంది.అయోధ్యలో  పర్యావరణ అనుకూలమైన Electric 3-wheelers ని ప్రవేశపెట్టడం  ద్వారా, ETO మోటార్స్ అయోధ్య నగర చారిత్రక ప్రాముఖ్యతను గౌరవించడమే కాకుండా స్థిరమైన, పరిశుభ్రమైన భవిష్యత్తుకు దోహదపడాలని లక్ష్యంగా పెట్టుకుంది. విస్తరణ అనేది కేవలం మౌలిక సదుపాయాల అభివృద్ధి మాత్రమే కాదు, కాలుష్యాన్ని తగ్గిం...
Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు