వ్యవసాయం
ఉద్యాన పంటలు
సోలార్ పవర్
ఈవీ అప్డేట్స్
General News
లైఫ్ స్టైల్
స్పెషల్
పర్యావరణం
Ethanol News: BPCL నుండి దేశవ్యాప్తంగా 4,279 ఇథనాల్ పెట్రోల్ స్టేషన్లు
Ethanol News | దేశవ్యాప్తంగా సుస్థిరమైన రవాణా మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు, గ్రీన్ మొబిలిటీని విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. తాజాగా భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) తన E20 ఫ్యూయల్ స్టేషన్లను విస్తరించేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోంది . E20 పెట్రోల్ అంటే (20% ఇథనాల్ మిళితం) 20% అన్హైడ్రస్ ఇథనాల్ మిశ్రమం, 80% మోటారు గ్యాసోలిన్ కలిపి E20 పెట్రోల్ గా తయారుచేస్తారు BPCL యొక్క E20 నెట్వర్క్ 4,279 […]
PM-ASHA | రైతులకు కేంద్రం గుడ్ న్యూస్.. పీఎం ఆశా పథకం కొనసాగింపు
PM-ASHA | రైతులకు లాభదాయకమైన ధరలను అందించడానికి, వినియోగదారులకు అవసరమైన వస్తువుల ధరల హెచ్చుతగ్గులను నియంత్రించడానికి ప్రధాన మంత్రి అన్నదాత ఆయ్ సంరక్షణ అభియాన్ (PM-ASHA) పథకాలను కొనసాగించడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 15వ ఆర్థిక సంఘం సమయంలో 2025-26 వరకు దీనిపై మొత్తం ఆర్థిక వ్యయం రూ.35,000 కోట్లు వెచ్చించింది. రైతులు, వినియోగదారులకు మరింత సమర్ధవంతంగా సేవలందించేందుకు ప్రభుత్వం ధరల మద్దతు పథకం (PSS), ధరల […]
పెట్రోల్ బైక్ కన్నా చవకైన.. సరికొత్త ఎలక్ట్రిక్ బైక్ వచ్చేసింది.. ధర రూ. 84,990.. మైలేజీ 100 కి.మీ
Revolt Motors | పెట్రోల్ బైక్ కంటే చవకగా హర్యానాకు చెందిన రివోల్ట్ మోటార్స్ తన సరికొత్త ఎలక్ట్రిక్ మోటార్సైకిల్ (e-Motorcycle)ని విడుదల చేసింది. ఇందులో బేసిక్ వేరియంట్ Revolt RV1 ప్రారంభ ధర కేవలం రూ.84,990 మాత్రమే.. ప్రీమియం వేరియంట్ Revolt RV1+ ను రూ.99,990 ఎక్స్ షోరూం ధరతో పరిచయం చేసింది. దేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ లీడర్ అయిన ఓలా ఎలక్ట్రిక్ ఇటీవలే రోడ్స్టర్ సిరీస్ ఇ-బైక్ను గత నెలలో ఆవిష్కరించిన విషయం తెలిసిందే. […]
Renewable Energy | పునరుత్పాదక ఇంధన రంగంలో రూ. 32.5 లక్షల కోట్ల నిధులు
Renewable Energy : గుజరాత్ రాజధాని గాంధీనగర్ లో జరిగిన పునరుత్పాదక ఇంధన సదస్సు (RE Invest 2024 ) లో పలు రాష్ట్రాలు భాగస్వాములయ్యాయని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ (Pralhad Joshi) తెలిపారు. 2030 నాటికి రెన్యూవబుల్ ఎనర్జీ రంగంలో రూ. 32.5 లక్షల కోట్ల నిధులు సమకూర్చేందుకు బ్యాంకులు, ఆర్ధిక సంస్ధలు ముందుకొచ్చాయని పేర్కొన్నారు. సంప్రదాయ విద్యుత్ రంగాన్ని పునరుత్పాదక ఇంధన రంగంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికా బద్దంగా పనిచేస్తోందని తెలిపారు. […]
పీఎం సోలార్ రూఫ్టాప్ స్కీమ్ కోసం 1.3 కోట్ల కుటుంబాల దరఖాస్తు..
PM Rooftop Solar Scheme | ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పీఎం సోలార్ రూఫ్టాప్ స్కీమ్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు 1.3 కోట్లకు పైగా కుటుంబాలు ఈ పథకం కోసం నమోదు చేసుకున్నాయి. గుజరాత్లోని గాంధీనగర్ జిల్లాలో సోమవారం జరిగిన 4వ గ్లోబల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ (రీ-ఇన్వెస్ట్) 2024 ప్రారంభోత్సవ కార్యక్రమంలో మోదీ (PM Modi) కీలక వ్యాఖ్యలు చేశారు. సోలార్ రూఫ్టాప్ పథకం ప్రారంభించినప్పటి నుంచి.. సుమారు 3.75 లక్షల […]
Bhatti Vikramarka | సోలార్ రంగంలో పెట్టుబడులకు ఆహ్వానం..
Solar Power | తెలంగాణ రాష్ట్రం 2035 నాటికి 40 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసే రాష్ట్రంగా ఎదుగుతుందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) తెలిపారు. గుజరాత్ రాజధాని గాంధీనగర్ లోని మహాత్మా మందిర్ కన్వెన్షన్ అండ్ ఎగ్జిబిషన్ సెంటర్ లో నిర్వహించిన గ్రీన్ పవర్ ఎనర్జీ పెట్టుబడిదారుల సమావేశంలో భట్టి విక్రమార్క మాట్లాడారు. ప్రధానమంత్రి మోదీ అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించారు. ఈ సదంర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. […]
Agri News | రైతులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గుడ్ న్యూస్..
Agri News | తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వరి సన్నాలకు క్వింటాకు రూ.500 బోనస్ పై కీలక ప్రకటన చేసింది. ఈ ఖరీఫ్ సీజన్ నుంచే సన్న వడ్లు పండించిన రైతులకు క్వింటాలకు రూ.500 చొప్పున బోనస్ ఇవ్వనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. మరోవైపు రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు, హెల్త్ కార్డుల మంజూరు కోసం కోసం గైడ్ లైన్స్ రూపొందించేందుకు గాను మంత్రి […]
Model Solar City | సోలార్ సిటీగా అయోధ్య.. దేశవ్యాప్తంగా మరో 17 నగరాల ఎంపిక
Model Solar City | రామ జన్మభూమి అయోధ్యను “మోడల్ సోలార్ సిటీ (Model Solar City)”గా అభివృద్ధి చేయడానికి కేంద్రం కృషి చేస్తోందని, దీనికి సంబంధించిన పనులు దాదాపు పూర్తి కావస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) తెలిపారు. అయోధ్య తరహాలో అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో దేశంలోని మరో 16 నగరాలను ప్రభుత్వం గుర్తించిందని ఆయన సోమవారం వెల్లడించారు. గుజరాత్లోని గాంధీనగర్లో జరిగిన 4వ గ్లోబల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్లో ప్రసంగిస్తూ ప్రధాని […]
Kharif Season | దెబ్బతీసిన వర్షాలు.. తెలంగాణలో గత ఐదేళ్లలో ఈసారి అత్యల్ప సాగు
Kharif Season | హైదరాబాద్ : ఈ వనకాలం (ఖరీఫ్) సీజన్లో తెలంగాణలో పంటల సాగు తీవ్రంగా పడిపోయింది.మొత్తం పంట విస్తీర్ణం దాదాపు 1.23 కోట్ల ఎకరాలకే పరిమితమైంది. గత ఏడాది ఇదే కాలంలో 1.29 కోట్ల ఎకరాల సాధారణ విస్తీర్ణంలో 1.28 కోట్ల ఎకరాల్లో సాగు చేశారు. సీజన్ ముగియడానికి ఇంకా రెండు వారాల కంటే తక్కువ సమయం ఉంది. మొత్తం పంట విస్తీర్ణం ఇప్పటికిప్పుడు మెరుగుపడే అవకాశం లేదు. గతేడాది సమయానికి పంటలకు సరిపడా […]
