Omega Seiki నుంచి రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు
పండుగ సీజన్లో ప్రారంభం
గంటకు 45 km/h వేగం
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 85 కిలోమీటర్లOmega Seiki మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ (OSM) ఇటీవల తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్లను ఆవిష్కరించింది. ఈ మోడళ్ల పేర్లు జోరో మరియు ఫియారే. ఈ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల బుకింగ్లు 2021 ఆగష్టు నెలాఖరుకు ప్రారంభమవుతాయి. ఇవి పండుగ సీజన్లో డెలివరీలు ప్రారంభం కానున్నాయి. Omega Seiki సంస్థ తన కొత్త ఉత్పత్తులను పూణేలోని కొత్త ఫ్లాగ్షిప్ షోరూమ్లో ఇటీవల ప్రదర్శించింది. OSM ఎలక్ట్రిక్ వాహనాలు జోరో అలాగే ఫియారే ఒక్కసారి ఛార్జ్ చేస్తే 85 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణిస్తాయి. ఇవి గంటకు 45 km/h వేగంతో వెళ్తాయి. ఈ వాహనాలు ఏడు రంగులలో అందుబాటులో ఉంటాయి.
ఈ ఏడాది చివరినాటికి 115 షోరూంలు
ఒమేగా సీకి మొబిలిటీ వ్యవస్థాపకుడు ఉదయ్ నారంగ్ మాట్లాడుతూ.. తాము B2B సెక్టార్ కోసం తమ ఎలక్ట్రిక్ స్కూటర్లలో ప్రత్య...