1 min read

హైదరాబాద్ లో తొలి BYD ఎలక్ట్రిక్ వాహనాల ఫ్యాక్టరీ.. ఏటా 600,000 కార్ల ఉత్పత్తి

BYD EV Manufacturing Unit : చైనా ఎలక్ట్రిక్ వాహనాల (EV) తయారీదారు BYD హైదరాబాద్ సమీపంలో ఒక ఉత్పత్తి యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తోంది. దీంతో BYD ఫ్యాక్టరీని నిర్వహిస్తున్న మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలవనుంది. రాష్ట్ర ప్రభుత్వంతో విస్తృతమైన చర్చల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టుకు భూమి కేటాయింపుతో సహా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి మద్దతును ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వం, నివేదిక ప్రకారం, ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమ కోసం […]

1 min read

Amara Raja | దివిటిపల్లిలో అమరరాజా ఈవీ బ్యాటరీ తయారీ పరిశ్రమ..

Amara Raja Giga Factory in Divitipalli | తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాలోని ఎలక్ట్రానిక్స్ తయారీ క్లస్టర్‌లో నాలుగు తయారీ యూనిట్లకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ శనివారం శంకుస్థాపన చేశారు. ఈ వేడుకలో భాగంగా, అమర రాజా కంపెనీ రాబోయే గిగా ఫ్యాక్టరీ-1 (Amara Raja Giga Factory 1) , లోహమ్ కంపెనీ కీలకమైన ఖనిజ శుద్ధి, బ్యాటరీ రీసైక్లింగ్ యూనిట్, స్సెల్ ఎనర్జీ సెల్ కేసింగ్ తయారీ యూనిట్, […]

1 min read

Hyderabad : మార్చి 2025 నాటికి హైదరాబాద్‌లో 353 కొత్త ఈ-బస్సులు

Hyderabad : హైద‌రాబాద్‌లో వాయు కాలుష్యాన్ని త‌గ్గించేందుకు TGSRTC ప‌టిష్ట‌మైన చ‌ర్య‌లు చేప‌డుతోంది. ఇందులోభాగంగా భాగ్యనగరంలో డీజిల్ బ‌స్సుల స్థానంలో ద‌శ‌ల‌వారీగా ఎల‌క్ట్రిక్ బ‌స్సుల‌ను తీసుకొస్తోంది. ప్రయాణికులకు మెరుగైన ప్రయాణ అనుభూతిని అందించేందుకు TGSRTC ఇప్ప‌టివ‌ర‌కు 1389 కొత్త బస్సులను కొనుగోలు చేసింది. వీటిలో 822 బస్సులు మహిళల కోసం ప్రత్యేకంగా మహాలక్ష్మి పథకానికి కేటాయించింది . కొత్త‌గా 353 ఎల‌క్ట్రిక్ బ‌స్సులు మార్చి 2025 నాటికి హైదరాబాద్‌లో 353 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను, కరీంనగర్, నిజామాబాద్, […]

1 min read

ఇకపై పత్తి రైతులకు వాట్సప్ సేవలు

Cotton Farmers | హైదరాబాద్ : పత్తి రైతుల సౌకర్యార్థం తెలంగాణ ప్రభుత్వం వాట్సప్ సేవలను ప్రారంభించింది. వాట్సప్ నంబర్ 8897281111 ద్వారా పత్తి అమ్మకం, కొనుగోళ్లకు సంబంధించిన వివరాలను అందించేందుకు వ్యవసాయ మార్కెటింగ్ శాఖ సన్నద్ధమైంది. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాల మేరకు పత్తి పంట క్రయవిక్రయాల్లో జాప్యాన్ని నివారించేందుకు ప్రభుత్వం ఈ సేవలను ప్రారంభించింది. పత్తి కొనుగోళ్లు, అమ్మకం, అర్హత, తదితర వివరాలు, చెల్లింపు స్థితి, సీసీఐ సెంటర్లలో వేచి ఉండే […]

1 min read

Oil Palm Factory | రాష్ట్రంలో రూ.300 కోట్లతో జిల్లాలో పామ్‌ ఆయిల్‌ ‌ఫ్యాక్టరీ

Oil Palm Factory | తెలంగాణ రాష్ట్రంలో పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. తాము ఇచ్చిన హామీలన్నింటినీ పూర్తిగా అమలు చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఏడాది లోపే రూ. 300 కోట్లతో జిల్లాలో పామ్‌ ఆయిల్‌ ‌పరిశ్రమ (Oil Palm Factory) ను ప్రారంభిస్తామని మంత్రి వెల్లడించారు. పామ్‌ ఆయిల్ ఉత్పత్తిలో సిద్దిపేట జిల్లా దేశంలోనే మొదటి స్థానంలో ఉండాలని ఆకాంక్షించారు. గజ్వేల్‌ ‌మార్కెట్‌ […]

1 min read

Agri News | రైతులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గుడ్ న్యూస్..

Agri News  | తెలంగాణ ప్ర‌భుత్వం రైతుల‌కు గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వరి సన్నాలకు క్వింటాకు రూ.500 బోన‌స్ పై కీలక ప్రకటన చేసింది. ఈ ఖరీఫ్ సీజన్ నుంచే సన్న వడ్లు పండించిన రైతులకు క్వింటాలకు రూ.500 చొప్పున బోనస్ ఇవ్వనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్ల‌డించారు. మ‌రోవైపు రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు, హెల్త్ కార్డుల మంజూరు కోసం కోసం గైడ్ లైన్స్ రూపొందించేందుకు గాను మంత్రి […]

1 min read

Kharif Season | దెబ్బ‌తీసిన వ‌ర్షాలు.. తెలంగాణలో గత ఐదేళ్లలో ఈసారి అత్యల్ప సాగు

Kharif Season | హైదరాబాద్ : ఈ వనకాలం (ఖరీఫ్) సీజన్‌లో తెలంగాణలో పంటల సాగు తీవ్రంగా ప‌డిపోయింది.మొత్తం పంట విస్తీర్ణం దాదాపు 1.23 కోట్ల ఎకరాలకే పరిమితమైంది. గత ఏడాది ఇదే కాలంలో 1.29 కోట్ల ఎకరాల సాధారణ విస్తీర్ణంలో 1.28 కోట్ల ఎకరాల్లో సాగు చేశారు. సీజన్ ముగియడానికి ఇంకా రెండు వారాల కంటే తక్కువ సమయం ఉంది. మొత్తం పంట విస్తీర్ణం ఇప్ప‌టికిప్పుడు మెరుగుపడే అవకాశం లేదు. గ‌తేడాది స‌మ‌యానికి పంట‌ల‌కు స‌రిప‌డా […]

1 min read

Free Solar Power | తెలంగాణలో 22 గ్రామాలకు ఉచితంగా సోలార్ కరెంట్..!

Free Solar Power |  సోలార్ విద్యుత్ ఉత్పత్తిపై  తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది   సోలార్ విద్యుత్‌ను ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి రేవంత్ ఇటీవల అధికారులకు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలోనే డిప్యూటీ సీఎం భట్టి కూడా కీలక ప్రకటన చేశారు. 22 గ్రామాలకు ప్రభుత్వ ఖర్చుతో ఉచితంగా సోలార్ విద్యుత్ అందిస్తామని  వెల్లడించారు. ఫైలట్ ప్రాజెక్టుగా కొన్ని గ్రామాలను ఎంపిక చేసినట్లు తెలిపారు. తెలంగాణలో ఇప్పటికే పేదలకు 200 యూనిట్ల వరకు […]

1 min read

Palm Oil | పామాయిల్‌ రైతులకు కేంద్రం గుడ్ న్యూస్

Palm Oil | హైదరాబాద్‌ : పామాయిల్‌ రైతులకు కేంద్రంలోని మోదీ ప్ర‌భుత్వం గుడ్ న్యూస్‌ చెప్పింది. ఈ పామ్ ఆయిల్‌ రైతులకు ఊరటనిచ్చేలా ముడి పామాయిల్‌ దిగుమతి సుంకాన్ని పెంచింది. దిగుమతి సుంకాన్ని 5.5శాతం నుంచి ఏకంగా 27.5 శాతానికి పెంచుతూ కేంద్ర ప్ర‌భుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహన్‌కు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ధ‌న్య‌వాదాలు తెలిపారు. దిగుమతి సుంకం పెంపుతో […]